పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 342 కోట్లకు పైగా 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల

Posted On: 17 SEP 2025 11:14AM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరం కోసం గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిందితొలి విడతగా 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం తమిళనాడుకు రూ.127.586 కోట్ల విలువైన అన్‌టైడ్ గ్రాంట్లను (అర్హత గల 2901 గ్రామ పంచాయతీలు, 74 మండల పంచాయతీలు, 9 జిల్లా పంచాయతీలువిడుదల చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం అస్సాం రాష్ట్రానికి రూ.214.542 కోట్లు (అర్హత గల 2192 గ్రామ పంచాయతీలు, 156 మండల పంచాయతీలు, 27 జిల్లా పరిషత్‌లుపంపిణీ చేశారు.

పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖజల్ శక్తి మంత్రిత్వ శాఖ (తాగునీరు-పారిశుద్ధ్య విభాగంద్వారా గ్రామీణ స్థానిక సంస్థలు (ఆర్ఎల్‌బీలు), పంచాయతీ రాజ్ సంస్థల (పీఆర్ఐలకోసం రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘ నిధులను విడుదల చేయాలని భారత ప్రభుత్వం సిఫార్సు చేస్తుందివీటిని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందికేటాయించిన నిధుల కోసం సిఫార్సులు చేసిఆర్థిక సంవత్సరంలో విడతలుగా విడుదల చేస్తారురాజ్యాంగంలోని పదకొండో షెడ్యూల్‌లో పొందుపరచిన ఇరవై తొమ్మిది (29) అంశాల కింద జీతాలుఇతర నిర్వహణ ఖర్చులు మినహా ప్రాంత-నిర్దిష్ట అవసరాల కోసం ఆర్ఎల్‌బీలుపీఆర్ఐలు ఈ న్‌టైడ్ నిధులను ఉపయోగిస్తాయిటైడ్ గ్రాంట్లను (పారిశుధ్యంఓడీఎఫ్ స్థితి నిర్వహణ వంటి ప్రాథమిక సేవలకు ఉపయోగించవచ్చుఇందులో ముఖ్యంగా మానవ విసర్జితాల నిర్వహణగృహ వ్యర్థాల నిర్వహణశుద్ధి కోసం నిధులను ఉపయోగించవచ్చు (బితాగునీటి సరఫరావర్షపు నీటి సంరక్షణనీటి రీసైక్లింగ్ వంటి పనుల కోసం ఉపయోగించవచ్చు.

 

***


(Release ID: 2167776) Visitor Counter : 2