భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ

నాడు పోస్టు చేయడమైనది: 01 APR 2025 4:20PM by PIB Hyderabad

ఫేమ్ - II పథకం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల (ఈవీపీసీఎస్ఏర్పాటుకు రూ.839 కోట్లు కేటాయించారుపీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణపట్టణ ప్రాంత్రాల్లో ఈవీపీసీఎస్‌లను ఏర్పాటు చేసేందుకు రూ. 2,000 కోట్ల నిధులు కేటాయించారు.

విద్యుత్ వాహనాల ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాల ఏర్పాటునిర్వహణ మార్గదర్శకాలు - 2024ను గతేడాది సెప్టెంబర్ 17న విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిందిఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణలో పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం పాత్రను ఈ మార్గనిర్దేశకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయిఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటును లైసెన్స్ అవసరం లేని ప్రక్రియగా గుర్తించి వ్యాపారాన్ని సులభతరం చేశారు.

విద్యుత్ వాహనాలకు సంబంధించిన పరిశోధనఅభివృద్ధి (ఆర్ అండ్ డీ)ని దిగువ పేర్కొన్న విధానంలో ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది:

  1. ఇంజనీరింగ్ పరిశోధన-అభివృద్ధివస్తు రూపకల్పన-అభివృద్ధికి చేసే వ్యయాన్ని పీఎల్ఐ ఏసీసీ పథకం కింద అర్హత కలిగిన పెట్టుబడిగా గుర్తిస్తారు.

  2. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన యంత్ర పరికరాల పథకం ద్వారా ఈవీలకు సంబంధించిన వాటితో సహా పరిశోధనఅభివృద్ధి ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో 80 శాతం వరకు రాయితీ లభిస్తుందిఐఐటీలుఐఐఎస్‌సీలు లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారుమిగిలిన 20 శాతం మొత్తాన్ని ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యులుగా ఉన్న పరిశ్రమలు భరిస్తాయి.

లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని కేంద్ర ఉక్కుభారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ లిఖితపూర్వకంగా ఈ రోజు అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2117496) సందర్శకుల సూచీ సంఖ్య : : 63
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी