లోక్సభ సచివాలయం
స్వాతంత్య్రవీర్ వినాయక్ దామోదర్ సావర్కర్కు పుష్పాంజలి ఘటించిన పార్లమెంటు సభ్యులు
Posted On:
28 MAY 2025 5:59PM by PIB Hyderabad
స్వాతంత్య్రవీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జె పి నడ్డా, రాజ్యసభ ఉపాధ్యక్షులు శ్రీ హరివంశ్ ఈరోజు సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో ఆ మహనీయుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
పార్లమెంటు సభ్యులు, పార్లమెంటు మాజీ సభ్యులు, లోక్సభ సెక్రటరీ జనరల్ శ్రీ ఉత్పల్ కుమార్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ పి.సి. మోదీ, ఇతర సీనియర్ అధికారులు సైతం స్వాతంత్య్రవీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
వీర్ వర్కర్గా ప్రసిద్ధి చెందిన స్వాతంత్య్ర వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ 1883, మే 28న జన్మించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తీ, ఉద్యమకారులు, కవి, రచయిత, దార్శనిక సామాజిక సంస్కర్త కూడా. 20వ శతాబ్ద ప్రారంభంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటన స్ఫూర్తిని రగిలించడంలో వీర్ సావర్కర్ కీలక పాత్ర పోషించారు. స్వాతంత్య్రం కోసం భారత యువతను ఏకం చేయడం, సమీకరించడం లక్ష్యంగా విప్లవ సంస్థలను స్థాపించారు. అండమాన్-నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలులో ఆయన జైలు శిక్ష అనుభవించిన సమయంలో అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ, అచంచలమైన సంకల్పంతో అక్కడ అనేక కష్టాలను భరించారు.
తన విప్లవాత్మక భావజాలానికి మించి, వీర్ సావర్కర్ సామాజిక సంస్కరణలు, ఆధునీకరణకు గట్టి మద్దతుదారులు. హేతువాదం, సామాజిక దురాచారాలను నిర్మూలించడం, ప్రగతిశీల భారతీయ సమాజాన్ని పెంపొందించడం వంటి ఆదర్శాలను ఆయన సమర్థించారు. వీర్ సావర్కర్ రచనలు, జాతీయ స్వేచ్ఛ కోసం ఆయన అవిశ్రాంత కృషి, బలమైన, స్వావలంబన గల భారత్ పట్ల తన దార్శనికత ద్వారా ఆయన వారసత్వం కొనసాగుతున్నది. ఆయన జీవితం- దేశభక్తి, ఎటువంటి పరిస్థితులనైనా ఎదిరించగల సామర్థ్యం, సంస్కరణల కోసం శక్తిమంతమైన నిదర్శనంగా మిగిలిపోయింది.
సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో ఉంచిన స్వాతంత్య్రవీర్ వి.డి. సావర్కర్ చిత్రపటాన్ని శ్రీమతి చంద్రకళ కుమార్ కదమ్ చిత్రించారు. 2003, ఫిబ్రవరి 26న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం అధికారికంగా ఈ మహనీయుని చిత్రపటాన్ని ఆవిష్కరించారు.
***
(Release ID: 2132186)