ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ వర్ధంతి సందర్భంగా ప్రధాని నివాళి
Posted On:
08 OCT 2025 10:01AM by PIB Hyderabad
బీహార్కు చెందిన ప్రముఖ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో చేసిన పోస్టులో ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘సామాజిక న్యాయానికి ప్రతినిధి, ప్రజాసేవ పట్ల అంకితభావం ఉన్న నేత, బీహార్కు చెందిన ప్రముఖ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ పుణ్యతిథి సందర్భంగా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. సమాజంలో అణగారిన, దోపిడీకి గురయిన వర్గాల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారు. రాజకీయాలకూ, దేశ నిర్మాణానికీ ఆయన చేసిన కృషి మరువలేనిది’’
***
(Release ID: 2176306)
Visitor Counter : 6
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam