వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పత్రికా ప్రకటన


అమల్లోకి వచ్చిన ఇండియా-ఈఎఫ్‌టీఏ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం

నాడు పోస్టు చేయడమైనది: 01 OCT 2025 9:55PM by PIB Hyderabad

భారత్ఈఎఫ్‌టీఏ దేశాలు (ఐస్‌లాండ్లీచ్టెన్‌స్టెయిన్నార్వేస్విట్జర్లాండ్మధ్య కీలకమైన వాణిజ్యఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టీఈపీఏ)-2025 అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిందిఇరు పక్షాల మధ్య వాణిజ్యఆర్థిక సంబంధాలలో ఒక ముఖ్యమైన ముందడుగుగా ఇది నిలుస్తోందిఅత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తోందిఈఎఫ్‌టీఏ దేశాలన్ని కలిసి వస్తువులుసేవల వాణిజ్యం..  రెండింటిలోనూ ప్రపంచ నాయకత్వ స్థానంలో ఉన్నాయిభారత్ఈఎఫ్‌టీఏ దేశాలు కలిస్తే సుమారు 5.4 ట్రిలియన్ డాలర్ల జీపీడీ ఉందిఇది ఇరు పక్షాల మధ్య మరింత ధృడమైన సంబంధాలకు ఉన్న అవకాశాలను తెలియజేస్తోంది

ఈ సందర్భంగా ఢిల్లీలో సమృద్ధి సదస్సు (ప్రోస్పెరిటీ సమ్మిట్పేరుతో భారత వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఉన్నత స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారుస్విట్జర్లాండ్ దేశ ఆర్థిక వ్యవహారాల కార్యాలయం స్టేట్ సెక్రటరీ హెలీన్ బడ్లిగర్ ఆర్టీడాఐస్లాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్యంఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ జనరల్ రాగ్నార్ క్రిస్ట్‌జాన్సన్లీచ్టెన్‌స్టెయిన్ విదేశాంగ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ క్రిస్టీన్ లింగ్భారతదేశంలో నార్వే రాయబారి మే-ఎలిన్ స్టెనర్ఈఎఫ్‌టీఏ డిప్యూటీ సెక్రటరీ జనరల్ మార్కస్ ష్లాగెన్‌హాఫ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుకొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికిఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి అవకాశాన్ని అందించిన ఈ కార్యక్రమం.. అన్ని దేశాల వ్యాపార ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిందిఇక్కడ చేపట్టిన వాణిజ్యపరమైన చర్చలు..  ప్రిసిషన్ తయారీహరిత సాంకేతికతలో సహోత్పత్తిని సులభతరం చేయటంతో పాటు అంచనా వేయదగిన చలనశీలతఅర్హతల గుర్తింపు ద్వారా సేవలను పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తాయి

పదిహేను సంవత్సరాల్లో భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టాలన్న ఉమ్మడి లక్ష్యాన్ని ప్రతినిధులు స్వాగతించారుఇది 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందిఈ పెట్టుబడులను పర్యవేక్షించేందుకుసులభతరం చేసేందుకు యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు

టీఈపీఏ అమలవ్వటం.. ఈఎఫ్‌టీఏ దేశాలుభారత్ మధ్య సంబంధాలను మరింతగా పెంచడంభాగస్వామ్యాలను ఏర్పాటు చేయటంతో పాటుగా వాణిజ్యంపెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ఒక నిర్ణయాత్మక పురోగతిగా నిలుస్తుందిప్రమాణాల విషయంలో భాగస్వామ్యంనియంత్రణకు సంబంధించిన చర్చల సహకారంతో వస్తు సేవలుపెట్టుబడులలో వాణిజ్యాన్ని విస్తరించడంవాణిజ్యపరమైన కార్యకలాపాల్లో ఏకీకరణను బలోపేతం చేయడం ద్వారా అన్ని పక్షాలు సమతుల్యస్థిరమైన ఫలితాలను అందుకోనున్నాయి

ఈ ఒప్పందం మరింత ధృడమైనమెరుగైన సమీకృత సరఫరా వ్యవస్థ వాణిజ్యంపెట్టుబడులు పెంపుకొత్త ఉద్యోగ అవకాశాలుసుస్థిర ఆర్థిక వృద్ధితో సహా గణనీయమైన దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేందుకు సిద్ధంగా ఉందిఇది మార్కెట్‌ అందుబాటును మరింత మెరుగుపరచటంతో పాటు కస్టమ్స్ విధానాలను క్రమబద్ధీకరిస్తుందితద్వారా భారతీయఈఎఫ్‌టీఏ దేశాల వ్యాపార సంస్థలు కార్యకలాపాలను వర్థమాన మార్కెట్లకు విస్తరించటాన్ని సులభతరం చేస్తుంది.

ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించటంతో పాటు సులభతరం చేస్తుందిభారతీయఈఎఫ్‌టీఏ దేశాల వ్యాపార సంస్థల విషయంలో నూతన ఆవిష్కరణలవిస్తరణకు అవకాశం ఇస్తూ అభివృద్ధి చెందేందుకు వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యాన్ని ఈ ఒప్పందం పెట్టుకుందిగత దశాబ్దంలో వస్తు వాణిజ్యం క్రమంగా పెరిగిందనిసేవల విషయంలో వాణిజ్యం దాదాపు రెట్టింపు అయిందని అన్ని పక్షాలు తెలియజేశాయిద్వైపాక్షిక వాణిజ్యం మొత్తం గణనీయంగా పెంచేందుకు కృషి చేయనున్నట్లు దేశాలు ప్రకటించాయి

భారత్-ఈఎఫ్‌టీఏ... టీఈపీఏ‌పై 2024 మార్చి 10న ఢిల్లీలో సంతకం చేశారుధృడత్వంతో కూడిన విశ్వసనీయమైన ప్రపంచ సరఫరా వ్యవస్థలను తయారుచేసేందుకువిశ్వసనీయ భాగస్వాములుగా ఒప్పందంలోని దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలన్న దేశాల ఆలోచనను అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉంది

 

****


(రిలీజ్ ఐడి: 2174134) సందర్శకుల సూచీ సంఖ్య : : 31
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Malayalam