ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ పై తాజా సమాచారం
ఎస్ సీడీ పరీక్షలకు దేశవ్యాప్తంగా 30 పాయింట్ కేర్ టెస్టులు,
5 నాన్-రాపిడ్ వైద్య పరీక్షలకు ఐసీఎంఆర్ ఆమోదం
జూలై 2025 నాటికి 17 గిరిజన రాష్ట్రాల్లో 6 కోట్లకు పైగా పరీక్షలు పూర్తి
సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్ వ్యయం రూ.100
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధుల సహాయంతో 14 రాష్ట్రాల్లో 15 ఎక్సలెన్స్ కేంద్రాలకు ఆమోదం
Posted On:
19 AUG 2025 3:04PM by PIB Hyderabad
జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ (ఎన్ఎస్ సీఏఈఎం) కింద సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణకు దేశవ్యాప్తంగా జిల్లా ఆస్పత్రుల నుంచి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (ఏఏఎం) స్థాయి వరకు అన్ని ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు మొత్తం 30 పాయింట్ కేర్ టెస్టులు (పీఓసీటీ), 5 నాన్ రాపిడ్ వైద్య పరీక్షల (ఆర్ డీటీ) కేంద్రాలకు ఐసీఎంఆర్ నుంచి ఆమోదం లభించింది. రాష్ట్రాల్లో ఆయా పరీక్షలను ఇప్పటికే నిర్వహిస్తున్నారు.
31.07.2025 వరకు 17 గిరిజన ప్రాధాన్య రాష్ట్రాల్లో 6,07,30,111 పరీక్షలు నిర్వహించారు. సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్ కి రూ.100 ప్రామాణిక వ్యయంగా నిర్ణయించారు. ఇందులో స్క్రీనింగ్ ఖర్చు, రికార్డుల నమోదు, సంబంధిత ఖర్చులుంటాయి.
ఎస్ సీడీతో బాధపడుతున్న రోగుల ఆరోగ్య స్థితి మెరుగుపడేందుకు ఏఏఎం-ఉప ఆరోగ్య కేంద్రాలు (ఎస్ హెచ్ సీ), ఏఏఎం- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీ హెచ్ సీ) ద్వారా ఈ కింది సేవలు/సౌకర్యాలు అందిస్తారు:
వ్యాధి అవగాహన, కౌన్సెలింగ్ సమాచారాన్ని రూపొందించి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందిస్తుంది. ప్రతి నెలా నిర్వహించే ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరాల ద్వారా, ఎస్ సీడీతో సహా వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు.
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓటీఏ) నిధులు సమకూరుస్తున్న ఎస్ సీడీకి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) లను ఏర్పాటు వ్యయానికి సంబంధించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటివరకు, ఎంఓటీఏ ద్వారా 14 రాష్ట్రాల్లో 15 సీఓఈలు ఆమోదం పొందాయి.
ఆరోగ్య పరిశోధనా విభాగం కింద, ఐసీఎంఆర్-జాతీయ గిరిజన ఆరోగ్య పరిశోధనా సంస్థ (ఎన్ఐఆర్ టీహెచ్), జబల్ పుర్, మధ్యప్రదేశ్.. హిమోగ్లోబినోపతిస్ నియంత్రణకు పరిశోధనా కేంద్రాన్ని మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు సికిల్ సెల్ వ్యాధితో సహా జాతీయ కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ రాజ్యసభలో రాతపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు.
***
(Release ID: 2158129)