రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

శాంతి పరిరక్షణలో కొత్తగా పుట్టుకొస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి, ప్రపంచ శాంతిని పరిరక్షించడానికి మెరుగైన సంప్రదింపులు, సహకారం, సమన్వయం, సామర్థ్య నిర్మాణమే కీలకం: యూఎన్ దళాలకు సహకారమందిస్తున్న దేశాల ప్రధాన సైనికాధికారులతో రక్షణ మంత్రి


‘‘సాంకేతికత, ఆర్థిక సామర్థ్యాల్లో ముందున్న దేశాలు శాంతి పరిరక్షక కార్యకలాపాలను కొనసాగించడానికి అవసరమైన సాయాన్ని అందించాలి’’

‘‘వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా, సభ్యదేశాలన్నింటికీ మాట్లాడే అవకాశాన్నిచ్చేలా, సమకాలీన సమస్యలను పరిష్కారించేలా, మానవ సంక్షేమంపై దృష్టి సారించేలా సంస్కరించిన బహుపాక్షిక విధానం పరస్పరం అనుసంధానమైన నేటి ప్రపంచానికి అవసరం’’

‘‘ఆఫ్రికా, మధ్యప్రాచ్యం వ్యాప్తంగా చేపడుతున్న కార్యకలాపాల్లో సేవలందించిన భారతీయ మహిళా అధికారులు సాధికారతకు ప్రపంచ చిహ్నంగా నిలిచారు’’

‘‘కొన్ని దేశాలు అంతర్జాతీయ నియమాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయి.. కాలం చెల్లిన అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలను కోరుతూనే.. నియమ ఆధారిత విధానాన్ని భారత్ సమర్థిస్తుంది’’

Posted On: 14 OCT 2025 1:41PM by PIB Hyderabad

కొత్తగా పుట్టుకొస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికిప్రపంచ శాంతిని పరిరక్షించేందుకు ఐక్యరాజ్య సమితి చేస్తున్న శాంతి ప్రయత్నాలకు తోడ్పడుతున్న దేశాలకు మార్గనిర్దేశక సూత్రంగా మెరుగైన సంప్రదింపులుసహకారంసమన్వయంసామర్థ్య నిర్మాణం అనే - 4సీ సూత్రాన్ని రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ సూచించారుభారత్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న చీఫ్స్ కాంక్లేవ్ ప్రారంభ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ ట్రూప్ కంట్రిబ్యూటింగ్ కంట్రీస్ (యూఎన్‌టీసీసీ)కు చెందిన ఉన్నత స్థాయి సైనికాధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారుఈ కార్యక్రమం న్యూఢిల్లీలోని మానెక్‌షా సెంటర్లో 2025 అక్టోబర్ 14 నుంచి 16 వరకు జరుగుతుంది.

యుద్ధంఉగ్రవాదంసున్నితమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్న అస్థిర వాతావరణంలో మోహరింపుల దగ్గర నుంచి.. మానవతా సంక్షోభాలుమహమ్మారులుప్రకృతి వైపరీత్యాలుఅసత్య ప్రచారాలను ఎదుర్కోవడం వరకు శాంతి రక్షక బలగాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లలో పెరుగుతున్న సంక్లిష్టతను రక్షణ మంత్రి వివరించారుబలగాలుపోలీసులురవాణా సదుపాయాలుసాంకేతికతప్రత్యేక సామర్థ్యాల ద్వారా శాంతి పరిరక్షణ కార్యకలాపాలను కొనసాగించేందుకు సహకారాన్ని మరింత విస్తరించాలని సభ్యదేశాలకు.. ముఖ్యంగా సాంకేతికంగా ముందంజలో ఉన్నఆర్థిక సామర్థ్యాలున్న వాటిని కోరారుభద్రమైన సమాచార ప్రసారపర్యవేక్షణ వ్యవస్థలుమానవ రహిత వాహనాలు వంటి ఆవిష్కరణలను.. శాంతి కార్యకలాపాలను మరింత సురక్షితంగాప్రభావవంతంగా చేపట్టేందుకు దోహదపడతాయని స్పష్టం చేశారు.


