ప్రధాన మంత్రి కార్యాలయం
జార్ఖండ్లోని దేవ్ఘర్లో రోడ్డు ప్రమాదం.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం
Posted On:
29 JUL 2025 10:34AM by PIB Hyderabad
జార్ఖండ్లోని దేవ్ఘర్లో రోడ్డు ప్రమాదం కారణంగా ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా పేర్కొంది:
‘‘జార్ఖండ్లోని దేవ్ఘర్లో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత విచారకరం. ఈ దుర్ఘటన కారణంగా భక్తజనం తమ ప్రాణాలు కోల్పోవాల్సివచ్చింది. వారి ఆత్మీయులకు నేను నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారు ఈ వేదనను తట్టుకొనే శక్తిని దైవం వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరూ అతి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రధానమంత్రి @narendramodi”.
(Release ID: 2149585)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam