పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వివాహ పర్యాటకం

Posted On: 24 MAR 2025 4:05PM by PIB Hyderabad

పెళ్లిళ్లు చేసుకోదలచిన వారికి కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తూ పర్యాటక స్థలాలను తీర్చిదిద్దడం సహా.. పర్యాటక స్థలాలనుతత్సంబంధిత ఉత్పాదనలను అభివృద్ధి పరచడానికీప్రోత్సహించడానికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్రపాలిత ప్రాంత పాలనాయంత్రాంగాలు చర్యలు తీసుకొంటున్నాయిభారత్‌లో వెడ్డింగ్ టూరిజం సహా వేర్వేరు పర్యాటక సంబంధ ఉత్పాదనలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్రపాలిత ప్రాంత పాలనా యంత్రాంగాలు చేస్తున్న ప్రయత్నాలకు తోడు పర్యాటక మంత్రిత్వ శాఖ కూడా తన వంతు కార్యక్రమాలను చేపడుతోంది.

‘‘ఇండియా సేస్ ఐ డూ’’ పేరిట ఒక ప్రచార కార్యక్రమాన్ని పర్యాటక శాఖ ప్రారంభించిందిప్రపంచ వేదికపై భారత్‌ను ఒక ప్రతిష్ఠాత్మక పెళ్లిళ్ల ప్రధాన కేంద్రంగా నిలపాలనేదే ఈ ప్రచార కార్యక్రమం ఉద్దేశండిజిటల్ మాధ్యమంలో మార్కెటింగ్ నిర్వహణవెబ్‌సైట్సామాజిక మాధ్యమాల ఆధారిత ప్రచారంవిశేష ప్రభావాన్ని కలిగించగల ప్రముఖుల సేవలుఆన్‌లైన్‌ యాక్టివేషన్ల ద్వారా ముందుకు దూసుకుపోవాలనేదే ఈ ప్రచార ఉద్యమం ధ్యేయం.    

పర్యాటక మంత్రిత్వ శాఖ.. రాజస్థాన్ ప్రభుత్వ పర్యాటక విభాగంభారత వాణిజ్యపారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫిక్కీసహకారంతో 2024 మే 5న జైపూర్‌లో గ్రేట్ ఇండియా ట్రావెల్ బజార్‌తోపాటే ‘వెడ్ ఇన్ ఇండియా’ ఎక్స్‌పోను కూడా నిర్వహించిందిఈ కార్యక్రమంలో భారత్‌తోపాటు విదేశాల వెడింగ్ ప్లానర్లురాష్ట్ర ప్రభుత్వాలుప్రసార మాధ్యమాలుదేశీయ టూర్ ఆపరేటర్లుఅంతర్జాతీయ టూర్ ఆపరేటర్లుఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు పాల్గొన్నాయి.

పెళ్లిళ్ల నమోదు ప్రక్రియను వేర్వేరు రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల స్థానిక పాలనా యంత్రాంగాలు నిర్వహిస్తాయి.

ఈ సమాచారాన్ని కేంద్ర పర్యాటకసాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ రోజు లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.   

 

***


(Release ID: 2114474) Visitor Counter : 34


Read this release in: English , Urdu , Hindi , Tamil