 

‘‘కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోడానికి భాగస్వామ్య దేశాల బలగాల్లో ధైర్యంఅనుసరణఆవిష్కరణల కంటేయుద్ధ వాతావరణాన్ని ప్రభావితం చేయడానికి సంబంధిత రాజకీయ నాయకులుఆర్థిక భాగస్వామ్యం అందించే దేశాలుఇతర కీలక వ్యక్తులను భాగం చేసే మిషన్ స్థాయిలో సమగ్ర విధానం అవసరంమోహరింపులో ఆలస్యంవనరుల కొరతయుద్ధాలకు మూల కారణాలను పరిష్కరించేందుకు తగిన ఆదేశాలు లేకపోవడం వల్ల ఈ కార్యకలాపాలు ప్రభావాన్ని చూపడంలో తరచూ వెనకబడిపోతున్నాయికాలం చెల్లిన బహుపాక్షిక సంస్థలతో ఆధునిక సమస్యలను పరిష్కరించలేంసమగ్ర సంస్కరణలు లేకపోతే.. ఐక్యరాజ్య సమితిపై విశ్వాసం లోపిస్తుందిప్రస్తుతం ఉన్న పరస్పరం అనుసంధానమైన ప్రపంచంలో సంస్కరించిన బహుపాక్షిక విధానం అవసరంఇది వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలాసభ్యదేశాలన్నింటికీ మాట్లాడే అవకాశాన్నిచ్చేలాసమకాలీన సమస్యలను పరిష్కరించేలామానవ సంక్షేమంపై దృష్టి సారించేలా ఉండాలి’’ అని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు

అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడేందుకు ఐక్యరాజ్యసమితి చేపట్టే కార్యక్రమాలకు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలిచిందనిఈ నిబద్ధత పట్ల దృఢంగా వ్యవహరిస్తోందని రక్షణ మంత్రి తెలియజేశారు. ‘‘గడచిన దశాబ్దాల్లో 2,90,000 మంది భారతీయ సిబ్బంది 50కి పైగా యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో సేవలందించారువారి వృత్తి నిబద్ధతధైర్యంకరుణ అంతర్జాతీయ గుర్తింపు పొందాయికాంగోకొరియా నుంచి దక్షిణ సూడాన్లెబనాన్ వరకు దుర్బల పరిస్థితుల్లో ఉన్నవారిని రక్షించడానికిఆయా ప్రాంతాలను పునర్నిర్మించడానికి మా సైనికులుపోలీసులువైద్య నిపుణులు అంతర్జాతీయ సమాజంతో కలసి పనిచేశారుశాంతి పరిరక్షణను మరింత ప్రభావవంతంగాజవాబుదారీతనంగా మార్చేందుకు బలగాలను అందించడానికినైపుణ్యాలను పంచుకోవడానికిసంస్కరణలకు మద్దతు ఇవ్వడానికి మేం సిద్దంగా ఉన్నాంసహకారంసాంకేతికతను పంచుకోవడం ద్వారా మెరుగుపరిచిన సన్నద్ధతమరింత అనుసరణీయత కలిగినమరింత మానవత్వం నిండిన మిషన్లను మనం ఏర్పాటు చేయగలం’’ అని ఆయన తెలిపారు.


 

శాంతి పరిరక్షణ విజయం అంకెల్లో కాదనిసన్నద్ధతలోనే ఉంటుందన్న శ్రీ రాజనాథ్ సింగ్న్యూఢిల్లీలో ఉన్న యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ సెంటర్ ద్వారా 90 దేశాలకు చెందినవారికి శిక్షణ ఇచ్చామని తెలిపారుమిషన్ విజయానికి అవసరమైన పరస్పర అవగాహనను పెంపొందించడానికి.. మిత్ర దేశాలకు చెందిన శాంతి పరిరక్షకులకు శిక్షణ ఇవ్వడానికివారి మధ్య సమన్వయ కార్యాచరణను అభివృద్ధి చేయడానికి అవసరమైన సామర్థ్యాలు భారత్ వద్ద ఉన్నాయని తెలియజేశారు.

ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా తక్కువ ఖర్చులోనే దేశీయ సాంకేతికతలను భారత్ అభివృద్ధి చేసిందని రక్షణ మంత్రి అన్నారుఇవి వాహనాలుభద్రమైన సమాచార ప్రసారపర్యవేక్షణ వ్యవస్థలుమానవ రహిత వైమానిక వాహనాలువైద్య సహాయ పరిష్కారాల ద్వారా శాంతి పరిరక్షక కార్యకలాపాలను బలోపేతం చేస్తాయని వివరించారు.

శాంతి పరిరక్షక దళాల్లో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యాన్ని స్ఫూర్తిదాయకమైన పరివర్తనల్లో ఒకటిగా శ్రీ రాజనాథ్ సింగ్ వర్ణించారువారి భాగస్వామ్యం మిషన్ ప్రభావాన్ని మరింత పెంచుతుందనిస్థానిక ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడానికికార్యకలాపాల్లో సహానుభూతిని పెంచడానికి తోడ్పడుతుందన్నారు. ‘‘ఈ విషయంలో భారత్ మార్గదర్శిగా ఉంది. 2007లో లైబీరియాలో మోహరించిన పూర్తిగా మహిళలతో కూడిన పోలీస్ యూనిట్ సాధికారతకు అంతర్జాతీయ చిహ్నంగా మారిందివృత్తి పట్ల వారి నిబద్ధతకరుణ జాతీయ పోలీస్ విభాగంలో చేరేలా ఒక తరానికి చెందిన లైబీరియన్ మహిళలకు స్ఫూర్తినిచ్చిందిప్రస్తుతం దక్షిణ సూడాన్గోలన్ హైట్స్లెబనాన్లో చేపడుతున్న కార్యకలాపాల్లో భారతీయ మహిళా అధికారులు సేవలందిస్తున్నారువారు గస్తీ నిర్వహణలోసమాజంతో మమేకమవ్వడంలోస్థానిక మహిళలుయువతకు మార్గనిర్దేశం చేయడంలో గణనీయమైన కృషి చేస్తున్నారుసమ్మిళిత్వంగౌరవంనమ్మకం ద్వారా ఆధునిక శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో ఏం సాధించవచ్చో వారు చేసి చూపిస్తున్నారుడెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చేపట్టిన యూఎన్ శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో అత్యుత్తమ సేవలందించిన భారతీయ సైనిక దళానికి చెందిన శాంతి పరిరక్షకురాలికి 2024లో యునైటెడ్ నేషన్స్ మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది’’ అని మంత్రి తెలిపారు.

 


 

వైద్య శాంతి పరిరక్షకుల భాగస్వామ్యం గురించి రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ఆఫ్రికా వ్యాప్తంగా ఉన్న యూఎన్ ఫీల్డ్ ఆసుపత్రుల్లో వేలాది మంది ప్రజలకుశాంతి పరిరక్షకులకు భారతీయ వైద్య బృందం చికిత్స అందించిందని వెల్లడించారు. ‘‘తరచూ ప్రతికూలతలు ఎదురయ్యే పరిస్థితుల మధ్య వారు అందించే సేవలో.. భారతీయ శాంతి పరిరక్షకుల ఉత్తమ సంప్రదాయాలుమానవత్వ స్ఫూర్తి నిండిన యూఎన్ విధానం నిండి ఉన్నాయి’’ అని వివరించారు.

విశ్వగురువుగా ఎదగాలన్న భారత దేశ ఆకాంక్ష.. ఆధిపత్యాన్ని ప్రకటించడం కోసం కాదని సహకారాత్మకసమ్మిళిత అభివృద్ధికి ఇస్తున్న పిలుపు అని శ్రీ రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారుఅహింసఅంతర్గత శాంతి అనే వారసత్వ విలువలను పంచుకోవడం ద్వారా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణశాంతి నిర్మాణ కార్యకలాపాలను బలోపేతం చేయవచ్చనిసామరస్యంతో నిండిన ప్రపంంచ శాంతిని ప్రోత్సహించవచ్చనే భారత నమ్మకాన్ని ఆయన తెలియజేశారు.

‘‘ఇటీవలి కాలంలో అంతర్జాతీయ చట్టాలను కొన్ని దేశాలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయిఆ చట్టాలను అణచివేసేందుకు మరికొన్ని ప్రయత్నిస్తున్నాయిఇంకొన్ని దేశాలు సొంత నియమాలు రూపొందించుకొని రాబోయే శతాబ్దంలో ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తున్నాయివీటన్నింటి మధ్య.. కాలం చెల్లిన అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలను కోరుతూనే.. నియమ ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను సమర్థించాలని భారత్ బలంగా వాదిస్తోంది. మహాత్మా గాంధీ పుట్టిన భూమి భారత్అహింసశాంతి మూలాలు మా విధానంలో బలంగా పాతుకుపోయాయిమహాత్మాగాంధీ దృష్టిలో శాంతి అంటే యుద్ధం జరగకపోవడం కాదు.. న్యాయంసామరస్యంనైతిక బలాల సానుకూల స్థితి’’ అని రక్షణమంత్రి అన్నారు.


