ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్‌ తో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


* భారతదేశంలో మతపరమైన ఆచారాలు నిత్య జీవితంతో పెనవేసుకుని ఉంటాయన్న ప్రధాని

*ఉపవాసం ఆలోచనల పదును పెంచి, కొత్త దృక్పథాలను, విలక్షణమైన యోచనలను ప్రేరేపిస్తుందన్న ప్రధానమంత్రి

* సవాళ్ళు జీవితంలో భాగమైనప్పటికీ లక్ష్యాన్ని ప్రభావితం చేయరాదు: ప్రధానమంత్రి

* అనేకమంది స్వాతంత్ర్య సమర యోధుల పోరు గట్టి ప్రభావాన్ని చూపినప్పటికీ, సత్యం ఆధారంగా మహాత్మాగాంధీ చేపట్టిన మహోద్యమం దేశాన్ని జాగృతం చేసింది: ప్రధాని

* సఫాయీ కార్మికులు, ఉపాధ్యాయులు, నేత పనివారు, ఆరోగ్య కార్యకర్తలు సహా ప్రతి ఒక్కరినీ స్వాతంత్ర్య పోరులో భాగమయ్యేలా చేసిన గాంధీజీ నాయకత్వ తీరు అసామాన్యమైనది: ప్రధానమంత్రి

* నేను ప్రపంచ నేతలతో కరచాలనం చేసినప్పుడు, ఆ చేయి కలుపుతున్నది మోదీ కాదు, 140 కోట్ల భారతీయులన్నది గుర్తెరగాలి : ప్రధాని

* మేం శాంతి గురించి మాట్లాడితే, ప్రపంచం శ్రద్ధగా ఆలకిస్తుంది.. మా ఘన సంస్కృతి, చరిత్రలే అందుకు కారణం: ప్రధానమంత్రి

* విభిన్న నేపథ్యాలు, ప్రాంతాల ప్రజలను ఏకం చేసే సామర్థ్యం క్రీడల సొంతం: శ్రీ మోదీ

* ప్రపంచ శాంతి సుస్థిరతల కోసం భారత్, చైనాల మధ్య సహకారం అత్యవసరం: ప్రధాని

* కృత్రిమ మేధ

Posted On: 16 MAR 2025 10:03PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారుఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారునిరాహారంగా ఉండటం  ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్‌మాన్‌ ప్రశ్నకు సమాధానమిస్తూతన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్‌మాన్‌ కూడా  ఉపవాసాన్ని  చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి..” అని తెలియజేస్తూహిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదనిదేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారుఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందనిమనస్సుశరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.  
ఉపవాస సమయంలో ఇంద్రియాలన్నీ చురుకుగా మారతాయనిదాంతో పరిసరాల పట్ల  అవగాహన పెరుగుతుందని చెబుతూఆ సమయంలో సున్నితమైన వాసనలను కూడా స్పష్టంగా తెలుసుకోగలుగుతామని  చెప్పారు.  ఉపవాసం ఆలోచనల పదును పెంచికొత్త దృక్పథాలనువిలక్షణమైన యోచనలను ప్రేరేపిస్తుందని చెప్పారుఉపవాసం అంటే కేవలం ఆహారానికి దూరంగా ఉండటమే కాదనిశాస్త్రీయ విధానమనీశరీరంలోని విషాలను బయటకు పంపే ప్రక్రియ అని చెప్పారుఉపవాసం చేపట్టే కొద్దిరోజుల ముందు నిర్దిష్టమైన ఆయుర్వేదయోగా పద్ధతులను పాటించడం ద్వారా తన శరీరాన్ని సిద్ధం చేసుకుంటాననిఆ సమయంలో నీరు అధికంగా తాగడం ద్వారా శరీరంలో తగినంత నీరు ఉండేలా జాగ్రత్త తీసుకుంటానని శ్రీ మోదీ వెల్లడించారుతదనంతరం మొదలుపెట్టే ఉపవాసాన్ని భక్తిక్రమశిక్షణలకు అంకితమయ్యే సమయంగా భావిస్తాననిలోతైన చింతనకుసంపూర్ణమైన దృష్టి కేంద్రీకరణకు వెచ్చిస్తానని చెప్పారుతాను పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయంలో జరిగిన ఒక సంఘటన వల్లమహాత్మా గాంధీ ఉద్యమం వల్ల ఉపవాసాలను అలవాటు చేసుకున్నానని శ్రీ మోదీ వెల్లడించారుతొలిసారి ఉపవాసం చేసినప్పుడు శక్తిఅవగాహనలు పెరిగిన భావన కలిగిందనిదాంతో ఈ ప్రక్రియ వల్ల పరివార్తనాత్మక శక్తి అనుభవంలోకి వచ్చిందని చెప్పారుఉపవాసం తనని మందకొడిగా చేసే బదులు తనలో వేగాన్నిచురుకునీసామర్థ్యాన్ని పెంచుతుందన్నారుదీక్ష సమయంలో తన ఆలోచనలు వేగంగా సాగుతాయని చెబుతూ ఉపవాసాన్ని మెరుగైన సృజన ద్వారా తన భావనలను పంచుకునే దివ్యమైన అవకాశంగా భావిస్తానని ప్రధాని అన్నారు.  

ఉపవాసాలుకొన్నిసార్లు తొమ్మిది రోజుల పాటు కొనసాగే దీర్ఘ ఉపవాసాలతో ప్రపంచ వేదికపై నాయకుడిగా తన పాత్రను ఎలా నిర్వర్తించగలుగుతారని అడిగినప్పుడుశ్రీ మోదీ ప్రాచీన భారతీయ సంప్రదాయమైన చాతుర్మాస దీక్ష  గురించి ప్రస్తావించారువర్షాకాలంలో జీర్ణక్రియ సహజంగానే మందగిస్తుందనిఆ సమయంలో చాలా మంది భారతీయులు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసే విధానాన్ని అనుసరిస్తారని వ్యాఖ్యానించారుఈ సంప్రదాయం జూన్ మధ్యలో ప్రారంభమై నవంబర్‌లో దీపావళి తర్వాత వరకూ – అంటేదాదాపు  నాలుగు నుండి నాలుగున్నర నెలల వరకు కొనసాగుతుందని చెప్పారుసెప్టెంబర్ లేదా అక్టోబరులో నిర్వహించే దసరా పండుగ సమయంలోశక్తి, భక్తి క్రమశిక్షణకు మారుపేరైన నవరాత్రి పర్వదినాల తొమ్మిది  రోజుల పాటూ తాను ఎటువంటి ఆహారాన్ని స్వీకరించనని,  కేవలం వేడి నీటిని మాత్రమే తాగుతానని చెప్పారుఇక మార్చిఏప్రిల్ మాసాల్లోని చైత్ర నవరాత్రిళ్ళలో రోజుకో పండుని మాత్రమే భుజించే విలక్షణమైన ఉపవాసాన్ని పాటిస్తానని చెప్పారుఉదాహరణకుబొప్పాయిని ఎంచుకుంటేమొత్తం ఉపవాస కాలంలో బొప్పాయి మాత్రమే తింటానని చెప్పారుఈ ఉపవాస పద్ధతులు తన జీవితంలో అంతర్భాగమయ్యాయని, 50 - 55 సంవత్సరాలుగా వీటిని అనుసరిస్తున్నానని శ్రీ మోదీ తెలియజేశారు.

తన ఉపవాస పద్ధతుల గురించి మొదట్లో ఎవరికీ పెద్దగా తెలిసేది కాదనితాను ముఖ్యమంత్రిప్రధానమంత్రి పదవులను స్వీకరించిన తరువాత వీటి గురించి ఇతరులకు తెలియడం మొదలయ్యిందని వ్యాఖ్యానించారుతాను పాటించే పద్ధతులు ఇతరులకు ప్రయోజనకరంగా ఉండవచ్చు కాబట్టిఇతరుల శ్రేయస్సు కోసం పనిచేయాలన్న తన ఆశయనికి అనుగుణంగా ఉంది కాబట్టి తన అనుభవాలను గురించి పంచుకోవడంలో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రధాని పేర్కొన్నారుఉపవాస దీక్ష చేస్తున్న సమయంలోఅమెరికా మాజీ అధ్యక్షుడు శ్రీ బరాక్ ఒబామాతో వైట్ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా జరిగిన ఒక ఉదాహరణను శ్రీ మోదీ పంచుకున్నారు.

జీవితపు తొలి రోజుల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూఉత్తర గుజరాత్మెహసానా జిల్లా వడ్ నగర్ లో తాను జన్మించాననిఆ ప్రాంతపు చారిత్రక ప్రాముఖ్యం గురించి వివరించారువడ్ నగర్ చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ వంటి వారిని ఆకర్షించిన బౌద్ధ క్షేత్రమని, 1400 కాలంలో ప్రముఖ బౌద్ధ విద్యాకేంద్రంగా విలసిల్లిందని చెప్పారుతన బాల్యంలో వడ్ నగర్లో బౌద్ధజైనహిందూ సంస్కృతులు ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా మనుగడ సాగించాయని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారుతన ఊరి చరిత్ర పుస్తకాలకు పరిమితమవలేదనివడ్ నగర్లోని ప్రతి గోడప్రతి రాయీ ఒక కథ చెప్పేదని నెమరువేసుకున్నారుతాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పురావస్తు తవ్వకాలను పెద్దయెత్తున ప్రోత్సహించాననినగరం మనుగడ కొనసాగించింది అనేందుకు గుర్తుగా 2,800 సంవత్సరాల నాటి చారిత్రక ఆధారాలు ఆ తవ్వకాలలో బయటపడ్డాయని చెప్పారుఈ ఆధారాల వల్ల తదనంతరం అక్కడ అంతర్జాతీయ-స్థాయి మ్యూజియం ఏర్పాటయ్యిందనిముఖ్యంగా పురావస్తు విభాగానికి చెందిన విద్యార్థులకు ఈ కేంద్రం ఎంతో ఉపయుక్తంగా ఉందని చెప్పారుఘనమైన చారిత్రక ప్రాముఖ్యమున్న ప్రాంతంలో పుట్టడం తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారుకిటికీలు కూడా లేని చిన్న ఇంట్లో తమ నిరుపేద కుటుంబం నివసించేదనిఅయితే ఇతరులతో పోల్చుకునే అవకాశం లేకపోవడంతో పేదరికం ఎన్నడూ బాధించలేదని బాల్యపు జ్ఞాపకాలను పంచుకున్నారుతమ తండ్రి క్రమశిక్షణ కల్గిన కష్టజీవిగాసమయపాలన పాటించేవారిగా గుర్తింపు పొందారని చెప్పారుతన తల్లి ఎంతో శ్రమించేదనిఇతరుల పట్ల ఎంతో ప్రేమ కనపరచేదనిఇతరుల పట్ల సానుభూతిసేవాభావాన్ని తల్లి వద్ద నుంచే నేర్చుకున్నానని చెప్పారురోజూ ఉదయాన్నే పిల్లలందరినీ ఒక చోటికి చేర్చి వారికి సాంప్రదాయికంగా వస్తున్న చిట్కాలతో చికిత్స చేసేదనిఈ అనుభవాలన్నీ తనకు విలువలని తెలియజెప్పాయనితన వ్యక్తిత్వాన్ని మలచాయని చెప్పారురాజకీయ ప్రవేశం తన నిరుపేద మూలాలను వెలుగులోకి తెచ్చిందనితాను ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేస్తున్న సమయంలో జరిగిన  మీడియా కవరేజీ ప్రజలకు తన నేపథ్యాన్ని పరిచయం చేసిందని చెప్పారుతన జీవితానుభవాలను అదృష్టకరమనుకున్నాదురదృష్టకరమైనదనుకున్నాఅవి బహిర్గతమై ప్రజలకు తన గురించి తెలియజేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

యువతకు ఇచ్చే సందేశం గురించిన ప్రశ్నకు సమాధానమిస్తూయువత ఓపికఆత్మవిశ్వాసంతో ఉండాలనిసవాళ్ళు జీవితంలో భాగమైనప్పటికీ అవి వ్యక్తి లక్ష్యాన్ని ప్రభావితం చేయరాదని చెప్పారుకష్టాలు సహనానికి పరీక్షలనిఅవి మనిషిని ఓడించడానికి కాకబలోపేతం చేయడం కోసం ఎదురావుతాయని అంటూ ప్రతి సంక్షోభం అభివృద్ధికి అవకాశాన్ని అందిస్తుందని అన్నారుజీవితంలో దగ్గరి దోవలు పనిచేయవని చెబుతూ రైల్వేట్రాక్‌ల ఉదాహరణతో విపులీకరించారుపట్టాలు దాటవద్దంటూ రైల్వే స్టేషన్లలో కనపడే హెచ్చరికలను ఉటంకిస్తూ, "షార్ట్‌కట్స్ విల్ కట్ యూ షార్ట్" – షార్ట్ కట్లు మిమ్మల్ని అర్థాంతరంగా ఆపేస్తాయి అని వివరించారువిజయం సాధించడంలో సహనంపట్టుదల ప్రాముఖ్యాన్ని  గురించి చెబుతూ  ప్రతి బాధ్యతనూ మనఃస్ఫూర్తిగా చేపట్టాలనిప్రయాణాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని అభిరుచితో గడపాలని ఉద్బోధించారుసమృద్ధి మాత్రమే విజయానికి హామీ ఇవ్వదనివనరులు ఉన్నవారు కూడా ప్రతిరోజూ ఎదుగుతూసమాజ సంక్షేమానికి దోహదపడాలి కాబట్టివ్యక్తిగత ఎదుగుదల జీవితాంతం అవసరమనినేర్చుకోవడం ఎప్పటికీ ఆపరాదని చెప్పారుతన తండ్రి టీ దుకాణంలో పని చేసేటప్పుడు ఇతరులతో మసలే పద్ధతిని నేర్చుకున్నాననినిరంతర అభ్యాసంవ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడం ఎంత కీలకమో అర్ధం చేసుకున్నానని చెప్పారుచాలా మంది ప్రజలు పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకునిఅవి విఫలమైనప్పుడు నిరాశకు గురవుతారని అంటూఏదో ఒక గుర్తింపు కోసం పాకులాడకుండా ఏదైనా పనిని గొప్పగా చేయడంపైనే  దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారుఇటువంటి దృక్కోణం నిరంతర సాధనలక్ష్యాల వైపు పురోగమించడంలో సహాయపడుతుందన్నారుమనకు దక్కేదానికన్నా ఇతరులకు ఇవ్వడంలోనే సిసలైన తృప్తి ఉంటుందనియువత పరులకు సహాయంసేవలపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు.

ఆయనను హిమాలయాలకు వెళ్లడాన్ని గురించి అడిగినప్పుడుశ్రీ మోదీ ఒక చిన్న పట్టణంలో తాను పెరిగిన సంగతిని తెలిపారుఅక్కడ సమష్టి జీవనానికి పెద్దపీట వేశారన్నారుతాను తరచు స్థానిక గ్రంథాలయానికి వెళ్లేవాడిననిస్వామి వివేకానందఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి వారిని గురించి పుస్తకాలలో చదివి ప్రేరణను పొందేవాడినన్నారు.  ఇది తన జీవనాన్ని కూడా అదే ప్రకారంగా మలచుకోవాలన్న అభిలాషను కలిగించిందనీతాను తన శారీరక పరిమితులుమనోనిబ్బరం ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఆరుబయట చల్లని వాతావరణంలో పడుకునేవాడిననీ చెప్పారుస్వామి వివేకానంద బోధనలు తనపై కలగజేసిన ప్రభావాన్ని ఆయన వివరించారుఅనారోగ్యం పాలబడ్డ తన తల్లికి సహాయం చేయాల్సిన అవసరం వివేకానందకు ఉన్నప్పటికీ ధ్యాన సమయంలో కాళీమాతను ఏమయినా అడగడానికీ నోరు కదపలేక పోయిన అనుభవాన్ని గురించి శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారుఈ అనుభూతే తరువాత తరువాత వివేకానందునిలో ఎదుటి వారికి ఇవ్వాలన్న భావనకు అంకురార్పణ చేసిందిఈ ఘట్టం తనను ప్రభావితుడిని చేసిందని శ్రీ మోదీ అన్నారుసిసలైన సంతృప్తి అనేది ఇవ్వడం నుంచిఇతరులకు సేవ చేయడం నుంచే కలుగుతుందని స్పష్టం చేశారుకుటుంబంలో పెళ్లి జరిగిన వేళతాను ఒక సాధువు బాగోగులు చూసుకోవడానికి వెనుకపట్టునే ఉండిపోవాలని నిర్ణయించుకొన్న సందర్భాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకొన్నారుఈ ఘటన ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల మొదట్లో తాను ఎలా మొగ్గిందీ చెబుతోందిసైనికులు తన ఊరికి రావడం చూసినప్పుడు దేశానికి సేవ చేయాలన్న ప్రేరణ తనలో కలిగిందనిఅయితే ఆ సమయంలో అందుకు ఏం చేయాలో తనకు స్పష్టంగా తెలియలేదన్నారుజీవనానికి అర్థం ఏమిటో కనుక్కోవాలన్న ప్రగాఢ కోర్కె తనకు కలిగిదీనిని అన్వేషించడానికి తాను... యాత్రను మొదలుపెట్టానని ప్రధాని చెప్పారుస్వామి ఆత్మస్థానందజీ వంటి సాధువులతో సాన్నిహిత్యాన్ని ఏర్పరుచుకోవడాన్నిఆ స్వామీజీయే సమాజ సేవ ప్రాముఖ్యాన్ని గురించి తనకు చెప్పిమార్గదర్శనం చేశారన్నారుమిషన్‌లో తాను గడిపిన కాలంలోప్రముఖ సాధువులతో భేటీ అయినట్లువారు వారి ప్రేమనుఆశీస్సులను తనపై కురిపించినట్లు శ్రీ మోదీ చెప్పారుహిమాలయాలలో ఉండగా లభించిన ఏకాంతంతాపసులతో తాను మాట్లాడడం.. ఇవి తనను తాను తీర్చిదిద్దుకోవడానికితన అంతర్గత శక్తిని తాను గుర్తించడానికి తోడ్పడ్డాయని శ్రీ మోదీ అన్నారువ్యక్తిగతంగా తాను ఎదగడంలో ధ్యానంసేవభక్తి.. వీటి పాత్ర ఎంతో ఉందన్నారు.

