సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఈ నెల 25-27 తేదీల మధ్య భారత్ లో మాల్దీవుల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పర్యటన
Posted On:
26 MAY 2025 6:59PM by PIB Hyderabad
మాల్దీవుల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అబ్దుల్లా ఖలీల్ ఈ నెల 25వ తేదీ మొదలు 27వరకు భారత్లో పర్యటిస్తున్నారు.
2. ఈ నెల 26న జరిగిన ఇండియా-మాల్దీవ్స్ హై లెవెల్ కోర్ గ్రూపు (హెచ్ఎల్సీజీ) రెండో సమావేశంలో డాక్టర్ ఖలీల్ మాల్దీవులకు నాయకత్వం వహించారు. విస్తృత ఆర్థిక, నౌకాప్రధాన వాణిజ్యంలో భద్రతాపరమైన భాగస్వామ్యం అంశంలో భారత్-మాల్దీవుల దార్శనిక పత్రం లో పొందుపరిచిన కార్యక్రమాల అమలులో చోటుచేసుకున్న ప్రగతిని పర్యవేక్షించడానికి ఈ హెచ్ఎల్సీజీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం కొనసాగిన క్రమంలో, రాజకీయ అంశాలు, రక్షణ-భద్రతాపరమైన సహకారం, అభివృద్ధి ప్రధాన భాగస్వామ్యం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు.. వీటిని ఇప్పటి స్థాయి కన్నా మరింత అధికంగా ప్రోత్సహించే పద్ధతుల్ని చర్చించారు.
3. పహల్గామ్లో కిందటి నెలలో జరిగిన ఉగ్రవాద దాడిని మంత్రి డాక్టర్ ఖలీల్ తీవ్రంగా ఖండించారు. భారతదేశ ప్రజలతోపాటు భారత ప్రభుత్వానికి మాల్దీవులు పక్షాన సంఘీభావాన్ని ఆయన వ్యక్తం చేస్తూ, ఉగ్రవాదానికి చెందిన అన్ని రూపాలతో పాటు ఉగ్రవాదంతో ముడిపడ్డ అన్ని అభివ్యక్తీకరణలకూ వ్యతిరేకంగా పోరాడడంలో భారత్కు బలమైన మద్దతును తెలిపాశారు.మాల్దీవులకు అత్యవసర ఆర్థిక సహాయాన్ని అందించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ఈ విధమైన ఆర్థిక సాయం మాల్దీవులలో ప్రజల దైనందిన జీవనంలో సకారాత్మక ప్రభావాన్ని చూపింది.
4. డాక్టర్ ఖలీల్ తన పర్యటనలో భాగంగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. పరస్పర హితం ముడిపడ్డ అంశాలపై ఈ సందర్భంగా ఇరు పక్షాలు చర్చించాయి.
5. మూడో హెచ్ఎల్సీజీ సమావేశాన్ని ఉభయపక్షాలకూ అంగీకారం కుదిరిన తేదీల్లో మాల్దీవులు లోని మాలేలో నిర్వహించాలని కూడా నిర్ణయించారు.
6. భారత్ నౌకావాణిజ్యాన్ని సాగిస్తున్న ప్రధాన పొరుగుదేశాల్లో మాల్దీవులు ఒకటి. ఇండియా అనుసరిస్తున్న ‘నైబర్హుడ్ ఫస్ట్’ (‘పొరుగుదేశానికి ప్రాధాన్యం’) విధానంలోనూ, ‘విజన్ మహాసాగర్’ (మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఎక్రాస్ రీజియన్స్.. ‘అన్ని రంగాల్లోనూ భద్రత, ప్రగతి కోసం ఉద్దేశించిన పరస్పర, అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగే దార్శనికత’)లోనూ మాల్దీవులు ఒక ముఖ్య భాగస్వామిగా ఉంది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య నెలకొన్న విస్తృత ఆర్థిక, నౌకావాణిజ్య భద్రత ప్రధాన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసింది.
***
(Release ID: 2131600)