ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్లోని మోతీహారీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

Posted On: 18 JUL 2025 3:53PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

ఈ పవిత్ర శ్రావణ మాసంలో నేను బాబా సోమేశ్వర నాథ్ పాదాలకు శిరసు వంచి ప్రణమిల్లుతున్నానుఆయన ఆశీర్వాదంతో బీహార్ ప్రజలందరికీ సుఖసంతోషాలుశ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తున్నాను.

 

బీహార్ గవర్నర్ గౌరవ శ్రీ అరిఫ్ మొహమ్మద్ ఖాన్బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నీతీశ్ కుమార్నా కేంద్ర మంత్రివర్గ సహచరులు శ్రీ జితన్ రామ్ మాంఝీ శ్రీ గిరిరాజ్ సింగ్శ్రీ లాలన్ సింగ్శ్రీ చిరాగ్ పాస్వాన్శ్రీ రామనాథ్ ఠాకూర్శ్రీ నిత్యానంద్ రాయ్శ్రీ సతీష్ చంద్ర దూబేశ్రీ రాజ్ భూషణ్ చౌదరిబీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ సమ్రాట్ చౌదరిశ్రీ విజయ్ సింహానా పార్లమెంట్ సహచరులుబీహార్‌కు చెందిన దిగ్గజ రాజకీయ నాయకుడు శ్రీ ఉపేంద్ర కుష్వాహాభారతీయ జనతా పార్టీ – బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ దిలీప్ జైస్వాల్సభలో ఉన్న ఇతర మంత్రులుప్రజాప్రతినిధులునా ప్రియమైన బీహార్ ప్రజలందరికీ నా నమస్కారాలు!


 

రాధామోహన్ సింగ్ గారి కారణంగా తరచూ చంపారణ్‌ను సందర్శించే అవకాశం నాకు లభిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలుఇది చంపారణ్ భూమిచరిత్ర సృష్టించిన భూమిస్వాతంత్య్ర పోరాటంలోమహాత్మా గాంధీకి కొత్త దిశను ఇచ్చింది ఈ భూమేఇప్పుడు అదే చంపారణ్ భూమి బీహార్ భవిష్యత్తుకూ కొత్త ప్రేరణగా మారబోతుంది.

ఈరోజు రూ.7,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనప్రారంభోత్సవం జరిగాయిఈ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన వారికిబీహార్ ప్రజలకు నా శుభాకాంక్షలుఇక్కడ ఓ యువకుడు శ్రీరామ మందిరపు పూర్తి నమూనాను తీసుకువచ్చాడుఅది ఎంత అద్భుతమైన సృష్టిఅతను ఆ నమూనాను నాకు ఇవ్వాలనుకుంటున్నాడనిపిస్తోందిఆ యువకుడు తన పేరుచిరునామాను దాని కింద రాసేలా చూడమని నా ఎస్‌పీజీ సిబ్బందిని కోరుతున్నానేను నీకు లెటర్ రాస్తానుఈ నమూనా నువ్వే చేశావాఅవునాఅయితేమా ఎస్‌పీజీ సిబ్బంది నీ దగ్గరకి వచ్చినప్పుడు దయచేసి వాళ్ల చేతికి అందించు. నీకు తప్పకుండా నా లెటర్ అందుతుందినీకు నా మనఃపూర్వక కృతజ్ఞతలుఇక్కడ సీతామాతను నిత్యం స్మరించుకుంటూ జీవించే ఈ భూమిలోనువ్వు నాకు అయోధ్యలోని మహా మందిరపు సుందర నమూనాను అందించావునిజంగా నీకు ధన్యవాదాలు.