రామకృష్ణ మిషన్‌లో స్వామి ఆత్మస్థానందజీతో తనకు ఎదురైన అనుభవాన్ని శ్రీ మోదీ పంచుకొంటూదీని కారణంగానే తాను ప్రతి స్థాయిలో సేవే ప్రధానమైన జీవనాన్ని గడపాలని నిర్ణయించుకొన్నానన్నారుఇతరులు తననను ప్రధానిగానోలేదా ముఖ్యమంత్రిగానో చూస్తే చూడవచ్చు కానీ తాను ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానన్నారుతన అంతర్గత స్థిరత్వం ఇతరులకు సేవ చేయడంలో ఇమిడి ఉందనిఅది పిల్లలను సంరక్షించడంలో మాతృమూర్తికి సాయపడే రూపంలో కావచ్చులేదా హిమాలయాల్లో సంచరించడం కావచ్చులేదా తన ప్రస్తుత బాధ్యతాయుత పదవిలో పనిచేయడం కావచ్చు.. వీటి అన్నింటిలోనూ అది ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ అన్నారుతన దృష్టిలోఒక సాధువుకు ఒక నేతకు మధ్య ఎలాంటి వాస్తవమైన వ్యత్యాసం లేదనిఎందుకంటే ఈ రెండు పాత్రలకు సమానమైన విలువల మార్గదర్శనం లభిస్తుందన్నారుదుస్తులుచేసే పని వంటి బయటకు కనిపించే దృష్టికోణాలు మారితే మారవచ్చు గాని సేవ చేయాలన్న అంకితభావం మాత్రం మారదని ఆయన స్పష్టం చేశారుప్రతి బాధ్యతను తాను శాంతంగాఏకాగ్రతతోఅంకితభావంతో నెరవేరుస్తానని ఆయన చెప్పారు.

తొలి రోజుల్లో తనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్చూపిన ప్రభావాన్ని చర్చిస్తూదేశభక్తిపూరిత గేయాలంటే తనకు చిన్నప్పటి నుంచీ ఎంతో మక్కువ ఉండేదనిముఖ్యంగా మకోషి అనే అతను ఒక డప్పు తీసుకుని తమ ఊరికి వచ్చి పాడే పాటలు తనకు బాగా నచ్చేవన్నారుఆ పాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయనిఅవే తరువాత తరువాత ఆర్ఎస్ఎస్‌తో తాను అనుబంధాన్ని ఏర్పరుచుకోవడంలో అవి ప్రభావాన్ని చూపించాయని ఆయన అన్నారుఏ పనిని అయినా సరే.. అది చదువుకోవడంలేదా వ్యాయామం చేయడంలేదా దేశం కోసం పాటుపడడం.. ఇలా ఏదయినాఒక ప్రయోజనం ఉండే పని చేయాలనే కీలక విలువల్ని తనలో పాదుగొల్పింది ఆర్ఎస్ఎస్ అని ఆయన వివరించారుజీవనంలో ఒక పరమార్థంతో ముందుకు సాగడానికి ఆర్ఎస్ఎస్ ఒక స్పష్టమైన దిశను అందిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుప్రజలకు సేవ చేయడం అంటే అది దైవానికి సేవ చేయడంతో సమానం అని ఆయన స్పష్టం చేశారుఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవానికి చేరువ అవుతోందనిప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ స్వయంసేవకులున్న భారీ సంస్థ అని ఆయన తెలిపారు.  ఆర్ఎస్ఎస్ ప్రేరణగా నిలవడంతోఅనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.. ఉదాహరణకు సేవా భారతి మురికివాడల్లో, 1,25,000కు పైచిలుకు సేవాపథకాలను ప్రభుత్వ సహాయం లేకుండానే నడుపుతోందని శ్రీ మోదీ వెల్లడించారు. వన్‌వాసీ కల్యాణ్ ఆశ్రమ్ గిరిజన ప్రాంతాల్లో 70,000కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలను ఏర్పాటు చేసిందని కూడా శ్రీ మోదీ చెప్పారువిద్యాభారతి సుమారు 25,000 పాఠశాలలను నిర్వహిస్తూ 30 లక్షలమంది విద్యార్థులకు చదువు చెబుతోందని తెలిపారువిద్యకువిలువలకు ఆర్ఎస్ఎస్ పెద్దపీట వేస్తుందనివిద్యార్థులు నేల విడచి సాముచేయకుండాసమాజానికో గుదిబండలా మారకుండా ఉండటానికి నైపుణ్యాలను నేర్చుకొనేటట్లు శ్రద్ధ తీసుకొంటుందని ఆయన స్పష్టం చేశారుదేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో సభ్యులు ఉన్న భారతీయ మజ్దూర్ సంఘ్ సాంప్రదాయక కార్మిక ఉద్యమాలకు భిన్నంగా ‘‘కార్మికులు ప్రపంచాన్ని ఏకం చేయాల’’నే విషయంపై దృష్టిని సారించిఒక విశిష్ట దృక్పథాన్ని అవలంబిస్తోందని ఆయన అన్నారుఆర్ఎస్ఎస్ నుంచి తాను పొందిన జీవన విలువలుప్రయోజనాలతోపాటు స్వామి ఆత్మస్థానంద వంటి సాధువుల నుంచి అందుకొన్న ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికిగాను ప్రధాని తన కృతజ్ఞత‌లను తెలియజేశారు

భారత్ గురించి శ్రీ మోదీ మాట్లాడుతూ భారత్‌కంటూ ఒక సాంస్కృతిక గుర్తింపు ఉందనిభారత్ నాగరికత వేల సంవత్సరాల నాటిదన్నారువందకు పైగా భాషలువేల కొద్దీ మాండలికాలతో విలసిల్లుతున్న భారత్ సువిశాలత్వాన్ని ఆయన ప్రధానంగా చాటిచెబుతూప్రతి ఇరవై మైళ్లకు భాషఆచారాలువంట పద్ధతులువస్త్రధారణ మారిపోతూ ఉంటాయనిఇంతటి వైవిధ్యం నెలకొన్నప్పటికీ ఈ దేశాన్ని ఒక ఉమ్మడి బంధం కలిపి ఉంచుతోందన్నారుభగవాన్ రాముని కథలు భారత్ నలుమూలల ప్రతిధ్వనిస్తుంటాయిభగవాన్ రాముని ప్రేరణతో ప్రతి ప్రాంతంలోనూ వ్యక్తులకు పేర్లు పెట్టుకోవడాన్ని గమనించవచ్చన్నారుగుజరాత్‌లో రాంభాయి అని ఉంటేతమిళ నాడులో రామచంద్రన్ అనిమహారాష్ట్రలో రాం భావూ అనే పేరు చలామణిలో ఉంటాయని వివరించారుఈ అద్వితీయ సాంస్కృతిక బంధమే ఇండియాను ఒకే నాగరికతగా పెనవేస్తోందని ఆయన అభివర్ణించారుస్నానమాచరించే సమయంలోదేశంలో అన్ని నదుల పేర్లను స్మరించుకొనే ఆచారమంటూ ఉందనిప్రజలు ఆ వేళ గంగయమునగోదావరిసరస్వతినర్మదసింధుకావేరీ అంటూ నదుల నామాలను ఉచ్చరిస్తారన్నారుభారతీయ సంప్రదాయాల్లో ఈ ఏకత్వ భావన లోతుగా పాతుకుపోయిందనిముఖ్య కార్యక్రమాలుఅనుష్ఠానాలలో చెప్పుకొనే సంకల్పాలలో ఈ భావన ప్రతిబింబిస్తూ ఉంటుందని ఆయన అన్నారువీటిని చారిత్రక రికార్డుల్లా కూడా భావించవచ్చన్నారుజంబూద్వీపం మొదలు కులదేవత పేరు చెప్పుకొనేదాకా కార్యక్రమాలలో విశ్వమంతటికీ ఆహ్వానం పలికే సంప్రదాయాలకు భారతీయ ధార్మిక గ్రంథాలు అత్యంత సావధానపూర్వకంగా మార్గదర్శనం వహిస్తూ వచ్చాయనిఈ ఆచారాలు సజీవంగా నిలిచి నేటీకీ వీటిని దేశంలో నిత్యం ఆచరిస్తున్నాన్నారుపశ్చిమప్రపంచ నమూనాలు దేశాలను పరిపాలన వ్యవస్థలుగానే చూస్తుంటేభారత్‌లో ఏకత్వం దాని సాంస్కృతిక బంధాలలో ఒక దండగా రూపుదాల్చిందన్నారుభారత్‌లో చరిత్ర పొడవునా విభిన్న పాలక వ్యవస్థలంటూ మనుగడ సాగించాయనికానీ దీని ఏకత్వం సాంస్కృతిక సంప్రదాయాల మాధ్యమం ద్వారా చెక్కుచెదరకుండా ఉందన్నారుభారతదేశం ఏకత్వాన్ని నిలబెట్టడంలో తీర్థయాత్ర సంప్రదాయాలు పోషించిన పాత్ర ఎంతో ఉందని కూడా శ్రీ మోదీ స్పష్టం చేశారుశంకరాచార్యులు నాలుగు తీర్థ స్థలాలను నెలకొల్పారని ప్రధాని పేర్కొన్నారునేటికీ లక్షల మంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నారు. రామేశ్వరం నుంచి కాశీకికాశీ నుంచి రామేశ్వరానికి జలాన్ని తీసుకువస్తుంటారని తెలిపారుభారతదేశ క్యాలెండర్‌ను చూస్తే చాలు... దేశంలో విభిన్న సంప్రదాయాలు ఎంత సమృద్ధంగా ఉన్నదీ తెలిసిపోతుందని ఆయన అన్నారు.    

గాంధీ మహాత్ముని వారసత్వంస్వాతంత్ర్యం కోసం భారత్ పోరాడిన తీరును ప్రధానమంత్రి చర్చిస్తూమహాత్మాగాంధీ మాదిరిగాతాను గుజరాత్‌లో పుట్టాననితన మాతృభాష కూడా గుజరాతీయేనని వివరించారుగాంధీకి ఒక న్యాయవాదిగా విదేశాల్లో అవకాశాలకు కొదవ లేకపోయినప్పటికీకర్తవ్య పరాయణత్వంకుటుంబ విలువల పట్ల మక్కువ.. ఇవి ఆయనకు మార్గదర్శనం చేయగా ఆయన తన జీవనాన్ని భారతదేశ ప్రజలకు సేవ చేయడానికే అంకితం చేయాలని సంకల్పించుకొన్నారని శ్రీ మోదీ అన్నారుగాంధీ సిద్ధాంతాలుచేతలు ఈ నాటికీ భారత్‌లో ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారుస్వచ్ఛత ముఖ్యమని గాంధీ చెబుతూ వచ్చారు... ఆయన దీనిని స్వయంగా ఆచరించి చూపెట్టారు. అంతేకాదు ఆయన పాల్గొన్న చర్చలలో కూడా స్వచ్ఛతకు ప్రాధాన్యాన్ని ఇచ్చారని శ్రీ మోదీ అన్నారుభారత్ స్వాతంత్ర్యాన్ని సాధించుకోవడం కోసం దీర్ఘకాలం పోరాడిందనిఆ కాలంలో వలసవాద పాలన వందల సంవత్సరాల తరబడి కొనసాగినా స్వాతంత్ర్య జ్వాల దేశవ్యాప్తంగా ఉజ్వలంగా మండుతూ వచ్చిందన్నారులక్షల కొద్దీ జనం వారి ప్రాణాలను త్యాగం చేశారుజైళ్లలో మగ్గారుఅమరత్వాన్ని పొందారనీ శ్రీ మోదీ గుర్తు చేశారుఅనేక మంది స్వాతంత్ర్యయోధులు శాశ్వత ప్రభావాన్ని కలగజేసినామహాత్మాగాంధీ సత్యంపై ఆధారపడ్డ ఒక భారీ జనాందోళనకు సారథ్యం వహించి జాతిని మేల్కొలిపారని శ్రీ మోదీ చెప్పారుప్రతి ఒక్క వ్యక్తినీ స్వాతంత్స్య సమరంలో పాలుపంచుకొనేటట్లు చేయగలిగిన దక్షత గాంధీలో ఉంది.. వీధిని ఊడ్చి శుభ్రపరిచే పారిశుధ్య కార్మికులు మొదలు ఉపాధ్యాయులునేతకారులుసంరక్షకులు.. ఇలా ప్రతి సాధారణ పౌరులను స్వాతంత్ర్య సాధన కోసం సైనికులుగా గాంధీ మార్చివేశారుఅలా ఒక ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్మించారుబ్రిటిషు వారు దీనిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోయారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుదండి సత్యాగ్రహానికున్న ప్రాధాన్యం ఎంతటిదో.. ఒక చిటికెడు ఉప్పు ఎలా మహోద్ధృత విప్లవ జ్వాలను రగిలించివేసిందో ఆయన వివరించారుకొల్లాయి కట్టుకొని రౌండ్‌టేబుల్ సమావేశానికి గాంధీ వెళ్లి బకింగ్‌హామ్ రాజమహలులో కింగ్ జార్జ్‌తో భేటీ అయిన ఉదంతాన్ని ప్రధానమంత్రి పంచుకొన్నారు. ‘‘మీ రాజు మన ఇద్దరికీ సరిపోయేటంత దుస్తులను ధరించి ఉన్నారు’’ అంటూ గాంధీ జీ సమయస్ఫూర్తిగా మాట్లాడితన హాస్య చతురతను వెల్లడించారని ప్రధాని అన్నారుఅంతా ఐకమత్యంతో ఉండాలనిప్రజలకున్న శక్తిని చాటాలని గాంధీ పిలుపునివ్వడాన్ని గురించి శ్రీ మోదీ చెబుతూఈ నినాదం ఈనాటికీ మార్మోగుతూనే ఉందన్నారుప్రతి ఒక్క కార్యక్రమంలోనూ సామాన్య మానవుడిని భాగస్వామిని చేయాలనిపూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడి ఉండటానికి బదులు సామాజిక మార్పును ప్రోత్సహించాలనే తన స్వీయ నిబద్ధతను ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు

నేటి కాలమాన పరిస్థితుల్లోనూ మహాత్మా గాంధీ ఔచిత్యాన్ని ప్రస్తావిస్తూఆయన వారసత్వం కాలాన్ని జయించిందని శ్రీ మోదీ స్పష్టంచేశారుఈ సందర్భంగా తన కర్తవ్య నిబద్ధతను గుర్తుచేస్తూతన ధైర్యం తన పేరుతో కాకుండా 140 కోట్ల మంది దేశవాసుల మద్దతుఅనాదిగా వస్తున్న వేల ఏళ్ల సంస్కృతి-వారసత్వాలతో ముడిపడి ఉన్నదని వివరించారు. “నేనొక ప్రపంచ నాయకుడితో కరచాలనం చేస్తున్నానంటేఅది మోదీ ఒక్కడు కాదు... 140 కోట్ల మంది భారతీయులు చేయి కలుపుతున్నారని అర్థం” అని సవినయంగా పేర్కొన్నారులోక్‌సభ ఎన్నికలకు ముందు 2013లో తనను ప్రధానమంత్రి అభ్యర్థిగా పార్టీ ప్రకటించినప్పుడు తలెత్తిన విస్తృత విమర్శలను గుర్తుచేస్తూభారత విదేశాంగ విధానంప్రపంచ భౌగోళిక-రాజకీయ స్థితిగతులపై తన అవగాహనను వారు ప్రశ్నించారని శ్రీ మోదీ పేర్కొన్నారుఆ సమయంలో తన స్పందనను వివరిస్తూ- “భారత్‌ తనను చిన్నచూపు చూడటాన్ని ఎన్నడూ అనుమతించదు... ఎవరినీ ఎప్పుడూ చిన్నచూపు చూడదుఇతర ప్రపంచ దేశాలకు దీటుగా నిలుస్తుంది” అని చెప్పానన్నారుఈ విశ్వాసమే తన విదేశాంగ విధానానికి కీలకమని పునరుద్ఘాటిస్తూదేశమే సదా ప్రధానమని స్పష్టం చేశారుప్రపంచ శాంతిసౌభ్రాత్రాలకు భారత్‌ ప్రాధాన్యం ‘వసుధైవ కుటుంబకం’ అనే దృక్పథంలో అనాదిగా వేళ్లూనుకున్నదని ప్రధానమంత్రి గుర్తుచేశారుపునరుత్పాదక ఇంధనం దిశగా “ఒకే సూర్యుడు-ఒక ప్రపంచం-ఒక గ్రిడ్” సహా సకల జీవజాలానికీ వర్తించే “ఒకే ప్రపంచం-ఒకే ఆరోగ్యం” వంటి ప్రపంచ ఆరోగ్య సంరక్షణ దాకా అంతర్జాతీయంగా అనేక కార్యక్రమాల్లో భారత్‌ పోషిస్తున్న పాత్రను ఆయన ప్రస్తావించారుఈ నేపథ్యంలో ప్రపంచ సౌభాగ్యం ఇనుమడింపజేయాల్సిన బాధ్యతను స్పష్టం చేస్తూఈ దిశగా అంతర్జాతీయ సమాజం సమష్టి కృషికి నడుం బిగించాలని పిలుపునిచ్చారుఇక “ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు” నినాదంతో భారత్‌ జి-20 శిఖరాగ్ర సదస్సును నిర్వహించడాన్ని ప్రస్తావిస్తూభారత ప్రాచీన విజ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకోవాల్సిన బాధ్యతను నిర్వర్తించిందని శ్రీ మోదీ గుర్తుచేశారునేటి ప్రపంచ పరస్పర సంధాన స్వభావాన్ని వివరిస్తూ- “నేడు ఏ దేశమూ ఒంటరిగా ముందంజ వేయజాలదు... మనమంతా పరస్పరం ఆధారపడి ఉన్నాం” అన్నారుఆ మేరకు అంతర్జాతీయ కార్యక్రమాల పురోగమనంతోపాటు సమకాలీకరణ-సహకారం ఆవశ్యకతను స్పష్టం చేశారుఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ సంస్థల ఔచిత్యాన్ని కూడా ప్రస్తావిస్తూకాలానుగుణ పరిణామ వైఫల్యం ఫలితంగా ప్రపంచంపై వాటి ప్రభావం అంతర్జాతీయంగా చర్చకు దారితీసిందని ఆయన పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన మార్గాన్వేషణపై శ్రీ మోదీ మాట్లాడుతూబుద్ధుడుమహాత్మా గాంధీలకు జన్మనిచ్చిన భరతభూమికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని గుర్తుచేశారుఆ మహనీయుల బోధనలుకార్యాచరణ పూర్తిగా శాంతికి అంకితమయ్యాయని గుర్తుచేశారుబలమైన సాంస్కృతిక-చారిత్రక నేపథ్యంగల భారత్‌ శాంతి గురించి మాట్లాడితే ప్రపంచం తప్పక వింటుందని ఆయన స్పష్టం చేశారుభారతీయులు ఎన్నడూ సంఘర్షణను కోరుకోరనిసామరస్యాన్ని సమర్థించే శాంతి ప్రియులని పేర్కొన్నారుతదనుగుణంగా సాధ్యమైన ప్రతి సందర్భంలోనూ శాంతి స్థాపన బాధ్యతను చిత్తశుద్ధితో స్వీకరిస్తారని వివరించారుఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ రెండు దేశాలతో తనకుగల సన్నిహిత సంబంధాలను ప్రధానమంత్రి గుర్తుచేస్తూయుద్ధానికిది సమయం కాదని స్పష్టం చేయడంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి కృషి చేయగలనన్నారుఅదేవిధంగా... సమస్యలకు పరిష్కారాలు యుద్ధభూమిలో కాకుండా చర్చల ద్వారా సాధ్యం కాగలవని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీకి కూడా నచ్చజెప్పగలనని పేర్కొన్నారుచర్చలు సఫలం కావాలంటే ఉభయ పక్షాలూ అందులో భాగస్వాములు కావాలనిఉక్రెయిన్-రష్యాల మధ్య అర్థవంతమైన చర్చలకు ప్రస్తుతం అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారుఈ రెండు దేశాల సంఘర్షణ పర్యవసానంగా ఆహారంఇంధనంఎరువుల వంటి రంగాల్లో తలెత్తిన సంక్షోభం వర్ధమాన దేశాలపై దుష్ప్రభావం చూపిందని ప్రధానమంత్రి గుర్తుచేశారుఅందుకే ఘర్షణ వల్ల తలెత్తే కష్టనష్టాలను స్పష్టం చేస్తూ శాంతి సాధనకు అంతర్జాతీయ సమాజం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారుఈ మేరకు “నేను తటస్థంగా లేను... నాకొక విస్పష్ట వైఖరి ఉందిఅదే శాంతి... ఆ శాంతి స్థాపనకు శాయశక్తులా కృషి చేస్తున్నాను” అని పునరుద్ఘాటించారు.

   భారత్‌-పాక్‌ సంబంధాల అంశాన్ని ప్రస్తావిస్తూదేశ విభజన సందర్భంగా 1947నాటి బాధాకర వాస్తవికతను వివరించారుఆనాటి హింసరక్తపాతంవిషాదాలను కళ్లకు కడుతూపాక్‌ నుంచి క్షతగాత్రులుశవాలు నిండిన రైళ్లు రావడం వంటి బీభత్స దృశ్యాలను గుర్తుచేశారుసామరస్యపూర్వక సహజీవనాన్నే భారత్‌ సదా అభిలషిస్తున్నాపాక్‌ మాత్రం ప్రచ్ఛన్న యుద్ధంతో శత్రుమార్గాన్నే ఎంచుకున్నదని విచారం వ్యక్తం చేశారురక్తపాతంఉగ్రవాదం కేంద్రకంగా పెరుగుతున్న భావజాలం ప్రయోజనమేమిటని ప్రధానమంత్రి ప్రశ్నించారుఉగ్రవాదం భారత్‌కు మాత్రమేగాకయావత్‌ ప్రపంచానికీ ముప్పేనని స్పష్టం చేశారుఉగ్రవాద మూలాలు తరచూ పాక్‌ వైపే దారితీస్తాయనిఅక్కడ ఆశ్రయం పొందిన ఒసామా బిన్ లాడెన్ ఉదంతాన్ని ఉటంకిస్తూపాకిస్తాన్ కల్లోల కేంద్రంగా మారిందని స్పష్టం చేశారుఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాలను ఇకనైనా విడిచిపెట్టాలని హితవు పలికారు. “మీ దేశాన్ని అరాచక శక్తులకు ఆలవాలం చేసి మీరు సాధించేదేమిటి?” అని ఆయన ప్రశ్నించారుఈ సందర్భంగా తన లాహోర్ పర్యటనప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారానికి పాక్‌ను ఆహ్వానించడం వంటి తన శాంతికాముక కృషిని శ్రీ మోదీ గుర్తుచేశారుమాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ జ్ఞాపకాల్లో పేర్కొన్నట్టుగాశాంతిసామరస్యాలపై భారత్‌ నిబద్ధతకు ఈ దౌత్యపరమైన చర్యలే నిదర్శనమని స్పష్టం చేశారుకానీఈ కృషికి బదులుగా మనకు లభించింది శత్రుత్వంవంచన మాత్రమేని ప్రధాని వ్యాఖ్యానించారు.

   క్రీడల ఏకీకరణ శక్తి గురించి స్పష్టం చేస్తూప్రజానీకం మధ్య విస్తృత అనుసంధానానికి దోహదం చేయడమేగాక ప్రపంచాన్ని శక్తిమంతం చేయగలవని శ్రీ మోదీ అన్నారు. “మానవాళి పరిణామంలో క్రీడలకు కీలక పాత్ర ఉందిఅవి కేవలం ఆటలు కాదు... అవి దేశాల మధ్యప్రజల మధ్య ఐక్యభావనను ప్రోదిచేస్తాయి” అన్నారుతనకు క్రీడా నైపుణ్యం లేనప్పటికీఇటీవలి భారత్‌-పాక్‌ క్రికెట్ మ్యాచ్‌ ఫలితం వంటివి క్రీడల ప్రాధాన్యాన్ని చాటిచెబుతాయన్నారుభారత్‌ల ఫుట్‌బాల్ సంస్కృతి కూడా వేళ్లూనుకున్నదని ప్రస్తావిస్తూమన మహిళల అద్భుత ప్రతిభా నైపుణ్యాలను కొనియాడటంతోపాటు పురుషుల జట్టు పురోగమనాన్ని కూడా ఆయన ప్రశంసించారుగతకాలపు అనుభవాలను నెమరువేసుకుంటూ- 1980ల తరానికి మారడోనా ఒక హీరో కాగానేటి తరానికి లయోనల్‌ మెస్సీ ఆరాధ్యుడని ఆయన వ్యాఖ్యానించారుఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని గిరిజన జిల్లా షాడోల్‌కు వెళ్లినప్పటి అనుభవం తనకెంతో చిరస్మరణీయమని శ్రీ మోదీ అన్నారుఅక్కడి ప్రజలకు ఫుట్‌బాల్‌ క్రీడతో అవినాభావ సంబంధం ఉందనిఓ గ్రామం యువ ఆటగాళ్లు తమ ఊరిని “మినీ బ్రెజిల్” అని సగర్వంగా చాటుకున్నారని ఆయన గుర్తుచేశారునాలుగు తరాల ఫుట్‌బాల్ సంప్రదాయందాదాపు 80 మంది జాతీయస్థాయి ఆటగాళ్ల ప్రతిభాపాటవాలతో ఆ గ్రామానికి అంతటి గుర్తింపు లభించిందని పేర్కొన్నారువారు ఏటా నిర్వహించే ఫుట్‌బాల్ పోటీలకు సమీప గ్రామాల నుంచి 20-25,000 వేల మంది ప్రేక్షకులు వెల్లువెత్తడమే ఇందుకు నిదర్శనమని చెప్పారుదేశంలో ఫుట్‌బాల్పై మక్కువ ఆశావహ రీతిలో పెరుగుతున్నదనిఇదెంతో ఉత్సాహభరిత క్రీడ మాత్రమేగాక వాస్తవిక జట్టు స్ఫూర్తికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు.

