WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

దక్షిణ భారత చలనచిత్ర సంఘాలతో వర్చువల్ గా సమావేశమైన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్: వేవ్స్

2025లో చేరాలని సాంకేతిక నిపుణులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, దర్శకులకు విజ్ఞప్తి

ప్రధాని శ్రీ మోదీ దార్శనికత కింద మీడియా విభాగాలన్నింటిని ఏకం చేయడమే వేవ్స్ 2025 లక్ష్యం:

దక్షిణ భారతదేశం నుంచి బలమైన ప్రాతినిధ్యం కోసం కేంద్ర సహాయమంత్రి డాక్టర్ మురుగన్ పిలుపు

ప్రముఖ నిర్మాణ సంస్థలను భాగస్వామ్యం చేస్తూ వేవ్స్ లో దక్షిణ భారత సినీ పరిశ్రమకు ప్రత్యేకంగా పెవిలియన్ ఏర్పాటు అవసరమన్న డాక్టర్ మురుగన్

 Posted On: 02 APR 2025 6:47PM |   Location: PIB Hyderabad

తమిళనాడుకేరళకర్ణాటకతెలంగాణఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన చలనచిత్ర సంఘాల ప్రతినిధులతో కేంద్ర సమాచారప్రసారపార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈ రోజు వర్చువల్ సమావేశం నిర్వహించారుసమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజుసంయుక్త కార్యదర్శి (ఐపిశ్రీ సి సెంథిల్ రాజన్సంయుక్త కార్యదర్శి (చలనచిత్రాలుడాక్టర్ ఎం.ఎన్.అజయ్ నాగభూషణ్ ఈ సమావేశంలో  పాల్గొన్నారు.                                  

వేవ్స్ 2025 లో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ భాగస్వామ్యం

ఈ ఏడాది మే నుంచి వరకు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్పురోగతిపై సమావేశంలో కీలక చర్చలు జరిగాయిసాంకేతిక నిపుణులునిర్మాతలుదర్శకులునటీనటులతో సహా దక్షిణ భారత చిత్ర పరిశ్రమ నుంచి విస్తృత భాగస్వామ్యం అవసరమని సమావేశం అభిప్రాయపడిందిఅలాగేప్రముఖ నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో వేవ్స్ ప్రాంగణంలో ప్రత్యేక పెవిలియన్ లేదా బూత్ ఏర్పాటు చేయడంపై కూడా చర్చ జరిగింది.

సృజనాత్మకతలో భారత్ ను అంతర్జాతీయ నాయకత్వ స్థాయిలో నిలబెట్టాలి

ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా అన్ని మీడియా విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని వేవ్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు డాక్టర్ మురుగన్ తెలిపారుసృజనాత్మకత రంగంలో భారత్ ను అంతర్జాతీయ నాయకత్వ స్థాయిలో నిలబెట్టే దిశగా ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన పునరుద్ఘాటించారు.

వేవ్స్ 2025 గురించి

ప్రపంచ ఆడియో విజువల్,  ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్మొదటి సదస్సును మీడియావినోద రంగాలలో ఒక కొత్త అధ్యాయంగా భారత ప్రభుత్వం 2025 మే నుంచి  వరకు మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించనుంది.

ఈ చారిత్రాత్మక శిఖరాగ్ర సదస్సు ప్రపంచ నాయకులుమీడియా నిపుణులుకళాకారులువిధానకర్తలు,  పరిశ్రమ భాగస్వాములను ఏకతాటిపైకి తెస్తుందిప్రస్తుత డిజిటల్ యుగం సవాళ్లనుఅవకాశాలను కూడా అందిస్తోందిఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్స్ట్రీమింగ్ లో విప్లవాలుమేధో సంపత్తి హక్కులుతప్పుడు సమాచారంమీడియా సుస్థిరత ప్రధాన ఆందోళనలుగా ఉన్నాయిగతంలో ఎన్నడూలేని విధంగా ప్రప్రధమంగా జరుగుతున్న ఈ ప్రత్యేక వేవ్స్ శిఖరాగ్ర సదస్సు సాంస్కృతిక వైవిధ్యాన్నినవ్యతను ప్రోత్సహించడం ద్వారా మీడియా వేదికలన్నింటికి సమాన అవకాశాలను అందించి ఈ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తుందిఈ సదస్సు  డిజిటల్ యుగంలో దేశాలు-దేశాలుప్రజలు-ప్రజలుసంస్కృతులు-సంస్కృతుల మధ్య అతిపెద్ద ఐక్య కారకంగా మీడియావినోద పరిశ్రమ పాత్రను మరింత బలపర్చే కీలక అడుగుగా నిలుస్తుందిఐక్యతా శక్తిని ముందుంచుతూపంచుకోగలిగిన అంశాలుమానవజాతి ఎదుర్కొంటున్న సవాళ్లుఉమ్మడి అవకాశాలుసహకార వృద్ధి,  పురోగతిపై వేవ్స్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుందిఈ దృష్టికోణం వేవ్స్ ను  సౌహార్దత కోసం ఒక ప్రపంచ వేదికగా నిలబెడుతుందిసరిహద్దులను దాటి అర్థవంతమైన సంభాషణలకు,  కార్యాచరణకు దారితీసేలా చేస్తుంది.

వేవ్స్ 2025ను ముంబయిలో నిర్వహించడం ద్వారాఈ శిఖరాగ్ర సమావేశం ఆలోచనాపరులైన నాయకులకు ఒక వేదికను అందిస్తుందిశరవేగంగా మారుతున్న ప్రపంచంలో మీడియా రంగం ఐక్యతకు అతిపెద్ద ప్రేరణగా ఎలా వ్యవహరించగలదో వారు చర్చిస్తారుప్రజలుసంస్కృతులుదేశాల మధ్య అంతరాలను పూడ్చడానికిసాంస్కృతిక దౌత్యానికి ఈ రంగం శక్తిమంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

 

* * *


Release ID: (Release ID: 2118092)   |   Visitor Counter: 26