ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఉన్నత ప్రమాణాలతో డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా...
ఎన్ఐఈఎల్ఐటీ డిజిటల్ యూనివర్శిటీని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్
ముజఫర్పూర్ (బిహార్), బాలాసోర్ (ఒడిశా), తిరుపతి (ఆంధ్రప్రదేశ్), లుంగ్లై (మిజోరాం) కేంద్రపాలిత ప్రాంతం దామన్లో అయిదు కొత్త ఎన్ఐఈఎల్ఐటీ కేంద్రాలను వర్చువల్గా ప్రారంభించనున్న కేంద్రమంత్రి
కృత్రిమ మేధో, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, సెమీకండక్టర్లు, అనుబంధ రంగాల్లో ప్రత్యేక సాంకేతికతతో యువతకు విద్యా కార్యక్రమాల్ని అందించనున్న ఎన్ఐఈఎల్ఐటీ డిజిటల్ విశ్వవిద్యాలయం
డిజిటల్ ప్రపంచంలో నైపుణ్య విద్యలోని అంతరాన్ని తగ్గించేందుకు ప్రముఖ పరిశ్రమ భాగస్వాములు విద్యాసంస్థలతో అవగాహన ఒప్పందాలు
Posted On:
01 OCT 2025 2:35PM by PIB Hyderabad
ఎన్ఐఈఎల్ఐటీ డిజిటల్ యూనివర్సిటీని కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక, సమాచార-ప్రసార శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఇది అందరికీ ఉత్తమమైన డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో రూపొందిన వేదిక.
ఈ వేదిక ద్వారా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, సెమీకండక్టర్లు, అనుబంధ రంగాల్లో పరిశ్రమకు అనుకూలమైన పాఠ్యాంశాలను అందిస్తుంది. సౌకర్యవంతమైన డిజిటల్ లెర్నింగ్ మోడ్లు, వర్చువల్ ల్యాబ్లతో యువతను భవిష్యత్కు తగిన నైపుణ్యాలు అందించడమే దీని లక్ష్యం.
బీహార్లోని ముజఫర్పూర్, ఒడిశాలోని బాలాసోర్, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, దామన్ దయ్యూలోని దామన్, మిజోరంలోని లుంగ్లైలలో నూతనంగా ఏర్పాటు చేసిన అయిదు ఎన్ఐఈఎల్ఐటీ కేంద్రాలను కేంద్రమంత్రి వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈ కేంద్రాల విస్తరణతో రతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎన్ఐఈఎల్ఐటీ కీలక పాత్ర పోషించనుంది.
ఈ కార్యక్రమంలో “విద్య డిజిటలైజేషన్లో కృత్రిమ మేధో పాత్ర” అనే అంశంపై పరిశోధకులు, విద్యావేత్తలతో ప్యానెల్ చర్చ కూడా నిర్వహించనున్నారు. ఎన్ఐఈఎల్ఐటీ, కిండ్రిల్ సంయుక్తంగా నిర్వహించిన అభివృద్ధి, భద్రత, కార్యకలాపాల కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం కూడా ఈ వేడుకలో జరగనుంది. దేశ యువతకు నైపుణ్యాల ఆధారిత డిజిటల్ విద్యను అందించడంలో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలవనుంది.
పరిశ్రమ-విద్యా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు ప్రముఖ పరిశ్రమ భాగస్వాములతో అవగాహన ఒప్పందాలు ఈ కార్యక్రమంలో కుదుర్చుకోనున్నారు.
ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐఈఎల్ఐటీ విద్యార్థులు, ప్రముఖ విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు సహా 1,500 కంటే ఎక్కువ మంది హాజరవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విభాగాల్లో ఎన్ఐఈఎల్ఐటీ నైపుణ్యాభివృద్ధి, అభ్యాస నమూనాల్లో ప్రావీణ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.
ఎన్ఐఈఎల్ఐటీ గురించి
కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ (ఎన్ఐఈఎల్ఐటీ).. నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సాధికారత రంగాల్లో మార్గదర్శక సంస్థగా నిలిచింది.
దేశవ్యాప్తంగా 56 ఎన్ఐఈఎల్ఐటీ కేంద్రాలు, 750కి పైగా గుర్తింపు పొందిన సంస్థలు, 9,000కి పైగా ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా ఎన్ఐఈఎల్ఐటీఈ, ఐసీటీ రంగంలోని అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో లక్షలాదిమంది విద్యార్థుల శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రం అందజేయనుంది.
పంజాబ్లోని రోపర్ ప్రధాన క్యాంపస్గా, ఐజ్వాల్, అగర్తలా, ఔరంగాబాద్, కాలికట్, గోరఖ్పూర్, ఇంఫాల్, ఇటానగర్, అజ్మీర్ (కేక్రి), కోహిమా, పాట్నా, శ్రీనగర్లలో ఉన్న పదకొండు అనుబంధ క్యాంపస్లతో విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ఎన్ఐఈఎల్ఐటీఈకి ప్రత్యేక వర్గం కింద ‘‘డీమ్డ్ టు బీ యూనివర్సిటీ’’ హోదాను అందించింది. డిజిటల్ సాంకేతికత ద్వారా ఈ అండ్ ఐసీటీ రంగంలో ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
***
(Release ID: 2173940)
Visitor Counter : 5