సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

పీఎంఈజీపీ పథకంలో భాగంగా దేశమంతటా 11,480 సేవా రంగ లబ్ధిదారులకు రూ.300 కోట్లకు పైగా మార్జిన్ మనీ సబ్సిడీని అందించిన కేవీఐసీ


• లబ్ధిదారులకు సబ్సిడీని న్యూఢిల్లీ లోని రాజ్‌ఘాట్ ఆఫీసు నుంచి దృశ్య మాధ్యమం ద్వారా

విడుదల చేసిన కేవీఐసీ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్


• ‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, ప్రతి పల్లెలో ఉపాధితో పాటు స్వయంఉపాధి పునాదులను

పీఎంఈజీపీ పథకం బలపరచింది: కేవీఐసీ చైర్మన్‌

Posted On: 17 JUN 2025 9:30PM by PIB Hyderabad

ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీలో భాగంగా దేశవ్యాప్తంగా 11,480 సేవా రంగాల లబ్ధిదారులకు రూ.300 కోట్ల రుణ సబ్సిడీని ఖాదీగ్రామ పరిశ్రమల సంఘం (కేవీఐసీ)  మంగళవారం (ఈ నెల 17దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేసిందిఈ సబ్సిడీని రూ.906 కోట్ల రుణాలకు సంబంధించి అందించారున్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కేవీఐసీ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ తన బృందంతో కలసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాలను వర్చువల్ మాధ్యమం ద్వారా అందించారుఈ కార్యక్రమంలో కేవీఐసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓరూప్ రాశితో పాటు కేంద్ర కార్యాలయంలోని ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘స్వయంసమృద్ధి సహితఅభివృద్ధి చెందిన భారత్’ దృష్టికోణానికి గుర్తింపు లభిస్తోందనీదీనికి ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీబలమైన స్తంభంగా మారిందంటూ అభివర్ణించారుఈ పథకం ఆర్థిక సహాయాన్ని అందించడానికి మాత్రమే పరిమితం కాదనీఇది ఒక సామాజిక ఉద్యమంగా కూడా రూపుదిద్దుకొందనీలక్షలమంది యువతీ యువకులకుమహిళలకుచేతివృత్తిదారులకు స్వతంత్రోపాధిని కల్పించడంతో పాటు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఉపకరిస్తుందన్నారుప్రతి గ్రామంలో ఉపాధినీస్వయంసమృద్ధినీ అంకురింప చేయడంలో ఈ పథకం పోషిస్తున్న పాత్ర ప్రధానమైందని ఆయన అన్నారు.

image.png

దేశంలోని మొత్తం ఆరు మండలాలు ఉత్సాహంగా ఈ ఆర్థిక సహాయ పథకంలో భాగం పంచుకొన్నాయికేంద్రీయ మండలంలో  2403 ప్రాజెక్టుల కోసం రూ.72 కోట్ల సబ్సిడీని పంపిణీ చేశారుఈ ప్రాజెక్టులు ఉత్తర ప్రదేశ్మధ్య ప్రదేశ్ఛత్తీస్‌గఢ్‌ఉత్తరాఖండ్‌లలో ఉన్నాయిఈ ప్రాజెక్టులకు మొత్తం రూ.218 కోట్ల రుణాన్ని మంజూరు చేశారుతూర్పు మండలంలో బీహార్ఝార్ఖండ్ఒడిశాపశ్చిమ బెంగాల్అండమాన్-నికోబార్ దీవులలోని 996 ప్రాజెక్టులకు సుమారు రూ.71 కోట్లను రుణాల రూపంలో మంజూరు చేసిరూ.22 కోట్లను సబ్సిడీగా ఇచ్చారు.

ఉత్తర భారతదేశంలోని పంజాబ్హర్యానాహిమాచల్ ప్రదేశ్జమ్మూ-కాశ్మీర్లద్దాఖ్రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత చండీగఢ్ ప్రాంతానికి మొత్తం 2713 ప్రాజెక్టులకు గాను రూ.61 కోట్ల సబ్సిడీని ఇచ్చారువాటికే రుణాల రూపంలో రూ.184 కోట్లను మంజూరు చేశారుఈశాన్య ప్రాంతంలో 81 ప్రాజెక్టులకు రూ.2 కోట్ల సబ్సిడీని ఇచ్చారుఈ ప్రాంతంలో అసోమ్మణిపుర్మేఘాలయమిజోరమ్నాగాల్యాండ్సిక్కిమ్త్రిపురలు ఉన్నాయి.

దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్తెలంగాణకర్నాటకతమిళ నాడుకేరళపాండిచ్చేరిలలో 4565 ప్రాజెక్టులకు సంబంధించి రూ.116 కోట్ల సబ్సిడీని పంపిణీ చేశారుఈ ప్రాజెక్టులకు రూ.343 కోట్ల కన్నా ఎక్కువ రుణాలను మంజూరు చేశారుపశ్చిమ మండలానికి చెందిన మహారాష్ట్రగుజరాత్గోవాలలో 722 ప్రాజెక్టులకు గాను రూ.26 కోట్ల కన్నా ఎక్కువ సబ్సిడీనిరూ.82 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు.

ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని (పీఎంఈజీపీ) 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదలుపెట్టిన తరువాత ఇది గ్రామీణ భారతంతో పాటు మన దేశంలోని పట్టణ ప్రాంతాలలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకుస్వావలంబనకు ఒక దృఢమైన స్తంభంగా నిలిచిందిఈ పథకంలో భాగంగా ఇంతవరకు మొత్తం 10,18,185 సూక్ష్మ వాణిజ్య సంస్థలను ఏర్పాటు చేయగాఇందుకోసం భారత ప్రభుత్వం ఇంతవరకు రూ. 73,348 కోట్ల రుణాలను మంజూరు చేసిందిదీనికిగాను రూ.27,166 కోట్లకు పైగా మార్జిన్ మనీ సబ్సిడీని లబ్ధిదారులకు అందించారుఇప్పటి వరకుదేశవ్యాప్తంగా 90,04,541 మంది ఈ పథకం ద్వారా ప్రత్యక్ష ఉపాధినీపరోక్ష ఉపాధినీ అందుకొన్నారుదీంతో ఇది దేశంలో స్వయంఉపాధి పథకాలన్నిటిలోకీ అత్యంత ప్రభావాన్ని కలగజేసిన పథకంగా మారిందిఈ కార్యక్రమం స్వయంఉపాధిని ప్రోత్సహించడం ఒక్కటే కాకుండాప్రధానమంత్రి చెబుతున్న స్వయంసమృద్ధి యుక్త భారత్ దార్శనికతను క్షేత్ర స్థాయిలో సాకారం చేయడంలో కూడా ముఖ్య పాత్రను పోషిస్తోంది.

 

***


(Release ID: 2137217)