ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సైప్రస్, భారత వాణిజ్య రంగ ప్రముఖులతో ప్రధానమంత్రి, సైప్రస్ అధ్యక్షుల భేటీ

Posted On: 16 JUN 2025 2:17AM by PIB Hyderabad

సైప్రస్ అధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్‌తో కలసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సైప్రస్భారత్‌ వాణిజ్య రంగ ప్రముఖులతో లిమాసోల్‌లో  జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారుఈ సమావేశంలో బ్యాంకింగ్ఆర్థిక సంస్థలురక్షణఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్), నౌకావాణిజ్యంషిప్పింగ్సాంకేతికతనవకల్పనడిజిటల్ సాంకేతికలుకృత్రిమ మేధఐటీ సర్వీసులుపర్యటనరవాణావంటి భిన్న రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు.

గత 11 సంవత్సరాల్లో భారత్‌లో శరవేగంగా చోటుచేసుకొన్న ఆర్థిక మార్పును ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారురాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అమల్లోకి తెచ్చిన సంస్కరణలువిధానాల్లో అనూహ్య మార్పులకు తావివ్వక పోతుండడంనిలకడతనంతో కూడిన ప్రజాస్వామ్య ప్రక్రియ.. వీటితో పాటు ‘వ్యాపార నిర్వహణలో సౌలభ్యం’లతో ప్రపంచంలో అన్ని దేశాల కన్నా శరవేగంగా ముందుకు పోతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ మారిందని ఆయన వివరించారునవకల్పనడిజిటల్ విప్లవంఅంకుర సంస్థలుభవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరీ అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాలు.. వీటి అన్నింటికీ పెద్దపీట వేస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారుప్రపంచంలో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియా కొన్ని సంవత్సరాల్లో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు అనువైన స్థితిలో ఉందని ఆయన తెలిపారుపౌర విమానయానంఓడరేవులునౌకానిర్మాణండిజిటల్ మాధ్యమంలో చెల్లింపులుపర్యావరణానికి హాని చేయని రీతిన అభివృద్ధి సాధన దిశలో పయనం.. వీటిలో భారత్ స్థిరంగా ముందుకు దూసుకుపోతోందని ఆయన వివరించారుదీంతో భారత్‌తో చేయి కలపడానికి సైప్రస్ కంపెనీలకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారునైపుణ్యం కలిగిన ప్రతిభావంతులుఅంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థ భారత్‌కున్న బలాలు అని ప్రధానమంత్రి చెబుతూఇదే సందర్భంలో ఇండియా వృద్ధి గాథకు తోడ్పాటును అందిస్తున్న తయారీఏఐక్వాంటమ్కీలక ఖనిజాల రంగాల గురించి కూడా ప్రధానంగా ప్రస్తావించారు.     

భారత్‌కు ఒక ప్రధాన ఆర్థిక భాగస్వామి దేశంగా సైప్రస్ ఉందనిమరీ ముఖ్యంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐరంగంలో వెన్నుదన్నుగా నిలుస్తోందని ప్రధానమంత్రి చెబుతూభారతదేశ ఆర్థిక రంగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి సైప్రస్ ఎంతో ఆసక్తిని కనబరుస్తుండటాన్ని ఆహ్వానించారుఆర్థిక సేవల రంగంలో వాణిజ్య అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉన్నాయని నేతలు ఇద్దరూ ప్రధానంగా ప్రస్తావిస్తూగుజరాత్‌లోని ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్‌ఛేంజ్ ‘గిఫ్ట్ సిటీ’కిసైప్రస్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూకుదరడాన్ని స్వాగతించారురెండు దేశాల మధ్య సీమాంతర చెల్లింపుల కోసం యూపీఐని ప్రారంభించడానికి ఎన్ఐపీఎల్ (ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్), యూరోబ్యాంక్ సైప్రస్‌లు ఒక అవగాహనకు వచ్చాయిఇది పర్యాటకులకువాణిజ్య సంస్థలకు మేలు చేయనుందిభారత్-గ్రీస్-సైప్రస్ (ఐజీసీబిజినెస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిల్ ప్రారంభం కావడాన్ని కూడా ప్రధానమంత్రి ప్రశంసించారుఇది షిప్పింగ్లాజిస్టిక్స్పునరుత్పాదక ఇంధనంపౌర విమానయానండిజిటల్ సర్వీసుల వంటి రంగాల్లో త్రైపాక్షిక సహకారం పెరిగేందుకు దోహదపడనుందిఅనేక భారతీయ కంపెనీలు సైప్రస్‌ను యూరప్‌నకు ఒక ప్రవేశద్వారంగాఐటీ సర్వీసులుఆర్థిక నిర్వహణపర్యటనలకు కూడలి (హబ్)గా భావిస్తున్నాయన్న వాస్తవాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు.

వచ్చే ఏడాదిలో ఈయూ కౌన్సిల్‌కు అధ్యక్ష బాధ్యతను స్వీకరించడానికి సైప్రస్ సన్నద్ధం అవుతున్న క్రమంలోనేతలు ఇద్దరూ భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచడానికి తాము నిబద్ధులమంటూ పునరుద్ఘాటించారుభారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ సంవత్సరం చివరికల్లా తుది రూపు సంతరించుకోగలదన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారుఈ ఒప్పందం కొలిక్కి వస్తే ఉభయ దేశాల వాణిజ్యఆర్థిక సహకారానికి పెద్ద ఊతం లభిస్తుందివాణిజ్య రౌండ్ టేబుల్ సమావేశం ఆచరణాత్మక సూచనలు-సలహాలను అందించిందనీఇవి ఒక సువ్యవస్థిత ఆర్థిక రోడ్‌మ్యాప్‌నకు ఆధారంగా మారగలవనీదీంతో వాణిజ్యంనవకల్పనవ్యూహాత్మక రంగాల్లో దీర్ఘకాలిక సహకారం రూపుదాల్చనుందనీ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ఉమ్మడి ఆకాంక్షలుభవిష్యత్తుపై దృష్టిని కేంద్రీకరించిన విధానాలతో భారత్సైప్రస్‌లు హుషారైనపరస్పరం ప్రయోజనకారి ఆర్థిక సహకార పూర్వక  నవశకాన్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ‌

 

***


(Release ID: 2136570)