బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సుస్థిర మైనింగ్ పద్ధతులు, పర్యావరణ నిర్వహణ

Posted On: 11 AUG 2025 2:50PM by PIB Hyderabad

సుస్థిర మైనింగ్ పద్ధతులను ప్రోత్సహించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందికోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్తదితర బొగ్గులిగ్నైట్ ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లు సుస్థిర మైనింగ్ పద్ధతులను అనుసరిస్తున్నాయివీటిలో భూగర్భభూ ఉపరితల గనుల కోసం మైనర్ఎక్సెంట్రిక్ రిప్పర్లుకంటిన్యుయస్ మైనర్హై వాల్ మైనింగ్ తదితర అధునాతన సాంకేతికతలు ఉన్నాయిఅదనంగారోడ్డు రవాణాను తగ్గించడానికి ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులువాయు కాలుష్యాన్ని తగ్గించడానికి నీటి స్ప్రింక్లర్లుఫాగ్ కెనాన్లుదుమ్మును నియంత్రించడానికి వెట్ డ్రిల్లింగ్డస్ట్ ఎక్స్‌ట్రాక్టర్లు బిగించిన డ్రిల్స్ ఉపయోగిస్తున్నారు.

 

ఆమోదించిన మైనింగ్పర్యావరణ నిర్వహణ ప్రణాళిక ప్రకారం జీవ పునరుద్ధరణఅటవీకరణ కార్యక్రమాలను సైతం పీఎస్‌యూలు చేపడుతున్నాయిమైనింగ్ పూర్తయిన ప్రాంతాలుఓవర్ బర్డెన్ (ఓబీడంపులుమైనింగ్ పరిసర ప్రాంతాల్లోని ఇతర భూములను క్రమంగా స్వాధీనం చేసుకొని అడవులను పెంచుతున్నారుబహుళ అంచెల్లో మొక్కలు పెంచడంవిత్తన బంతులువిత్తనాలు వెదజల్లడానికి డ్రోన్లను ఉపయోగించడం లాంటి వినూత్న విధానాలతో సహా శాస్త్రీయమైన పద్ధతులను పీఎస్‌యూలు అమలు చేస్తున్నాయిమైనింగ్ చేపట్టిన పరిసర ప్రాంతాల్లో లక్షల కొద్దీ మొక్కలను నాటడం ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు సుమారుగా 13,400 హెక్టార్ల భూమిని ఈ పీఎస్‌యూలు అటవీకరణ చేశాయి.

 

బొగ్గు సంస్థల్లో అధునాతన సుస్థిర సాంకేతికతలను అనుసరించడమనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. 2025-26 ఆర్థిక సంవత్సరానికిఉపరితల గనుల నుంచి 537.92 మిలియన్ టన్నుల బొగ్గునుపేలుడు రహిత మైనింగ్ సాంకేతికతలను ఉపయోగించి భూగర్భ గనుల నుంచి 23.63 మిలియన్ టన్నుల బొగ్గును సేకరించాలని సీఐఎల్ లక్ష్యంగా నిర్దేశించుకుందిఅదనంగాఅదే ఏడాదికి బొగ్గులిగ్నైట్ మైనింగ్ ప్రాంతాల్లో 2,800 హెక్టార్లలో మొక్కలు నాటాలని కోల్లిగ్నైట్ పీఎస్‌యూలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

 

ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో అందించారు.

 

 

***


(Release ID: 2155077)
Read this release in: English , Urdu , Hindi , Tamil