రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో రక్షణ మంత్రి నేతృత్వంలో సాయుధ దళాల అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు..

2,500 సైనికులతో కలిసి యోగాసనాలు, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేసిన మంత్రి

యోగా సాధన ద్వారా మన సాయుధ దళాలు సాధించిన శారీరక సామర్థ్యం, మానసిక నియంత్రణను ఆపరేషన్ సిందూర్ అద్దం పడుతోంది: రాజ్‌నాథ్ సింగ్

Posted On: 21 JUN 2025 10:06AM by PIB Hyderabad

2025 జూన్ 21న జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లోని ఉత్తర కమాండ్‌లో సుమారు 2,500 మంది సైనికులతో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవైవేడుకలకు రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ప్రశంసించారుఆరోగ్యంరోగ రహిత జీవనానికీ యోగా సమగ్రంగా పనిచేస్తుందని ప్రధానంగా పేర్కొన్నారుఒత్తిడిఆందోళననిరాశ వంటి వాటితో ఉన్న నేటి వేగవంతమైన ప్రపంచంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు యోగా సార్వత్రిక పరిష్కారమని అన్నారు

మస్యల్లో ఉన్న ప్రజలకు యోగా సాంత్వన అందిస్తుందిఇది ఒక కళశాస్త్రంతాత్వికతఆధ్యాత్మికతదైనందిన జీవితంలో యోగా సాధన చేసేవారికి శరీరంపైనా, మనస్సుపైనా నియంత్రణ ఉంటుందిఇది మనల్ని ఒక దానికి వెంటనే ఆనాలోచితంగా ప్రతిస్పందించేలా కాకుండా చురుగ్గా చేస్తుంది.” అని మంత్రి అన్నారు.

శారీరకమానసిక నియంత్రణకు ఒక మంచి ఉదాహరణ ఆపరేషన్ సిందూర్‌ అని మంత్రి అన్నారుఈ ఆపరేషన్ సమయంలో భారత సాయుధ దళాలు సంయమనంసమతుల్యతఖచ్చితత్వాన్ని ప్రదర్శించాయని పేర్కొన్నారుఇది యోగా సాధన ద్వారా వారు సాధించిన అంతర్గత సామర్థ్యాన్ని తెలియజేస్తోందని అన్నారుభారతదేశ సామాజిక ఐక్యతనుమత సామరస్యాన్ని పహల్గామ్ ఉగ్రవాద దాడి లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారుభారత్‌కు వ్యతిరేకంగా జరుగుతోన్న ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినందుకు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న స్పష్టమైన సందేశాన్ని పాకిస్తాన్‌కు ఆపరేషన్ సిందూర్ ఇచ్చిందని తెలిపారు

2016 మెరుపుదాడులు(సర్జికల్ స్ట్రైక్స్), 2019 వైమానిక దాడులు (ఎయిర్ స్ట్రైక్స్సహాజంగా పురోగమనమే ఆపరేషన్ సిందూర్కాల్పుల విరమణ కోసం పాక్ అభ్యర్థించే విధంగా ఇది చేసిందితర్వాతే మనం ఆపరేషన్‌కు విరామం ఇచ్చాంనేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదుఉగ్రవాదంపై అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి భారతదేశం పూర్తిగా సిద్ధంగా ఉంది.” అని వ్యాఖ్యానించారు

భారతదేశాన్ని అంతర్గతంగా బలహీనపరచాలని పాకిస్తాన్ కోరుకుంటున్నదని రక్షణ మంత్రి వెల్లడించారు. కానీ మేజర్ సోమనాథ్ శర్మ మాదిరిగానే బ్రిగేడియర్ ఉస్మాన్ కూడా దేశ ఐక్యతసమగ్రత కోసం తన ప్రాణాలను త్యాగం చేశారన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారుదేశం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రస్తుత సమయంలో సమాజంలోని ప్రతి వర్గాన్ని భారతదేశ ఆత్మీయ భావనసంస్కృతితో అనుసంధానించడమే యోగా సాధన నిజమైన అర్థమని గుర్తించుకోవాలని పేర్కొన్నారు. "ఒక వర్గం వెనుకబడి ఉన్నా.. సామరస్యంభద్రత అనే చక్రం విరిగిపోతుందికాబట్టి నేడు మనం యోగాను వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా సమాజ గురించే ఆలోచించే స్థాయిలో ప్రదర్శించాలిఅని వ్యాఖ్యానించారు

సాయుధ దళాలు సిబ్బంది యోగా పట్ల చూపిస్తోన్న మొగ్గును రక్షణ మంత్రి అభినందించారుఇది వారి క్రమశిక్షణఏకాగ్రతపై ప్రత్యక్ష ప్రభావాన్ని కనబరుస్తుందియోగా ఒక సైనికుడిని శారీరకంగామానసికంగా సిద్ధం చేస్తుందని.. దీని ప్రయోజనాలు యుద్ధక్షేత్రంలో కనిపిస్తాయన్న మంత్రి..  సైనికులు ప్రతిరోజూ యోగా సాధన చేయాలని కోరారు

యోగా ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి’ అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను పునరుద్ఘారిస్తూ.. ఇది కేవలం దౌత్యపరమైన వ్యాఖ్య కాదనిఒక దార్శనికత అని పేర్కొన్నారుభారతదేశం ప్రపంచానికి సరిహద్దులుమతంసంస్కృతికి అతీతమైన సాధనాన్ని యోగా రూపంలో అందించిందని అన్నారు

వివిధ సంవత్సరాల అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తాలను ప్రస్తావించారుఈసారి ఇతివృత్తమైన ‘ఒకే ధరిత్రిఒకే ఆరోగ్యం కోసం యోగా’.. భారత్ తన కోసం మాత్రమే కాకుండా ప్రపంచ క్షేమం కోసం ఆలోచిస్తుందన్న సందేశాన్ని ప్రపంచానికి పంపుతోందని ప్రధానంగా చెప్పారు. "మొత్తం ప్రపంచం ఒక కుటుంబందీని కోసం పనిచేయడం మన ఆలోచనలో ఒక భాగంఆలోచనను ఆచరణఆత్మకంగా వ్యక్తీకరించటమే యోగాఅని అన్నారు.

యోగా నిశ్శబ్దంగా ప్రపంచాన్ని మారుస్తోందని… భారత ప్రాచీన సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుండటంఅంగీకరించడం పట్ల ప్రతి ఒక్కరు గర్వపడాలని రక్షణ మంత్రి అన్నారుయోగాను ఒక ట్రెండ్‌గా మాత్రమే కాకుండా ఒక జీవన విధానంగా మలుచుకోవటం అనేది బాధ్యత అని పేర్కొన్నారు. "మన జీవితాల్లో యోగాను ఒక సంకల్పంగా అనుసరించాల్సిన అవసరం ఉందిఇది ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంది కాబట్టి దీనిని మన దినచర్యలో భాగంగా చేసుకోవాలిఅంటూ తన ప్రసంగాన్ని ముగించారు

ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిఉత్తర కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ పాల్గొన్నారు.

విశాఖపట్నంలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ప్రధానమంత్రి అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రసంగాన్ని ఇక్కడి వారందరూ వీక్షించారుజమ్మూకాశ్మీర్లడఖ్‌లలో సరిహద్దుల వద్ద అనేక భౌగోళికవ్యూహాత్మక సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో కూడా యోగా కార్యక్రమాలు జరిగాయిఇది మన సైనికుల నిబద్ధతఉత్సాహాన్ని తెలియజేస్తోంది

జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని కుమ్హారియాలో పీఎం శ్రీ హై స్కూల్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ హాజరయ్యారువిద్యార్థులుఅధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించడంలో యోగాకు ఉన్న ప్రాముఖ్యతను ఆయన ప్రధానంగా ప్రస్తావించారుక్రమశిక్షణసామర్థ్యాన్ని యోగాను తీసుకొస్తుందని.. ప్రతి ఒక్కరూముఖ్యంగా పిల్లలు వారి దైనందిన జీవితంలో యోగా సాధన చేసే విధంగా ప్రోత్సహించాలని ప్రధానంగా పేర్కొన్నారుప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రోత్సహించడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు

దిల్లీలోని డిఫెన్స్ అకౌంట్స్‌ కంట్రోలర్ జనరల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు యోగా సాధన చేశారు.

దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంమ్యూజియంలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయంలోనూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (సీఐఎస్‌సీఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ ముఖ్య అతిథిగా హాజరై.. ఆరోగ్యంఐక్యత పట్ల సాయుధ దళాల నిబద్ధతను ప్రధానంగా పేర్కొన్నారు.

ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి (రీసెర్చ్ అండ్ రెఫరల్)లో 1,500 మందికి పైగా వైద్యులునర్సులుపారామెడికల్ సిబ్బందిరోగులు.. యోగా దినోత్సవ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారుపర్యావరణంసుస్థిర ఆరోగ్యం పట్ల నిబద్ధతకు చిహ్నంగా కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ శంకర్ నారాయణ్డిప్యూటీ కమాండెంట్ మేజర్ జనరల్ అముల్ కపూర్.. సిబ్బందిరోగులు కూడా ఆసుపత్రి ప్రాంగణంలో చెట్లు నాటారు


(Release ID: 2138265)