ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతీయ ఉక్కు రంగాన్ని పరిరక్షించేందుకు దిగుమతులపై 12 శాతం తాత్కాలిక సుంకాన్ని విధించిన కేంద్రం


స్టీలు దిగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఉత్పత్తిదారులకు ఊరట
ఆత్మనిర్భర భారత్ సాధనకు నిర్ణయాత్మక నాయకత్వం వహిస్తున్న ప్రధానికి ధన్యవాదాలు: కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి

Posted On: 21 APR 2025 8:40PM by PIB Hyderabad

ముడి ఇనుముమిశ్రమ లోహ ఉక్కుతో తయారైన కొన్ని ఉత్పత్తుల దిగుమతులపై 12 శాతం తాత్కాలిక సుంకం విధించాలనే నిర్ణయాన్ని కేంద్ర ఉక్కుభారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ హెచ్‌డీ కుమారస్వామి స్వాగతించారుపెరిగిన దిగుమతుల కారణంగా ఎదురవుతున్న ప్రతికూల ప్రభావాల నుంచి దేశీయ ఉత్పత్తిదారులను రక్షించేందుకు సరైన సమయంలో తీసుకున్న నిర్ణయమిదిఇది మార్కెట్లో న్యాయమైన పోటీ ఉండేలా చర్యలు తీసుకుంటుంది.

‘‘ఈ చర్య పెరుగుతున్న దిగుమతుల వల్ల ఒత్తిడి ఎదుర్కొంటున్న దేశీయ ఉత్పత్తిదారులకు ముఖ్యంగా చిన్నమధ్య తరహా సంస్థలకు ఊరటనిస్తుందిదిగుమతులపై తాత్కాలికంగా విధించిన ఈ సుంకం మార్కెట్‌ స్థిరీకరణను పునురుద్ధరించిదేశీయ పరిశ్రమల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది’’.

ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా వ్యూహాత్మక రంగాలను బలోపేతం చేయడంలో నాయకత్వం వహిస్తూనిరంతర ప్రోత్సాహం అందిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి శ్రీ కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారుభారతీయ ఉక్కు రంగాన్ని స్థిరత్వంస్వయం సమృద్ధి సాధించిఅంతర్జాతీయంగా పోటీ పడేలా చేసేందుకు ఈ రంగానికి చెందిన వారందరితో కలసి పనిచేసేందుకు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

 

***


(Release ID: 2123642) Visitor Counter : 31