ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో గాయపడిన వారికి ప్రధాని పరామర్శ


అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని అధ్యక్షతన సమీక్ష

Posted On: 13 JUN 2025 2:14PM by PIB Hyderabad

అనేక మంది ప్రాణాలను బలి తీసుకున్న అహ్మదాబాద్‌లోని విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అనంతరం ఈ విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తితో సహా, గాయపడిన ఇతరులను పరామర్శించారు. ఈ ప్రతికూల సమయంలో వారికి దేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

కొనసాగుతున్న సహాయక చర్యలపై అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి పీఎం అధ్యక్షత వహించారు.

ఎక్స్‌‌లో వేర్వేరు పోస్టుల్లో ప్రధాని ఇలా అన్నారు:

‘‘అహ్మదాబా‌ద్ లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తితో సహా గాయపడిన వారిని పరామర్శించాను. ఈ క్లిష్ట సమయంలో వారికి, వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చాను. వారు త్వరగా కోలుకోవాలని దేశం మొత్తం ప్రార్థిస్తోంది’’

‘‘అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను’’


(Release ID: 2136228)