విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యుత్ రంగానికి డిజిటల్ వెన్నెముక... ఇండియా ఎనర్జీ స్టాక్ (ఐఈఎస్)ను నిర్మించటానికి వాటాదారుల సర్వేను ప్రారంభించిన విద్యుత్ మంత్రిత్వశాఖ

Posted On: 09 SEP 2025 5:54PM by PIB Hyderabad

భారత విద్యుత్ రంగం గ్రిడ్ డిజిటలైజేషన్పునరుత్పాదక ఇంధన వనరుల ఏకీకరణవికేంద్రీకృత విద్యుదుత్పత్తివినియోగదారుల-కేంద్రీకృత సంస్కరణల ద్వారా మార్పును సంతరించుకుంటోందిఈ మార్పునకు మద్దతిచ్చేందుకు విద్యుత్ మంత్రిత్వశాఖ ఇండియా ఎనర్జీ స్టాక్ (ఐఈఎస్), విద్యుత్ రంగం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ)ను రూపొందించింది.

అనుసంధానించగలవివేకంతో కూడినసమన్వయంతో పనిచేసే వ్యవస్థను ప్రారంభించటమే ఐఈఎస్ లక్ష్యంగా పెట్టుకుందిఇందులో భాగంగాఎంపిక చేసిన విద్యుత్ పంపిణీ సంస్థల సాయంతో ప్రామాణికఓపెన్ ఏఐ ఏపీఎస్ లుప్రోటోకాల్స్ ను ఉపయోగించి ఒక యుటిలిటీ ఇంటెలిజెన్స్ వేదికను అభివృద్ధి చేయనుంది.

సమగ్రభవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఐఈఎస్అనుబంధ పరిష్కారాలను రూపొందించటానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ వాటాదారుల మ్యాపింగ్ సర్వేను నిర్వహిస్తోందిఈ సర్వే కింది అంశాలపై వివరాలు సేకరిస్తుంది:

  • సంస్థాగత వివరాలు

  • అందించగల పరిష్కారాలుఆవిష్కరణలు

  • ఐఈఎస్ వ్యవస్థలో పాల్గొనేందుకు సంసిద్ధత

    ఐఈఎస్...మార్చుకోవడానికి వీలున్న ప్రమాణాలుఅనుసంధాన వ్యవస్థను నిర్వచిస్తుందిదీనివల్ల వాటాదారులువినియోగదారులుసాంకేతిక నిపుణులుఆవిష్కరణకర్తలు ఈ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని వారి ఉత్పత్తులుడిజిటల్ వేదికలనూ రూపొందించుకోవచ్చువీటిని ముందుగానే అందిపుచ్చుకోవటం వల్ల సంస్థలు భవిష్యత్ అవసరాలకు సిద్ధం కాగలవురెట్రోఫిట్ ఖర్చులూ తగ్గుతాయివిద్యుత్ రంగంలో ఏకీకృతఆవిష్కరణ-ఆధారిత ప్రోత్సాహం ఇచ్చేందుకు సహాయపడుతుంది.

కింద ఇచ్చిన లింక్ ద్వారా వాటాదారులందరూ సంస్థకు సంబంధించిన ఖచ్చితమైనపూర్తి సమాచారాన్ని అందించిసర్వేను పూర్తి చేయాలిసర్వే లింక్https://forms.office.com/r/Wm0sewTTrC లేదా ఈ కమ్యూనికేషన్/ప్రకటన వెలువడిన నాటి నుంచి రెండు వారాల్లోగా జత చేసిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలిఈ సర్వే విద్యుత్ పంపిణీ సంస్థలుపరిష్కారాలు అందించే వారికి సహకరిస్తుంది.

 

***


(Release ID: 2165238) Visitor Counter : 7