జాతీయ మానవ హక్కుల కమిషన్
ఉత్తరాఖండ్ లోని రూర్కీ జిల్లాలో జబ్రేడా ప్రాంతంలో ఏడేళ్ల బాలుడిపై ఓ మసీదు ఇమాం లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తా కథనాలను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ
రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో నివేదిక అందించాలని రూర్కీ డీఎం, పోలీసు సూరింటెండెంట్కు నోటీసులు
నాడు పోస్టు చేయడమైనది:
28 AUG 2025 2:32PM by PIB Hyderabad
2025 ఆగస్టు 20న ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాలో, జబ్రేడా ప్రాంతంలో ఓ మసీదులో ఏడేళ్ల బాలుడిపై ఇమాం లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తా కథనాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. బాధిత బాలుడు మసీదుకు చదువుకోవడానికి వెళ్లాడని కథనంలో పేర్కొన్నారు.
మీడియాలో వచ్చిన కథనాన్ని గమనించిన కమిషన్, అదే నిజమని తేలితే బాధితుని మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశంగా దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. కాబట్టి, ఈ ఘటనపై రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని రూర్కీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, పోలీస్ సూపరిండెంట్కు నోటీసులు జారీ చేసింది.
ఆగస్టు 22న ప్రచురితమైన వార్తా కథనం ప్రకారం బాలుడిని నిందితుడు తన గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. జరిగిన సంఘటన గురించి ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. ఇంటికి చేరుకున్న తర్వాత బాలుడు ఈ సంఘటన గురించి కుటుంబానికి చెప్పాడు.
***
(రిలీజ్ ఐడి: 2161536)
సందర్శకుల సూచీ సంఖ్య : : 47