   అమెరికా అధ్యక్షుడు గౌరవనీయ శ్రీ డొనాల్డ్ ట్రంప్ గురించి అడిగినప్పుడుహ్యూస్టన్‌లో నిర్వహించిన “హౌడీ మోడీ” సభనుప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియంలో తామిద్దరం ప్రసంగించడాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారుఅధ్యక్షుడు ట్రంప్ వినమ్రతను ప్రస్తావిస్తూతన ప్రసంగ సమయంలో ప్రేక్షకులలో కూర్చోవడాన్ని... తర్వాత స్టేడియంలో తనతో నడుస్తూ ప్రజలకు అభివాదం చేయడాన్నిపరస్పర విశ్వాసం-బలమైన స్నేహబంధం ప్రదర్శించిన తీరును ఆయన జ్ఞాపకం చేసుకున్నారుఅధ్యక్షుడు ట్రంప్ ధైర్యం-నిర్ణయాత్మకతలను వివరిస్తూఓ ప్రచార కార్యక్రమంలో తనపై కాల్పుల తర్వాత కూడా ఆయన పుంజుకున్న తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారువైట్ హౌస్‌కు తన తొలి సందర్శనను శ్రీ మోదీ ఉటంకిస్తూఅధ్యక్షుడు ట్రంప్ అక్కడి విధివిధానాలకు భిన్నంగా స్వయంగా తనకు భవనమంతా చూపించారని చెప్పారుఅలాగే తమ దేశ చరిత్రపై ట్రంప్‌ అవగాహనగౌరవం అపారమన్నారులిఖితపూర్వక సమాచారంసహాయకుల తోడ్పాటు వంటివేవీ లేకుండా మునుపటి అధ్యక్షుల విశేషాలనుకీలక ఘట్టాలను ఆయన ఏకరవు పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారుఇక ట్రంప్‌ పదవిలో లేని సమయంలోనూ తమ మధ్య బలమైన విశ్వాసంసంబంధాలు చెక్కుచెదరలేదని గుర్తుచేశారుఅధ్యక్షుడు ట్రంప్ తననొక గొప్ప సంధానకర్తగా అభివర్ణించడం ఆయన హుందాతనాన్నివినమ్రతను చాటాయని ప్రధానమంత్రి అన్నారుఏ చర్చల్లోనైనా భారత్‌ ప్రయోజనాలకు మాత్రమే తాను సదా ప్రాధాన్యమిస్తానని చెప్పారుఅవతలి పక్షం మనోభావాలకు ఎలాంటి భంగం కలగకుండా సానుకూల రీతిలో తన వాదన వినిపించడం తన నైజమన్నారుఈ దేశమే తనకు అధిష్ఠానమనిభారతీయులు తనకప్పగించిన బాధ్యతను శిరసావహిస్తానని ఆయన స్పష్టం చేశారుఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ఎలాన్ మస్క్తులసి గబ్బర్డ్వివేక్ రామస్వామిజె.డి.వాన్స్ వంటి వ్యక్తులతో తన ఫలవంతమైన సమావేశాలను ఉటంకించారుఈ సందర్భంగా వెల్లివిరిసిన సౌహార్దతనుకుటుంబ  వాతావరణాన్ని గుర్తుచేసుకున్నారుఅలాగే ఎలాన్ మస్క్‌తో తన చిరకాల పరిచయాన్ని వివరించారు. ‘డోజ్‌’ కార్యక్రమంపై మస్క్ ఉత్సాహాన్ని ప్రస్తావిస్తూభారత ప్రధానిగా 2014లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పాలనలో లోపాలనుహానికర విధానాలను తొలగించే దిశగా తాను చేసిన కృషి కూడా ఇలాంటిదేనని పేర్కొన్నారుసంక్షేమ పథకాల నుంచి 10 కోట్ల మందికిపైగా అనర్హుల ఏరివేతతో భారీగా ప్రజాధనం ఆదా కావడం వంటి పాలన సంస్కరణలను ప్రధాని ఉదాహరించారుపారదర్శకతకు భరోసా ఇస్తూదళారీ వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటివిధానం ప్రవేశపెట్టడంతో దాదాపు రూ.3 లక్షల కోట్లు ఆదా అయ్యాయని తెలిపారుఅలాగే ప్రభుత్వ కొనుగోళ్ల కోసం ‘జిఇఎం’ పోర్టల్‌ను ప్రారంభించడంతో వ్యయం తగ్గడంతోపాటు నాణ్యత మెరుగుపడిందని గుర్తుచేశారుఅంతేగాక 40,000దాకా అనవసర నిబంధనలను తొలగించడమే కాకుండా కాలం చెల్లిన 1,500 పాత చట్టాల రద్దుతో పాలనను క్రమబద్ధీకరించామని తెలిపారునేడు ‘డోజ్‌’ వంటి వినూత్న వ్యవస్థ ప్రపంచాన్ని ఆకర్షించిన రీతిలోనే తాను చేపట్టిన సాహసోపేత మార్పుచేర్పులు భారత్‌ను అంతర్జాతీయ చర్చలకు కేంద్రంగా మార్చాయని ఆయన అన్నారు.

   భారత్‌-చైనా ద్వైపాక్షిక సంబంధాలను ప్రస్తావించగాపరస్పర అనుభవాల నుంచి పాఠాలు స్వీకరించడంప్రపంచ శ్రేయస్సుకు దోహదపడటంలో రెండు దేశాలకుగల ఉమ్మడి చరిత్రను ప్రధాని ఉటంకించారుఒకనాడు ప్రపంచ ‘జిడిపి’ 50 శాతం వాటా భారత్‌-చైనాలదేననిఈ విషయంలో రెండు దేశాలు పోషించిన పాత్రకు ఇది నిదర్శనమని చెప్పారుభారత్‌లో పుట్టిన బౌద్ధం చైనాపై విస్తృత  ప్రభావం చూపడాన్ని ప్రస్తావిస్తూలోతైన సాంస్కృతిక సంబంధాలకు ఇదే రుజువని వ్యాఖ్యానించారురెండు దేశాల మధ్య సంబంధాల కొనసాగింపుబలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను శ్రీ మోదీ స్పష్టం చేశారుఇరుగుపొరుగు మధ్య వాదసంవాదాలు సహజమే అయినాఅవి వివాదాలుగా ముదరకుండా నిరోధించాల్సిన అవసరం ఎంతయినా ఉందని పునరుద్ఘాటించారు. “ఉభయతారక ప్రయోజనాల కోసం సుస్థిరసహకారాత్మక బంధం ఏర్పరచుకోవడంలో చర్చలు అత్యంత కీలకం” అని ప్రధాని స్పష్టం చేశారుప్రస్తుత సరిహద్దు వివాదాలను ప్రస్తావిస్తూ- 2020లో ఉద్రిక్తతలు తలెత్తినప్పటికీచైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఇటీవలి తన సమావేశం సరిహద్దులో సాధారణ స్థితిగతులు నెలకొనేందుకు దోహదం చేసిందన్నారుతదనుగుణంగా 2020 మునుపటి పరిస్థితుల పునరుద్ధరణ కృషి కొనసాగుతున్నదని చెప్పారుదీంతో పరస్పర విశ్వాసంఉత్సాహంఉత్తేజం క్రమంగా మెరుగవుతున్నాయని ఆశాభావం వెలిబుచ్చారుప్రపంచ స్థిరత్వంశ్రేయస్సుకు భారత్‌-చైనా మధ్య సహకారం అవశ్యమనిఘర్షణకన్నా ఆరోగ్యకర పోటీయే ఉత్తమమని స్పష్టం చేశారు.

