హోం మంత్రిత్వ శాఖ
నక్సలిజంపై ఈ రోజు రాయ్పూర్లో సమీక్షా సమావేశం... కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత... పాల్గొన్న ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్,
మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఒడిశాల డీజీపీలు, ఏడీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు
* నకల్స్ వారి ఆయుధాలను విడిచిపెట్టి లొంగుబాటు విధానాన్ని సద్వినియోగపరచుకొని,
ప్రధాన స్రవంతిలో చేరాలంటూ కేంద్ర హోం మంత్రి పిలుపు
* ఏటా వానాకాలంలో విరామం పొందే నక్సలైట్లు ఈ సారి వర్షకాలంలో ప్రశాంతంగా నిద్రపోలేరు; భద్రతాదళాలు వాటి కార్యకలాపాలను కొనసాగిస్తాయి:కేంద్ర హోం మంత్రి
* దేశం 2026 మార్చి 31 నాటికి నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తం అవుతుందని
పునరుద్ఘాటించిన హోం మంత్రి
Posted On:
22 JUN 2025 7:23PM by PIB Hyderabad
నక్సలిజంపై రాయ్పూర్లో ఈ రోజు ఒక సమీక్షా సమావేశానికి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్తో పాటు ఒడిశా రాష్ట్రాలకు చెందిన డీజీపీలు, ఏడీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇంతకు ముందు నిలిచిపోయిన నక్సల్-వ్యతిరేక ప్రచారోద్యమాన్ని వారు జోరుగా
కొనసాగించడంతో పాటు రాష్ట్రాన్ని నక్సలిజం బారి నుంచి విముక్తం చేసే దిశగా ముందడుగు వేయడం శ్రీ విష్ణు దేవ్ సాయి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి శ్రీ విజయ్ శర్మ గత ఏడాదిన్నర కాలంలో సాధించిన ఒక అతి గొప్ప విజయమని కేంద్ర హోం మంత్రి అభివర్ణించారు. శ్రీ విష్ణు దేవ్ సాయి, శ్రీ విజయ్ శర్మ నక్సల్-వ్యతిరేక కార్యకలాపాలకు ఒక కొత్త వేగాన్ని ఇవ్వడం ఒక్కటే కాకుండా, భద్రతాదళాల నైతికస్థైర్యాన్ని పెంపొందించడంతో పాటు ఈ పోరాటంలో పూర్తి అంకితభావంతో ముఖ్యమైన తోడ్పాటును కూడా అందించారని ఆయన అన్నారు.
మన దేశం 2026 మార్చి నెలాఖరుకల్లా నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తం అవుతుందన్న తన విశ్వాసాన్ని కేంద్ర హోం శాఖ, సహకార శాఖ మంత్రి పునరుద్ఘాటించారు. మన భద్రత దళాలు ప్రదర్శించిన ధైర్య, సాహసాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రూపొందించిన కచ్చిత వ్యూహాలతో ఈ లక్ష్యాన్ని మనం తప్పక సాధించగలుగుతామని ఆయన అన్నారు. ప్రతి ఏటా వానాకాలంలో విరామం పొందే నక్సల్స్ ఈసారి వర్షాకాలంలో ప్రశాంతంగా కునుకు తీయలేరని, మన భద్రత బలగాలు వాటి కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉండడమే దీనికి కారణమని ఆయన అన్నారు. నక్సలిజం బాట పట్టి దారితప్పిన యువతీ యువకులంతా తమ ఆయుధాలను వదిలిపెట్టాలని, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అమలుచేస్తున్న లొంగుబాటు విధానాన్ని సద్వినియోగపరచుకోవాలని శ్రీ అమిత్ షా యువతకు విజ్ఞప్తి చేశారు. యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, నవ ఛత్తీస్గఢ్ అభివృద్ధి ప్రయాణంలో భాగం పంచుకోవడానికి ఇంతకంటే మెరుగైన అవకాశం వారికి
లభించదన్నారు. హింస బాటన సాగుతున్న యువత ప్రభుత్వంపై నమ్మకముంచి సమాజ ప్రధానస్రవంతిలో చేచాలని శ్రీ షా కోరారు. అలా చేయడం వల్ల, వారు తమంత తాము ఛత్తీస్గఢ్ అభివృద్ధి యాత్రలో పాలుపంచుకొన్నవారవుతారని ఆయన అన్నారు.
లొంగిపోయిన నక్సలైట్లకు ఇచ్చిన వాగ్దానాలన్నింటిని కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నెరవేరుస్తాయని, అంతేకాకుండా మరింత ఎక్కువ సాయం అందించడానికి కూడా కృషి చేస్తాయని శ్రీ షా అన్నారు.
***
(Release ID: 2138794)