ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 25 SEP 2025 8:30AM by PIB Hyderabad

పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఈ రోజుఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వకంగా నివాళులు అర్పించారుభారత్ సైద్ధాంతికప్రగతి ప్రధాన ప్రస్థానానికి పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అందించిన అపార సేవలను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు.

 

పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతావాదాన్ని సమర్ధించడంతో పాటుసమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి కూడా ప్రగతి ఫలాలను అందించాలని ఆయన కలలు కన్న ‘అంత్యోదయ’ మార్గం... భారతదేశం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాకు ఎప్పటికీ ప్రేరణనిస్తాయని ప్రధానమంత్రి ఉద్ఘాటించారుఈ సిద్ధాంతాలు సమ్మిళిత్వ వృద్ధిజాతి నిర్మాణం దిశగా ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు.

 

ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

 

‘‘భరత మాత కన్న మహనీయ ముద్దుబిడ్డఏకాత్మ మానవతావాదాన్ని ప్రబోధించిన పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారికి ఆయన జయంతి సందర్భంగా కోటి కోటి వందనాలుదేశానికి సమృద్ధి మార్గాన్ని చూపించిన ఆయన జాతీయవాద భావనలుఅంత్యోదయ సిద్ధాంతం.. ఇవి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఎంతో ఉపయోగకరం.’’

 

***


(రిలీజ్ ఐడి: 2171106) సందర్శకుల సూచీ సంఖ్య : : 32