స్నేహితులారా,

21వ శతాబ్దంలో ప్రపంచం వేగంగా మారిపోతోందిఒకప్పుడు పాశ్చాత్య దేశాల ఆధిపత్యమే ఉండేదిఇప్పుడు తూర్పు దేశాల భాగస్వామ్యంప్రభావం పెరుగుతోందిఅభివృద్ధిలో తూర్పు దేశాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయిఅంతర్జాతీయంగా తూర్పు దేశాలు అభివృద్ధి చెందుతున్నట్టే.. వాటికి సమాంతరంగా భారత్‌లో తూర్పు రాష్ట్రాల యుగం మొదలైందిపశ్చిమ భారతదేశానికి ముంబయి ప్రాధాన్య నగరంగా ఎలా ఉందోరాబోయే కాలంలో తూర్పు భారతదేశానికి మోతీహారిని అలా తీర్చిదిద్దాలన్న కృత నిశ్చయం మాదిగురుగ్రామ్ మాదిరిగానే అవకాశాల పుట్టగా గయను మారుస్తాంపుణే తరహాలో పాట్నాలోనూ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందిసూరత్‌ కు దీటుగా సంతాల్ పరగణా అభివృద్ధి చెందుతుందిపర్యాటకంలో జల్పాయ్‌గురిజాజ్పూర్‌ ప్రాంతాలు జైపూర్ తరహాలో కొత్త శిఖరాలకు చేరతాయిబీర్భూమ్ ప్రజలు బెంగళూరులో ఉన్నవారిలా ప్రగతిని సాధించాలని అభిలషిస్తున్నాను.

సోదరసోదరీమణులారా,

తూర్పు భారత్‌ పురోగమించాలంటే.. బీహార్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చాలిబీహార్లో వేగంగా సాగుతున్న అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉండటమే కారణంకొన్ని గణాంకాలు చెబుతాకేంద్రంరాష్ట్రంలో కాంగ్రెస్ఆర్జేడీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న పదేళ్లలో బీహార్‌కు కేవలం రూ. 2 లక్షల కోట్లే అందాయిఇది నిస్సందేహంగా నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాజకీయ కక్ష్య సాధింపు చర్యే. 2014లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్‌పై ఇలాంటి ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలికిందితమ పదేళ్ల పాలనలో ఎన్డీయే ప్రభుత్వం కింద బీహార్ అభివృద్ధికి లెక్కకు మిక్కిలి నిధులు కేటాయించాంలక్షల కోట్ల రూపాయల నిధులు అందించిన విషయాన్ని సమ్రాట్ చౌదరి గారు ఇప్పుడే వివరంగా చెప్పారు.

స్నేహితులారా,

కాంగ్రెస్-ఆర్జేడీ పాలన కాలంతో పోలిస్తే మా ప్రభుత్వం బీహార్‌కు ఎన్నో రెట్లు ఎక్కువ ఆర్థిక సహాయం అందించిందన్న విషయం అవగతమవుతుందిఈ నిధులు ప్రజా సంక్షేమంరాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగమవుతున్నాయి.

స్నేహితులారా,

రెండు దశాబ్దాల కిందట బీహార్ ఎదుర్కొన్న నిరాశను నేటి తరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందికాంగ్రెస్ఆర్జేడీ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందిపేదవారికి ఉద్దేశించిన నిధులు వారి వరకు చేరలేదుపేదల సొమ్ముల్ని కాజేయడం పైనే అప్పటి నాయకత్వం దృష్టి సారించిందిఅసాధ్యాన్ని సుసాధ్యం చేయగలనిరంతర శ్రామికులతో కూడిన ధైర్యవంతుల భూమి బీహార్.. కాంగ్రెస్ఆర్జేడీ కబంధ హస్తాల నుంచి బీహార్ కు విముక్తి కల్పించారుఅసాధ్యాన్ని సుసాధ్యం చేశారుఫలితంగా సంక్షేమ పథకాలు పేదలకు నేరుగా అందే అవకాశం కలిగిందిగడచిన 11 ఏళ్లలో దేశ వ్యాప్తంగా పీఎం ఆవాస యోజన కింద కోట్లకు పైగా ఇళ్లు నిర్మించాంవాటిలో 60 లక్షలు బీహార్‌లోనే పేదల కోసమే నిర్మితమయ్యాయినార్వేన్యూజిలాండ్సింగపూర్ లాంటి దేశాల మొత్తం జనాభా కంటే బీహార్ లో నిర్మించిన ఇళ్ళే ఎక్కువ.