 

చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రారంభోపన్యాసం చేస్తూ.. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణలో దీర్ఘకాలంగా భారత్ అందిస్తున్న సహకారాన్ని తెలియజేశారున్యూఢిల్లీలో ఉన్న యూన్ శాంతి పరిరక్షణ కేంద్రం లాంటి సంస్థల ద్వారా కార్యాచరణ నైపుణ్యంసాంకేతిక ఆవిష్కరణలుసామర్థ్య నిర్మాణం అందించేందుకు భారత సైన్యం సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు.

శాంతి పరిరక్షణలో ఆవిష్కరణలుసమ్మిళిత్వంకార్యకలాపాల్లో సమన్వయం అవసరాన్ని చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ స్పష్టం చేశారుఅంతర్జాతీయ భాగస్వాములకు రక్షణ రంగంలో సమర్థవంతమైన పరిష్కారాలను భారత్ అనుసరిస్తున్న ఆత్మనిర్భర భారత్ ఇస్తుందని స్పష్టం చేశారు.

ప్రపంచ శాతి కార్యకలాపాల భవిష్యత్తును సమష్టిగా రూపొందించడానికి చేపట్టిన ఈ కార్యక్రమంలో త్రివిధ దళాదిపతి జనరల్ అనిల్ చౌహాన్వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్శాంతి కార్యకలాపాల అండర్-సెక్రటరీ-జనరల్ జీన్ పియర్ లక్రోయిక్స్ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ఇతర సైనిక ఉన్నతాధికారులుప్రభుత్వాధికారులుప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు.


 


 

యూఎన్ శాంతి కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న 32 దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారులను ఒక్క చోట చేర్చిన యూఎన్‌టీసీసీ చీఫ్స్ కాంక్లేవ్‌కు భారతీయ ఆర్మీ ఆతిథ్యమిచ్చిందిఅల్జీరియాఆర్మేనియాఆస్ట్రేలియాబంగ్లాదేశ్భూటాన్బ్రెజిల్బురుండీకాంబోడియాఈజిప్టుఇథియోపియాఫిజీఫ్రాన్స్ఘనాఇటలీకజకిస్థాన్కెన్యాకిర్గిస్థాన్మడగాస్కర్మలేషియామంగోలియామొరాకోనేపాల్నైజీరియాపోలండ్రువాండాశ్రీలంకసెనెగల్టాంజానియాథాయ్‌లాండ్ఉగాండాఉరుగ్వేవియత్నాం దేశాలు ఈ కాంక్లేవ్‌లో పాల్గొన్నాయిఉమ్మడి సామర్థ్య నిర్మాణానికి ఉద్దేశించిన రక్షణ ఎగ్జిబిషన్లు ఈ కాంక్లేవ్‌లో ఏర్పాటు చేశారు.

కార్యాచరణ సవాళ్లనుకొత్తగా పుట్టుకొస్తున్న ముప్పులను పరిష్కరించడానికికార్యకలాపాల నిర్వహణలో దేశాల మధ్య సమన్వయానికినిర్ణయాల్లో సమ్మిళిత్వానికియూఎన్ శాంతిపరిరక్షణను బలోపేతం చేయడంలో సాంకేతికతశిక్షణ ప్రాధాన్యాన్ని బలోపేతానికి కృషి చేసే వేదికగా యూఎన్‌టీసీసీ పనిచేస్తుందికార్యాచరణ సవాళ్లుకొత్తగా పుట్టుకొస్తున్న ముప్పులుఉత్తమ పద్ధతులను పంచుకోవడంభవిష్యత్తు శాంతి కార్యకలాపాలపై ఉమ్మడి అవగాహనను పెంపొందించడంపై చర్చించేందుకు ఈ ఉన్నత స్థాయి సమావేశాన్ని యూఎన్ కార్యకలాపాల్లో అతిపెద్ద భాగస్వాముల్లో ఒకరిగా ఉన్న భారత్ నిర్వహించిందివసుధైవ కుటుంబకం ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనే సూత్రాన్ని ఈ కాంక్లేవ్ ప్రతిబింబిస్తుంది.

 

****


(Release ID: 2179262) Visitor Counter : 6