   ప్రపంచ ఉద్రిక్తతలనుకోవిడ్‌-19 నుంచి నేర్చుకున్న పాఠాలను ప్రధానమంత్రి ప్రస్తావించారుప్రతి దేశానికిగల పరిమితులు తేటతెల్లం కావడమేగాక ఐక్యత అవసరాన్ని ఈ పరిణామాలు విస్పష్టం చేశాయని చెప్పారుశాంతి వైపు పయనించే బదులు ప్రపంచం మరింత విచ్ఛిన్నం వైపు సాగిందనిఫలితంగా పరిస్థితులు అనిశ్చితికిసంఘర్షణల తీవ్రతకు దారితీశాయని వ్యాఖ్యానించారుసంస్కరణలు ప్రవేశపెట్టకపోవడంఅంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన వల్ల ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వ్యవస్థల ఔచిత్యమే సందిగ్ధంలో పడిందని ఆయన వివరించారుమనం ముందడుగు వేయాలంటే అభివృద్ధి ఆధారిత విధానాన్ని ముందుకు తీసుకెళ్లడమే మార్గమని స్పష్టం చేస్తూసంఘర్షణ నుంచి సహకారంవైపు మళ్లాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారుపరస్పర అనుసంధానిత-పరస్పర ఆధారిత ప్రపంచంలో విస్తరణవాదం పనికిరాదని ఆయన పునరుద్ఘాటించారుదేశాల మధ్య పరస్పర మద్దతు ఆవశ్యకతను వివరిస్తూనేటి సంఘర్షణలపై ప్రపంచ వేదికల ద్వారా వెల్లడైన తీవ్ర ఆందోళనను ప్రస్తావిస్తూశాంతి పునరుద్ధరణపై ఆశాభావం వెలిబుచ్చారు.

   గుజరాత్‌లో 2002నాటి అల్లర్ల అంశంపై మాట్లాడుతూఆనాటి కల్లోల వాతావరణం గురించి శ్రీ మోదీ సమగ్రంగా వివరించారుఆనాడు కాందహార్ హైజాక్ఎర్రకోటపై దాడి, 9/11 ఉగ్రవాద దాడులు వంటి అనేక జాతీయఅంతర్జాతీయ సంక్షోభాలను గుర్తుచేశారురాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా తానెదుర్కొన్న ఉద్రిక్త వాతావరణంసవాళ్లను ఆయన ప్రస్తావించారుముఖ్యంగా వినాశకర భూకంపం అనంతరం పునరావాసం-సహాయ కార్యక్రమాల పర్యవేక్షణవిషాదకరమైన గోధ్రా అనంతర సంఘటనల తర్వాతి పరిస్థితులను చక్కదిద్దడం వంటి చర్యలు చేపట్టామని తెలిపారుఅలాగే 2002నాటి అల్లర్లపై అపోహలను ప్రధాని ప్రస్తావించారుతన పదవీకాలానికి ముందు గుజరాత్‌కు మత హింస సంబంధిత సుదీర్ఘ చరిత్ర ఉందని పేర్కొన్నారున్యాయవ్యవస్థ ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనను పూర్తి నిర్దోషిగా తేల్చిందని ఆయన స్పష్టం చేశారుఅయితే, 2002 నుంచి ఇప్పటికి 22 ఏళ్లుగా రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నదని పేర్కొన్నారుసర్వజన ప్రగతికి పాటుపడుతూ సకలజన విశ్వాసం పొందాలనే పాలన విధానమే ఇందుకు కారణమని ఆయన చెప్పారువిమర్శల గురించి చెబుతూ- “విమర్శలే ప్రజాస్వామ్యానికి ఆత్మ” అన్నారుఅయితే వాస్తవికనిర్దిష్ట సాక్ష్యసహిత విమర్శ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారుఇది మెరుగైన విధాన రూపకల్పనకు దారితీస్తుందని విశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారుఅయితేనిరాధార ఆరోపణల వెల్లువపై ఆందోళన వ్యక్తం చేస్తూనిర్మాణాత్మక విమర్శలకు ఇది భిన్నమని స్పష్టం చేశారు. “ఆరోపణల వల్ల అనవసర వివాదాలు తలెత్తడమే తప్ప ఎవరికీఎలాంటి ప్రయోజనం ఉండదు” అన్నారుఇక పాత్రికేయ బాధ్యతలలో సమతుల విధానానుసరణే తన దృక్పథమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారుజర్నలిజాన్ని తేనెటీగతో పోలుస్తూలోగడ ఓ సందర్భంలో తాను చెప్పినట్లు అవి తేనెను సేకరించి మాధుర్యాన్ని పంచేవే అయినాఅవసరమైతే శక్తిమంతమైన కాటుతో తగురీతిన శిక్షించగలవని వ్యాఖ్యానించారుకానీదీనికి భిన్నంగా నేటి జర్నలిజం తనకు నచ్చినవాటికి  మాత్రమే ప్రాచుర్యం ఇస్తున్నదని విచారం వ్యక్తం చేశారుసంచలనాత్మకను మించి సత్యంనిర్మాణాత్మక ప్రభావంపై దృష్టి సారించడం ఎంతయినా అవసరమని ప్రధాని స్పష్టం చేశారు.

రాజకీయాలలో తన విస్తృతమైన అనుభవం గురించి ప్రస్తావిస్తూప్రారంభదశలో సంస్థాగత వ్యవహారాలుఎన్నికల నిర్వహణప్రచార వ్యూహాలను రూపొందించడంపై దృష్టి సారించడాన్ని శ్రీ మోదీ వివరించారుగత 24 సంవత్సరాలుగాగుజరాత్ ప్రజలుభారతదేశ ప్రజలు తనపై విశ్వాసం ఉంచారనిఈ పవిత్ర కర్తవ్యాన్ని అప్రమత్తతతో,  అచంచల అంకితభావంతో నిర్వహించడానికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారుకులంమతంవిశ్వాసంసంపద లేదా భావజాలం ఆధారంగా వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు ప్రతి పౌరుడికి చేరేలా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారునమ్మకాన్ని పెంపొందించడమే తన పాలనా నమూనాకు కీలకమని పేర్కొన్నారుపథకాల ద్వారా ప్రత్యక్షంగా లబ్ది పొందని వారిలో కూడా భవిష్యత్తులో అవకాశాలు పొందగలమన్న నమూనాను పెంపొందించామని ఆయన చెప్పారు మా పరిపాలన ఎన్నికల ఆధారితమైనది కాదు... ప్రజా ఆధారితమైనదిఇది పౌరుల కోసం,  దేశ శ్రేయస్సు కోసం అంకితమైనది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారుదేశాన్ని,  ప్రజలను దైవస్వరూపంగా భావిస్తూవారికి భక్తితో సేవ చేసే అర్చకుడిగా తనను తాను పోల్చుకుంటానని ఆయన తెలిపారుతనకు ఎలాంటి స్వప్రయోజనాలురాగద్వేషాలు లేవని ప్రస్తావిస్తూతన పదవిని అడ్డం పెట్టుకొని లాభపడే మిత్రులు,  బంధువులు ఎవరూ లేరని ప్రధాని తెలిపారుఈ లక్షణం సాధారణ ప్రజలకు దగ్గర చేయడంతో పాటు విశ్వాసాన్ని పెంచిందని చెప్పారుప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీలో సభ్యుడిగా ఉండటం తనకు గర్వంగా ఉందని ప్రధాని అన్నారుఈ ఘనత అంకితభావంతో అహర్నిశలు పనిచేసే లక్షలాదిమంది కార్యకర్తలదేనని ఆయన ప్రశంసించారుభారతదేశ సంక్షేమానికిదాని ప్రజల సంక్షేమానికి అంకితమైన ఈ కార్యకర్తలకు రాజకీయాలలో ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేవనివారి నిస్వార్థ సేవకు విశేషమైన గుర్తింపు పొందారని ఆయన అన్నారు. . తమ పార్టీపై ఉన్న నమ్మకం ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలిస్తోందనిదీనికి ప్రజల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.

2024 సార్వత్రిక ఎన్నికలను ఉదాహరణగా పేర్కొంటూభారతదేశంలో ఎన్నికల నిర్వహణలో ఉన్న ఉన్నతమయిన ప్రామాణీకాలను ప్రధాని ప్రస్తావించారుదేశంలో 98 కోట్ల మంది ఓటర్లున్నారనిఇది ఉత్తర అమెరికాయూరోపియన్ యూనియన్ జనాభాను కలిపినంత కంటే ఎక్కువ అని అన్నారువీరిలో 64.6 కోట్ల మంది ఎండ వేడిని సైతం తట్టుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన తెలిపారుభారత్ లో పది లక్షలకు పైగా పోలింగ్ బూత్ లు, 2,500కు పైగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉన్నాయనిఇది ప్రజాస్వామ్య స్థాయిని తెలియజేస్తోందని అన్నారుమారుమూల గ్రామాల్లో కూడా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయనిచేరుకోవడం కష్టంగా ఉండే ప్రాంతాలకు కూడా పోలింగ్ సామాగ్రిని  తరలించేందుకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నామని తెలిపారుప్రజాస్వామ్యం పట్ల భారత్ నిబద్ధతకు నిదర్శనంగా గుజరాత్ లోని గిర్ ఫారెస్ట్ లో కేవలం ఒక్క ఓటరు కోసం పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం వంటి విశేషాలను ఆయన పంచుకున్నారుస్వేచ్ఛాయుతనిష్పాక్షిక ఎన్నికల నిర్వహణలో భారత ఎన్నికల సంఘం ప్రపంచస్థాయి కొలమానాన్ని నెలకొల్పిందని ప్రధాని కొనియాడారు భారతీయ ఎన్నికల నిర్వహణను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఒక కేస్ స్టడీగా అధ్యయనం చేయాలని ఆయన సూచించారుఎందుకంటే ఇందులో అసాధారణమైన రాజకీయ అవగాహనప్రామాణీకాలపరంగా అత్యున్నత స్థాయి సమర్థత ఉందని చెప్పారు.