మరో ఉదాహరణ చెబుతా.. మోతీహారీ జిల్లాలోనే దాదాపు లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లు లభించాయిఈ సంఖ్య మరింతగా పెరుగుతోందిఅంతదాకా ఎందుకు.. ఈ ఒక్కరోజే.. ఈ ప్రాంతంలోని 12,000కు పైగా కుటుంబాలు కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నాయివీటికి తోడు మరో 40,000 పేద కుటుంబాలు పక్కా ఇళ్లను నిర్మించుకోవడానికి అవసరమైన నిధులను నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా పొందాయివీరిలో ఎక్కువ మంది దళితులమహాదళితులువెనకబడిన వర్గాలకు చెందిన నా సోదర సోదరీమణులేకాంగ్రెస్ఆర్జేడీల పాలనలో ఈ తరహా పక్కా ఇళ్లను పేదలు పొందగలగడం ఊహకు అందని విషయమన్న సంగతి మీకు తెలుసువారి పాలనలో ప్రజలు తమ ఇళ్లకు రంగులు వేసుకోవడానికి కూడా భయపడేవారుఎప్పుడు ఎవరు వేధిస్తారోలేదా ఇంటి నుంచి గెంటేస్తారోనన్న భయంతో బతికేవారుఅప్పటి ఆర్జేడీ హయాంలో మీకు పక్కా ఇళ్ళే దక్కలేదు.

స్నేహితులారా,

బీహార్ పురోగతికి ఆ రాష్ట్రానికి చెందిన తల్లులుసోదరీమణుల సామర్థ్యందృఢ సంకల్పమే కారణంఈరోజు లక్షలాది మహిళలు మమ్మల్ని ఆశీర్వదించిన విషయాన్ని గమనించాఇది నా హృదయాన్ని తాకిందిమా ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్య ప్రాధాన్యాన్ని బీహార్‌లోని మహిళలుస్పష్టంగా అర్థం చేసుకుంటున్నారుసమావేశానికి హాజరైన మహిళలను ఉద్దేశించి.. గతంలో రూ.10 సైతం ఇంట్లోనే దాచుకోవాల్సిన రోజులు గుర్తున్నాయిఅప్పుడు చాలామందికి బ్యాంకు ఖాతాలు లేవుబ్యాంకుల్లోకి అనుమతి లేదుపేదల గౌరవాన్ని ఈ మోదీ మాత్రమే అర్ధం చేసుకున్నాడుపేదలను ఎందుకు రానివ్వట్లేదని నేను బ్యాంకుల్ని ప్రశ్నించామేం భారీ స్థాయిలో జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించాంతద్వారా పేద కుటుంబాల మహిళలకు అధిక లబ్ది చేకూరిందిజన ధన్ ఖాతాలను తెరిచేందుకు ప్రారంభించిన ప్రచారం ద్వారా మహిళలే ఎక్కువ లబ్ధి పొందారుఒక్క బీహార్లో ఇపుడు 3.5 కోట్ల మంది మహిళలకు జన్ ధన్ ఖాతాలు ఉన్నాయిఇప్పుడు ప్రభుత్వ పథకాల నిధులు నేరుగా వారి ఖాతాల్లోకే నేరుగా బదిలీ అవుతున్నాయికొద్ది రోజుల క్రితమే నా మిత్రుడు శ్రీ నితీష్ కుమార్ సారథ్యంలోని బీహార్ ప్రభుత్వం వయోధికులుదివ్యాంగులువితంతువులకు అందించే నెలవారీ పెన్షన్ ను రూ. 400 నుంచి 1,100 కు పెంచిందిఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ అవుతోందిగత నెలన్నర వ్యవధిలోనే బీహార్లోని 24,000 స్వయం సహాయక బృందాలు రూ.1,000 కోట్లకు పైగా లబ్ధి పొందాయిజన్ ధన్ ఖాతాల ద్వారా తల్లులుసోదరీమణులకు అందించిన ఆర్థిక సాధికారతే ఈ విజయానికి కారణం.

స్నేహితులారా,

మహిళా సాధికారత కోసం తీసుకున్న ఈ చర్యల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయిదేశవ్యాప్తంగానుబీహార్‌లోనూ 'లఖ్‌పతి దీదీలసంఖ్య పెరుగుతోందిదేశంలో కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడం మా లక్ష్యంఇప్పటికే 1.5 కోట్ల మంది మహిళలు ఈ మైలురాయిని సాధించారుబీహార్‌లో 20 లక్షలకు పైగా మహిళలు లఖ్‌పతి దీదీలుగా మారారుకేవలం చంపారన్‌లోనే 80,000 మందికి పైగా మహిళలు స్వయం సహాయక బృందాల్లో చేరి లక్షాధికారులుగా ఎదిగారు.

స్నేహితులారా,

ఈరోజు రూ.400 కోట్ల కమ్యూనిటీ ఇన్వెస్టుమెంటు ఫండ్ ను విడుదల చేశాంఈ ఫండ్ మహిళా సాధికారతను పెంచుతుందిశ్రీ నితీష్ కుమార్ ప్రారంభించిన "జీవికా దీదీపథకం బీహార్‌లోని లక్షలాది మంది మహిళలు స్వావలంబన సాధించేందుకు మార్గం సుగమం చేసింది.

స్నేహితులారా,

బీహార్ పురోగమించినప్పుడు మాత్రమే భారత్ ముందుకు సాగుతుందన్న విజన్ లో బీజేపీఎన్డీయేలకు స్పష్టత ఉంది. అలాగే బీహార్ యువత పురోగమిస్తేనే బీహార్ అభివృద్ధి చెందుతుందియువతకు ఉద్యోగావకాశాల కల్పనఅభివృద్ధి చెందిన బీహార్‌ను నిర్మించే విషయంలో మా సంకల్పం స్పష్టంగా ఉందిబీహార్‌లోనే ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఇటీవలి సంవత్సరాల్లో గణనీయమైన ప్రయత్నాలు జరిగాయిశ్రీ నితీష్ కుమార్ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో లక్షలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించిందిబీహార్ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నితీష్ సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతున్నారుకేంద్ర ప్రభుత్వం ఈ ప్రయత్నాలకు అండగా ఉంటుంది.

స్నేహితులారా,

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఒక ప్రధాన పథకాన్ని ఆమోదించిందిఈ పథకం కింద ప్రైవేట్ కంపెనీలో తొలిసారిగా నియామకం పొందే యువతకు కేంద్ర ప్రభుత్వం రూ. 15,000 అందజేస్తుందిఆగస్టు నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందియువతకు కొత్త ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో ప్రారంభిస్తున్న ఈ పథకం అమలుకు కేంద్రం రూ. 1 లక్ష కోట్ల ఖర్చు చేస్తుందిఇది బీహార్ యువతకు గణనీయ ప్రయోజనం చేకూరుస్తుంది.

స్నేహితులారా,

బీహార్‌లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడంలో ముద్ర యోజన వంటి పథకాలు దోహదపడుతున్నాయిగత రెండు నెలల్లోనే బీహార్‌లో ముద్ర యోజన కింద లక్షలాది రుణాలు పంపిణీ అయ్యాయిప్రత్యేకించి చంపారన్‌లో 60,000 మంది యువత తమ స్వయం ఉపాధి ప్రణాళికల కోసం ముద్ర రుణాలు పొందారు.

స్నేహితులారా,

ఆర్జేడీ ఈ తరహా ఉపాధి ఎప్పుడూ కల్పించలేదుముఖ్యంగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశజూపి భూముల్ని తమ పేరిట రాయించుకునే నాయకులు ఎప్పటికీ ఉపాధి కల్పించలేరులాంతర్ల యుగానికీ.. కొత్త ఆశలతో ప్రకాశించే నేటి బీహార్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మర్చిపోవద్దుఈ మార్పు బీహార్ సంకీర్ణ ప్రభుత్వం సాధించిన ఘనతేతమ సంకీర్ణ ప్రభుత్వానికి బీహార్ ప్రజలు గట్టి మద్దతునివ్వడంతో పాటుమా ప్రభుత్వంపై అచంచలమైన విశ్వాసం ఉంచారు.

స్నేహితులారా,

ఇటీవల నక్సలిజం నిర్మూలన కోసం చేపట్టిన నిర్ణయాత్మక చర్యలతో బీహార్ యువతకు ఎంతో మేలు జరిగిందిఒకప్పుడు మావోయిస్టు ప్రభావంతో వెనకబడిన చంపారన్ఔరంగాబాద్గయజముయి వంటి జిల్లాలు ప్రస్తుతం హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాయిమావోయిస్టు హింస కారణంగా అభివృద్ధికి దూరమైన ప్రాంతాల యువత ఇప్పుడు పెద్ద కలలు కంటున్నారునక్సలిజం నుంచి దేశానికి పూర్తి విముక్తి కల్పించడానికి కట్టుబడి ఉన్నాం.

