బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు, లిగ్నైట్ ప్రభుత్వం రంగ సంస్థల ద్వారా గని జలం నిర్వహణ

Posted On: 24 MAR 2025 1:03PM by PIB Hyderabad

గనుల్లో వచ్చే నీటిని వ్యయసాయానికి ఉపయోగించేందుకుబొగ్గులిగ్నైట్ ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలుఅయిన కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్ సీఐల్), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్చర్యలు తీసుకున్నాయి.  నీటిని సాగుగృహ వినియోగాలతో సహా పారిశ్రామికసామాజిక అవసరాల నిమిత్తం ఉపయోగిస్తున్నారుతద్వారా ఈ తరహా అవసరాలకు భూగర్భ జల వినియోగాన్ని తగ్గిస్తున్నారుఈ నీరు సాగుగృహ వినియోగ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్దారించేందుకు గుర్తింపు పొందిన ప్రయోగశాలల ద్వారా క్రమం తప్పకుండా నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నారుగని జలాన్ని ఉపయోగించుకోవడంతో సహా భూగర్భ నీటిని పరిరక్షించేందుకు వర్షపు నీటిని నిల్వ చేయడం తదితర చర్యలు అమలు చేస్తున్నారుఆర్థిక సంవత్సరం 2024-25 (ఫిబ్రవరి, 2025 వరకునాటికి బొగ్గులిగ్నైట్ పీఎస్‌యూలు సుమారుగా 3963 లక్షల కిలో లీటర్ల (ఎల్‌కేఎల్గనిజలాన్ని శుద్ధి చేశాయిఈ నీటిని గృహసాగు అవసరాల కోసం బొగ్గులిగ్నైట్ గనుల పరిసర ప్రాంతాల్లోని స్థానిక సమూహాలకు సరఫరా చేశాయి.

గనిజలాన్ని శుద్ధి చేసే మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులను కోల్లిగ్నైట్ పీఎస్‌యూలు మైనింగ్ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా అందిస్తున్నాయిపర్యావరణమైనింగ్ ప్రాజెక్టుల ఏర్పాటునిర్వహణ అనుమతుల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం గనుల కార్యకలాపాల్లో నీటి శుద్ధి మౌలిక సదుపాయాలు అంతర్భాగంగా ఉన్నాయిదీనిలో పారిశ్రామిక వ్యర్థాలను శుభ్రం చేసేందుకు మురుగునీటి శుద్ధి కేంద్రాలునాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా గనిజలాన్ని శుద్ధి చేసేందుకు వడపోత కేంద్రాలువ్యర్థాల వడపోతకు అవక్షేప ట్యాంకులుఇప్పటికే ఉన్న నీటి శుద్ధి మౌలిక సదుపాయాల నిర్వహణఆధునికీకరణతో పాటుగా వాటి సామర్థ్యాన్ని విస్తరించడం తదితరమైనవి భాగమే.

భానేగావ్ ఓపెన్ కాస్ట్ గనుల నుంచి కాపాఖేడా థర్మల్ విద్యుత్ కేంద్రం వరకు శుద్ధి చేసిన గనుల నీటిని సరఫరా చేసేందుకు వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్), మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య అవాగాహన ఒప్పందం కుదిరిందితద్వారా గతంలో నీటిపారుదల విభాగం నుంచి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఉపయోగించే నీటిని ఇప్పుడు గృహసాగు అవసరాలకోసం వినియోగిస్తున్నారు.

రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా అందించారు.

 

***


(Release ID: 2114411) Visitor Counter : 35


Read this release in: English , Urdu , Hindi , Tamil