సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయతా స్ఫూర్తిని ప్రేరేపించేలా ఒకే దేశం, ఒకే హృదయ స్పందన


· సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం

Posted On: 16 MAY 2025 8:50PM by PIB Hyderabad

మొక్కవోని దేశభక్తిని ప్రదర్శించిన స్ఫూర్తిని కీర్తిస్తూభారత వీరుల గౌరవార్థం.. ‘ఏక్ దేశ్ ఏక్ డ్కన్’ (కే దేశంఒకే హృదయ స్పందనఅనే శక్తిమంతమైనబాధ్యతాయుతమైన కార్యక్రమాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.

దేశ ప్రతిష్ఠను ముక్తకంఠంతో చాటుతూ అందరినీ ఏకం చేయడం కోసం రూపొందించిన ఈ కార్యక్రమ స్ఫూర్తి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల హృదయాల్లో బలంగా ప్రతిధ్వనిస్తోందిఐక్యతా స్ఫూర్తినిదేశభక్తి భావననుమువ్వన్నెల జెండాపై గౌరవాన్ని పెంపొందించే విధంగా #EkDeshEkDhadkan (#ఒకదేశం ఒకే హృదయస్పందనఅనే నినాదం డిజిటల్ వేదికల్లో విశేష ప్రాచుర్యాన్ని పొందుతోంది.

మన విస్మృత వీరులుపరాక్రమశీలుర ధైర్యసాహసాలకు ప్రణమిల్లుతూ.. దేశం వారిపట్ల కృతజ్ఞతతో ఉందన్న సమష్టి భావనను ఇది ప్రతిబింబిస్తుంది.

సమన్వయంతో కూడిన జాతీయ భాగస్వామ్యం

గత 48 గంటల్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 43 సంస్థలు కలిసికట్టుగాఉత్సాహంగా పాల్గొన్నాయి.

·         మనల్ని కలిపి ఉంచే మువ్వన్నెలతోపాటు సాయుధ బలగాలువీరులకు వందనం చేస్తూ.. ఆ సంస్థలన్నీ తమ ముఖచిత్రాలను (డీపీమూడురంగులతో మార్చి ఈ కార్యక్రమంలో తమ భాగస్వామ్యాన్ని వ్యక్తీకరించాయి.

జెండా రంగుల్లో వెలుగులీనిన ఏఎస్ఐ ఆధ్వర్యంలోని స్మారక కట్టడాలు

ప్రముఖ సాంస్కృతిక కట్టడాలువారసత్వ ప్రదేశాలు భారతీయ జెండా రంగుల్లో మురిసిపోయాయి:

·         విక్టోరియా మెమోరియల్ (పశ్చిమ బెంగాల్)సాలార్జంగ్ మ్యూజియం (ఆంధ్రప్రదేశ్)ఎన్‌జీఎంఏఢిల్లీప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలక్నో.

·         భారత జాతీయ ప్రాచీన పత్ర భాండాగారం కూడా అద్భుతమైన తన భవనానికి వెలుగులు దిద్దుతూ కార్యక్రమంలో భాగమైంది.

భారత పురావస్తు సర్వే సంస్థ (ఏఎస్ఐపర్యవేక్షణలో దేశవ్యాప్తంగా 60కి పైగా వారసత్వ కట్టడాలు మూడు రంగులతో మెరిసిపోయాయివాటిలో కొన్ని:  

·         ఢిల్లీలోని ఎర్రకోటఖిలా రాయ్ పితోరాసఫ్దర్‌జంగ్ సమాధిపురానా ఖిలా.

·         రాజస్థాన్‌లోని కుంభాల్‌ఘర్చిత్తోర్‌ఘర్ఘంటా కోటఉత్తరప్రదేశ్‌లోని గులాబ్ బాదీ.

·         ఉదయగిరి గుహలు (ఒడిశా)అశోక స్తంభం (బీహార్)రహత్‌ఘర్ కోట (మధ్యప్రదేశ్)బల్లార్‌పూర్ కోట (మహారాష్ట్ర)తదితర కట్టడాలు.

·         అస్సాంలోని రంగ్ ఘర్కర్ణాటలోని చిత్రదుర్గ కోటలేహ్ ప్యాలెస్.

ఐక్యతను ప్రతిబింబించేలాకృతజ్ఞతను చాటేలా.. సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మే 14న కుతుబ్ మినార్‌ను సందర్శించారుఅక్కడ ప్రత్యేక తిరంగా ప్రదర్శన నిర్వహించారుమన సాయుధ బలగాలను కీర్తిస్తూజాతీయతా స్ఫూర్తిని రగిల్చిన మన విస్మృత వీరులుపరాక్రమశీలుర ధైర్యసాహసాలకు ప్రణమిల్లుతూ మంత్రి నివాళి అర్పించారు.

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థలు ప్రత్యేక కథనాలుచిత్రలేఖనాలుప్రత్యేక ప్రదర్శనలుసంగీతంతో నివాళిక్విజ్‌లుబ్యాడ్జిలురిస్ట్ బ్యాండ్ల పంపిణీప్రజలతో తిరంగా ర్యాలీల వంటి కార్యక్రమాలను చేపడుతున్నాయితద్వారా భారతీయులందరికీ గర్వకారణమైన ఈ ఉత్సవాన్ని ప్రజలంతా సమష్టిగా చేసుకునేలా కృషిచేస్తున్నారు.

 

***


(Release ID: 2129300)
Read this release in: English , Urdu , Hindi , Marathi