స్నేహితులారా,

ఇది నవ భారతంశత్రువులకు తగిన బుద్ధి చెప్పేందుకు భరతమాత ఎలాంటి ప్రయత్నానికైనా వెనుకాడదు. ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నది బీహార్ గడ్డ మీదేఈ రోజు ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రపంచమంతా చూస్తోంది.

స్నేహితులారా,

సామర్థ్యంవనరులు లేని రాష్ట్రంగా బీహార్ ఉండేదినేడు ఇక్కడి వనరులే ఈ రాష్ట్ర పురోగతికి సాధనాలుగా మారుతున్నాయితమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా మఖానా ధరలు పెరిగాయిమఖానా రైతులను పెద్ద మార్కెట్లతో అనుసంధానించడమే దీనికి కారణంమఖానా బోర్డు ఏర్పాటును ఏర్పాటుచేశాంఅరటిలిచీమర్చా బియ్యంకతర్నీ బియ్యంజర్దాలు మామిడిమాఘాహి పాన్ వంటి పంటలుఅనేక ఇతర ఉత్పత్తులు బీహార్ రైతులనుస్థానిక యువతను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానిస్తున్నాయి.

రైతుల దిగుబడినిఆదాయాన్ని పెంచడం మా ప్రభుత్వ ప్రాథమ్యంపీఎం-కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశవ్యాప్తంగా రైతులకు సుమారు రూ. 3.5 లక్షల కోట్లు పంపిణీ చేశాంఒక్క మోతీహారీలోనే లక్షలకు పైగా రైతులు ఈ పథకం ద్వారా రూ. 1,500 కోట్లకు పైగా మొత్తాన్ని అందుకున్నారు.

సోదరసోదరీమణులారా,

మా ప్రభుత్వం కేవలం నినాదాలు.. వాగ్దానాలకే పరిమితం కాదుకార్యాచరణ ద్వారా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందివెనకబడినఅత్యంత వెనకబడిన వర్గాల అభ్యున్నతి పట్ల మా ప్రభుత్వ నిబద్ధత.. మా విధానాలునిర్ణయాల్లో ప్రతిబింబిస్తుందిప్రతీ వెనకబడిన వర్గానికీ ప్రాధాన్యమివ్వడం మా ఎన్డీయే లక్ష్యంఅది సామాజికంగా వెనుకబడిన ప్రాంతం కావొచ్చులేదా వెనుకబడిన వర్గాలు కావొచ్చుప్రభుత్వ పథకాలన్నింటిలోనూ వారికి ప్రాధాన్యం ఉంటుందిదశాబ్దాలుగా 110కి పైగా జిల్లాలు వెనకబడినిర్లక్ష్యానికి గురయ్యాయి. మా ప్రభుత్వం ఈ జిల్లాలను వెనుకబడిన వాటిగా కాక ఆకాంక్షాత్మక జిల్లాలుగా ప్రకటించిఅభివృద్ధి దిశగా నడిపించడం ద్వారా తగిన ప్రాధాన్యమిచ్చింది. "వెనుకబాటు నిర్మూలనకు మేమిచ్చిన ప్రాధాన్యమది". భారత సరిహద్దు గ్రామాలు కూడా చాలా కాలంగా "మారుమూల గ్రామాలు"గా పరిగణించడంతో వెనకబడ్డాయితమ ప్రభుత్వం వాటిని "మొదటి ప్రాధాన్య గ్రామాలు"గా గుర్తించి ఆయా గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందిమళ్ళీ చెబుతున్నా... "వెనుకబాటు నిర్మూలనకు ప్రాధాన్యంఇస్తాంఓబీసీ వర్గం చాలా కాలంగా ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కావాలని కోరుతోందిమా సంకీర్ణ ప్రభుత్వం వారి కోరికను నెరవేర్చిందిగిరిజన వర్గాల్లో అత్యంత అణగారిన వర్గాల కోసం జన్‌మన్ యోజనను ప్రారంభించివారి అభివృద్ధి కోసం రూ. 25,000 కోట్లు కేటాయించాంఅందుకే చెబుతున్నా.. వెనుకబడ్డవారే మా ప్రాధాన్యం.

ఈ దార్శనికతకు అనుగుణంగా మరో ప్రధాన పథకమైన ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజనను ప్రారంభించాంకేంద్ర మంత్రివర్గం రెండు రోజుల క్రితమే ఈ పథకానికి ఆమోదం తెలిపింది ఈ పథకం కింద వ్యవసాయంలో వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ప్రాధాన్యం ఇస్తుందిఈ జిల్లాలు మంచి వ్యవసాయ సామర్థ్యం ఉన్నప్పటికీ దిగుబడిరైతుల ఆదాయం విషయంలో బాగా వెనకబడి ఉన్నాయిఈ జిల్లాలకు ప్రాధాన్యమిచ్చి ఈ పథకం కింద మద్దతిస్తాంవెనుకబాటుకు మేమిచ్చే ప్రాధ్యాన్యమదీ.. దీని వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 1.75 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుందిఈ పథకం ద్వారా లబ్ది పొందే అధిక సంఖ్యాకులు బీహార్ రైతులే.

స్నేహితులారా,

ఈ రోజు వేల కోట్ల విలువైన రైల్వేరహదారుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. శంకుస్థాపనలు జరిగాయిఈ ప్రాజెక్టులు బీహార్ ప్రజల సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరుస్తాయిదేశంలో వివిధ మార్గాల మీదుగా ప్రయాణించేలా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాంఅమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు మోతీహరి-బాపూధామ్ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ వరకు నేరుగా నడుస్తుందిమోతీహరి రైల్వే స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలుకొత్త హంగులతో పునరభివృద్ధి చేస్తున్నాందర్భాంగా-నర్కటియాగంజ్ రైలు మార్గం డబ్లింగ్ వల్ల ఈ మార్గంలో ప్రయాణ సౌలభ్యం బాగా మెరుగవుతుంది.

స్నేహితులారా,

భారత సంస్కృతివిశ్వాసాలతో చంపారన్‌కు ఉన్న లోతైన అనుబంధం ఉందిరామ్-జానకి మార్గం మోతీహారిలోని సత్తార్‌ఘాట్కేసరియాచకియామధుబన్ మీదుగా వెళ్తుందిసీతామర్హి నుంచి అయోధ్య వరకు ఉన్న కొత్త రైల్వే మార్గం చంపారన్ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తుందిఇవన్నీ బీహార్‌లో అనుసంధానతను గణనీయంగా పెంచుతాయిఇక్కడ కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.

కాంగ్రెస్ఆర్జేడీ ప్రభుత్వాలు పేదలుదళితులువెనుకబడిన తరగతులుగిరిజన వర్గాల పేరుతో చాలా కాలం రాజకీయాలు చేశాయివారికి సమాన హక్కులు కల్పించక పోగా తమ కుటుంబాలు మినహా ఇతరులకు గౌరవాన్ని ఇవ్వటంలో కూడా అవి విఫలమయ్యాయివారి అహంకారాన్ని బీహార్ నేడు స్పష్టంగా తెలుసుకుంటోందిదురుద్దేశంతో కూడిన వారి ఆలోచనల నుంచి బీహార్‌ను రక్షించాలినితీశ్ బృందంబీజేపీ బృందంయావత్ ఎన్డీఏ ఏళ్లతరబడి నిరంతరం శ్రమిస్తున్నాయిశ్రీ చంద్ర మోహన్ రాయ్ వంటి ప్రముఖులు మాకు మార్గనిర్దేశనం చేశారుఅందరూ సమష్టిగా బీహార్ అభివృద్ధిని వేగవంతం చేయాలిమంచి భవిష్యత్తు వైపు పయనించాలిబనాయేంగే నయా బీహార్ఫిర్ ఏక్ బార్ ఎన్డీయే సర్కార్ (సరికొత్త బీహార్‌ను నిర్మించేందుకు మరోమారు ఎన్డీయేతో కలిసి ముందుకు సాగుదాంఅని ప్రతిజ్ఞ చేద్దాం.

ఇవాళ ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ప్రజలకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాఇప్పుడు రెండు చేతులూ పైకి ఎత్తి గట్టిగా చెప్పండి…

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

అనేకానేక ధన్యవాదాలు.

గమనిక – ఇది ప్రధాని చేసిన ప్రసంగానికి దాదాపు అనువాదంప్రధాని హిందీలో మాట్లాడారు.

 

***


(Release ID: 2146097)