రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత రక్షణ మంత్రికి అమెరికా రక్షణ కార్యదర్శి ఫోన్:


పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల మృతిపట్ల సంతాపం

పాకిస్తాన్ హింసను ప్రోత్సహించే దేశమని రుజువైంది... అంతర్జాతీయ తీవ్రవాదాన్ని ఎగదోస్తూ

ఈ ప్రాంతాన్ని అస్థిరపరుస్తోంది.. ఈ హేయమైన చర్యలను అంతర్జాతీయ సమాజం నిర్ద్వంద్వంగా, నిస్సంకోచంగా ఖండించాలి, నిరసించాలి: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

భారత్‌కు అమెరికా సంఘీభావంగా నిలుస్తుంది... స్వీయ రక్షణపై భారత్ హక్కులకు అండగా ఉంటుంది: శ్రీ పీట్ హెగ్సేత్

प्रविष्टि तिथि: 01 MAY 2025 6:06PM by PIB Hyderabad

అమెరికా రక్షణ కార్యదర్శి శ్రీ పీట్ హెగ్సేత్ మే 1న భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌కు ఫోన్ చేసి మాట్లాడారుజమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల ఉగ్రవాదు దాడిలో అమాయక పౌరుల మరణంపట్ల సానుభూతినిసంతాపాన్ని తెలిపారుఉగ్రవాద సంస్థలకు మద్దతుశిక్షణ ఇవ్వడంతోపాటు నిధులు సమకూర్చే చరిత్ర పాకిస్తాన్‌కు ఉందని భారత రక్షణ మంత్రి అమెరికా రక్షణ కార్యదర్శికి ఈ సందర్భంగా చెప్పారు.

పాకిస్తాన్ హింసను ప్రేరేపించే దేశంగా రుజువైంది. అంతర్జాతీయ తీవ్రవాదాన్ని ఎగదోస్తూ ఈ ప్రాంతాన్ని అస్థిరపరుస్తోందిప్రపంచం ఇకపై ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదు” అని రక్షణ మంత్రి అన్నారుఈ హేయమైన ఉగ్రవాద చర్యలను అంతర్జాతీయ సమాజం నిర్ద్వంద్వంగానిస్సంకోచంగా ఖండించాల్సిననిరసించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఉగ్రవాదంపై పోరాటంలో అమెరికా ప్రభుత్వ పూర్తి మద్దతు భారత్‌కు ఉంటుందని ఆ దేశ రక్షణ కార్యదర్శి పునరుద్ఘాటించారుభారత్‌కు అమెరికా సంఘీభావంగా నిలుస్తుందనిస్వీయ రక్షణపై భారత్ హక్కులకు అండగా ఉంటుందని తెలిపారు.  

 

***


(रिलीज़ आईडी: 2126000) आगंतुक पटल : 35
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil