కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తపాలా సేవల్లో కొత్త డిజిటల్ శకానికి శ్రీకారం చుట్టిన కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా


డిజిటల్ ఇండియా దిశగా ఇండియా పోస్ట్ ప్రయాణంలో అధునాతన తపాలా సాంకేతికత - ఐటీ 2.0 అమలు

ఒక కీలక విజయం

Posted On: 19 AUG 2025 6:35PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకేంద్ర కమ్యూనికేషన్లుఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎంసింధియా మార్గదర్శకత్వంలో తపాలా శాఖ (డీఓపీ)  ఐటి 2.0 - తపాలా సేవల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (ఏపీటీ)  విజయవంతంగా ప్రారంభించిందిఈ విప్లవాత్మక డిజిటల్ నవీకరణ భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా,  మేక్ ఇన్ ఇండియా దృష్టికోణాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఉన్న 1.65 లక్షల తపాలా కార్యాలయాలను ఆధునికీకరించే దిశగా తపాలా శాఖ ప్రయాణంలో కీలకమైన దశను  సూచిస్తుందిఐటీ 2.0 ద్వారావేగవంతమైనమరింత నమ్మకమైనపౌర కేంద్రీకృత తపాలాఆర్థిక సేవలు దేశంలోని ప్రతి మూలకు చేరతాయిదీని ద్వారా ఇండియా పోస్ట్ అందరికీ నాణ్యమైన సేవలు అందించడం పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకుంది.

ఐటీ ఆధునికీకరణ ప్రాజెక్ట్ 1.0 విజయం ఆధారంగా కొత్తగా ప్రారంభించిన అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ (ఏపీటీవేదిక  మైక్రో సర్వీసుల ఆధారిత అప్లికేషన్‌ను పరిచయం చేస్తోందిఇది వేగవంతమైనమరింత నమ్మకమైనపౌరులకు సులభంగా ఉపయోగపడే సేవలను అందిస్తుందిపోస్టల్ టెక్నాలజీ ఎక్సలెన్స్ సెంటర్ (సీఈపీటీస్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిఅభివృద్ధి చేసిన ఈ అప్లికేషన్భారత ప్రభుత్వ మేఘ్‌రాజ్ 2.0 క్లౌడ్ ప్లాట్‌ఫామ్ లో ఉందిదీనికి బీఎస్ఎన్ఎల్ జాతీయ స్థాయిలో కనెక్టివిటీ మద్దతు అందిస్తోంది.

కేంద్ర మంత్రి శ్రీ సింధియా ఈసందర్భంగా మాట్లాడుతూ... “ఏపీటీ ఇండియా పోస్ట్ ను   ప్రపంచ స్థాయి పబ్లిక్ లాజిస్టిక్స్ సంస్థగా మారుస్తుందిగౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోఇది పూర్తి సామర్థ్యంతో ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికిబలమైనస్వయం సమృద్ధిగల డిజిటల్ ఇండియాకు మార్గం సుగమం చేస్తుంది” అని అన్నారు.

ఏపీటీ ముఖ్యాంశాలు 

  1. మైక్రో-సర్వీసులుఓపెన్ ఏపీటీ  ఆధారిత నిర్మాణం 

  2. ఏకీకృత వినియోగదారు ఇంటర్‌ఫేస్ 

  3. క్లౌడ్-రెడీ డిప్లాయ్‌మెంట్ 

  4. బుకింగ్ నుంచి నుండి డెలివరీ వరకు ఎండ్-టు-ఎండ్ డిజిటల్ సొల్యూషన్ 

  5. కొత్త తరం సేవలు -  క్యూఆర్-కోడ్ చెల్లింపులుఓటీపీ ఆధారిత డెలివరీ మొదలైనవి.

  6. ఓపెన్ నెట్‌వర్క్ సిస్టమ్ గ్రామీణ ప్రాంతాలలో కూడా నమ్మకమైన కనెక్టివిటీ

  7. డెలివరీ కచ్చితత్వాన్ని పెంపొందించడానికి 10-అంకెల డిజిపిన్

  8. మెరుగైన రిపోర్టింగ్విశ్లేషణ

ఈ ప్రణాళికను దశలవారీగాఒక నిర్మాణాత్మక పద్ధతిలో అమలు చేశారుకర్ణాటక పోస్టల్ సర్కిల్‌లో (మే-జూన్ 2025) ప్రయోగాత్మక అమలు విజయవంతమైన తర్వాతఆ అనుభవాల నుంచి నేర్చుకున్న అంశాలను విషయాలను వ్యవస్థనువ్యూహాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించారుఆ తర్వాత దేశవ్యాప్తంగా దశలవారీగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారుమొత్తం 23 తపాలా సర్కిళ్లను కవర్ చేస్తూఆగస్టు 4, 2025 నాటికి 1.70 లక్షలకు పైగా కార్యాలయాలుఅన్ని పోస్ట్ ఆఫీసులుమెయిల్ కార్యాలయాలుపరిపాలనా విభాగాలు ఏపీటీలో అందుబాటులోకి వచ్చాయి.

సాంకేతిక మార్పు సత్ఫలితాలు ఇవ్వడం అనేది ఉద్యోగులపై ఆధారపడి ఉంటుందని గుర్తించిన ఇండియా పోస్ట్   “ట్రైన్ – రీట్రైన్ – రిఫ్రెష్” సూత్రం కింద మాస్టర్ ట్రైనర్లుయూజర్ ఛాంపియన్లుఎండ్-యూజర్లను కలుపుకొని ఒక వరస క్రమంలో 4.6 లక్షలకు పైగా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిందిఇది ప్రతి స్థాయిలో సంసిద్ధతకు, , దేశవ్యాప్తంగా సాఫీగా ఈ సాంకేతికత అన్వయానికి  దోహదపడింది.

ఈ వ్యవస్థ తన సుస్థిరతాన్నిసామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకుందిఒక్కరోజులోనే  32 లక్షలకు పైగా బుకింగ్‌లు, 37 లక్షల డెలివరీలను విజయవంతంగా నిర్వహించింది.

ఐటీ 2.0 అమలుతోఇండియా పోస్ట్ ఆధునికసాంకేతిక ఆధారిత సేవా సంస్థగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుందిఅదే సమయంలో అనాదిగా ఉన్న నమ్మకాన్నిపోటీ లేని  పరిధిని నిలబెట్టుకుందిఉద్యోగులలో సామర్ధ్యం పెంచడంగ్రామీణపట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించడంఆర్థిక సమ్మిళిత్వాన్ని పెంపొందించడంప్రతి పౌరునికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సేవలు అందించడం పట్ల ఇండియా పోస్ట్ దృఢమైన నిబద్ధతకు ఏపీటీ విజయం నిదర్శనం

 

***

 


(Release ID: 2158192)