తన నాయకత్వం గురించి చెబుతూప్రధానమంత్రిగా కాకుండా “ప్రధాన సేవకుడిగా” గుర్తింపు పొందడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు, ‘సేవే తన పనిసూత్రంఅని ఆయన అన్నారుఅధికారాన్ని కోరుకోవడం కంటే ఉత్పాదకతప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావడమే తన లక్ష్యమనిపేర్కొన్నారు. “నేను రాజకీయాల్లోకి అధికార క్రీడలు ఆడడానికి రాలేదుసేవ చేసేందుకు వచ్చాను” అని అన్నారు.

ఒంటరితనంపై మాట్లాడుతూ,  తనకు ఎప్పుడూ ఒంటరి భావన ఉండదని ప్రధానమంత్రి తెలిపారు. “వన్ ప్లస్ వన్”  అనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతాననిఅది తననుపరమాత్మను సూచిస్తుందని అన్నారుదేశానికిప్రజలకు సేవ చేయడం అంటే దైవసేవ చేయడమేనని ఆయన పేర్కొన్నారుమహమ్మారి సమయంలోతాను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పరిపాలనా నమూనాకు రూపకల్పన చేయడంలో నిమగ్నమయ్యాయని ప్రధాన మంత్రి తెలిపారుఅలాగేపార్టీలో 70 ఏళ్ల వయసు పైబడిన కార్యకర్తలతో వ్యక్తిగతంగా సంబంధాలు కొనసాగిస్తూవారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూపాత జ్ఞాపకాలను మళ్లీ తలుచుకున్నానని ఆయన పేర్కొన్నారు.

కష్టపడి పనిచేయడం వెనుక రహస్యం ఏమిటని అడిగినప్పుడురైతులుసైనికులుకూలీలుకుటుంబం కోసం నిరంతరం శ్రమించే తల్లుల  నుంచి తనకు కష్టపడి పనిచేసే ప్రేరణ లభిస్తుందని శ్రీ మోదీ తెలిపారు.  "నేను ఎలా నిద్రపోగలనుఎలా విశ్రాంతి తీసుకోవగలనుప్రేరణ నా కన్నుల ముందే ఉంది” అని ఆయన పేర్కొన్నారుతనపై ప్రజలు ఉంచిన బాధ్యతలు తాను అత్యుత్తమంగా పనిచేయడానికి ప్రేరేపిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారుదేశం కోసం శ్రమించడంలో ఎప్పుడూ వెనుకబడననిదురుద్దేశాలతో వ్యవహరించననివ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏదీ చేయనని 2014 ఎన్నికల ప్రచార సమయంలో తాను చేసిన వాగ్దానాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారుప్రభుత్వాధినేతగా తన 24 ఏళ్ల పొడవునా ఈ ప్రమాణాలను నిలబెట్టానని ఆయన పునరుద్ఘాటించారు. 140 కోట్ల మందికి సేవ చేయడంవారి ఆకాంక్షలను అర్థం చేసుకోవడంవారి అవసరాలను తీర్చడం ద్వారా తాను స్ఫూర్తి పొందానని ప్రధాని పేర్కొన్నారు. “నేను ఎప్పుడూ వీలైనంత ఎక్కువ చేయడానికిఎక్కువగా కష్టపడేందుకు సంకల్పబద్ధుడినిఇప్పటికీ ఇదే సంకల్ప శక్తితో ముందుకు సాగుతున్నాను” అన్నారు

అన్ని కాలాల్లోనూ గొప్ప గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరిగా పేరొందిన శ్రీనివాస రామానుజన్ పట్ల తనకున్న ప్రగాఢ గౌరవాన్ని వ్యక్తం చేసిన శ్రీ మోదీరామానుజన్ జీవితంరచనలు సైన్స్ కుఆధ్యాత్మికతకు మధ్య ఉన్న లోతైన అనుసంధానాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. రామానుజన్ తన గణిత సంబంధిత ఆలోచనలను తాను పూజించిన దేవత ప్రేరణగా అందించినట్టు నమ్మేవారని ప్రధాని మోదీ పేర్కొన్నారుఇలాంటి ఆలోచనలు ఆధ్యాత్మిక క్రమశిక్షణ నుండి ఉద్భవిస్తాయని అన్నారు. “ క్రమశిక్షణ అనేది కేవలం కష్టపడటమే కాదుఒక పనికి పూర్తిగా అంకితమవడందానిలో పూర్తిగా లీనమైపోయితుదకు మీరే ఆ పనిగా మారిపోవడం” అని ఆయన పేర్కొన్నారువిభిన్న విజ్ఞాన మార్గాల పట్ల విశాల దృక్పథంతో ఉండే గొప్పతనాన్ని ప్రస్తావిస్తూఅటువంటి ఆలోచనాపరమైన విస్తృతి కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని ఆయన తెలిపారుసమాచారంవిజ్ఞానం మధ్య ఉన్న తేడాను వివరిస్తూ, “కొంతమంది సమాచారాన్ని విజ్ఞానం అనుకుంటారుఅది నిజం కాదు.  విజ్ఞానం అనేది లోతైనది అది విశ్లేషణఆలోచనఅర్థం చేసుకోవడం ద్వారా అభివృద్ధి చెందుతుంది.” అని ప్రధాని మోదీ పేర్కొన్నారుసమాచారంవిజ్ఞానం మధ్య తేడాను అర్థం చేసుకోవడం ఎంతో అవసరమని,  ఎందుకంటే ఈ రెండింటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ అవగాహన కీలక మని వివరించారు.

తన నిర్ణయాలపై ప్రభావం చూపిన అంశాల గురించి మాట్లాడుతూ,  తన ప్రస్తుత బాధ్యతలను చేపట్టే ముందు భారతదేశంలోని 85-90% జిల్లాల్లో విస్తృతంగా పర్యటించినట్టు ఆయన వివరించారు.ఈ అనుభవాలు గ్రామీణ స్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా అర్థం చేసుకునే అవకాశం ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు.

నన్ను దిగజార్చేలేదా ఒక నిర్దిష్ట మార్గంలో నడవాలని ఒత్తిడి చేసే భారాన్ని నేను తలకెత్తుకోను” అని ప్రధాని మోదీ తెలిపారు.  ‘దేశమే  తొలి ప్రాధాన్యం‘ అనేది తన మార్గదర్శక సూత్రమని స్పష్టం చేశారునిర్ణయాలు తీసుకునేటప్పుడు నిరుపేద వ్యక్తి ముఖాన్ని పరిగణనలోకి తీసుకునే మహాత్మాగాంధీ బోధన నుండి తాను ప్రేరణ పొందానని ఆయన తెలిపారుతన పరిపాలన వ్యవస్థ బలమైన అనుసంధానాన్ని కలిగి ఉందని ఆయన వివరించారుతనకు ఉన్న అనేకక్రియాశీల సమాచార మార్గాలు విభిన్న కోణాలను అందిస్తాయని పేర్కొన్నారు. “ఎవరైనా నాకు ఏదైనా వివరించినప్పుడుఅదే నా ఏకైక సమాచార మార్గం కాదు.” అని ఆయన వ్యాఖ్యానించారుఅధ్యయన దృక్పథాన్ని కొనసాగించడం ఎంత ముఖ్యమో ప్రధాని మోదీ ప్రస్తావించారుతాను విద్యార్థి మాదిరిగా ప్రశ్నలు వేసేందుకుఅలాగే వివిధ కోణాల నుంచి విశ్లేషించేందుకు డెవిల్స్ అడ్వకేట్ పాత్ర పోషించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారుకోవిడ్-19 సంక్షోభ సమయంలో నిర్ణయాలు తీసుకున్న విధానం గురించి చెబుతూఆర్థిక విషయాల్లో అంతర్జాతీయ సిద్ధాంతాలను కచ్చితంగా అనుసరించాలని వచ్చిన ఒత్తిడిని తాను తట్టుకున్నానని తెలిపారు. “నేను పేదలను ఆకలితో పడుకోనివ్వనుప్రాథమిక అవసరాల కోసం సామాజిక ఉద్రిక్తతలు తలెత్తడాన్ని అనుమతించను” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారుసహనంక్రమశిక్షణతో కూడిన తన విధానం తీవ్ర ద్రవ్యోల్బణాన్ని నివారించడానికిభారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదగడానికి దోహదపడిందని ఆయన ఉద్ఘాటించారుఅపాయాలకు అవకాశం ఉన్న సవాళ్ళను కూడా స్వీకరించే తన సామర్థ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, “నా దేశానికిప్రజలకు మేలైనదైతేదానిని కష్టమైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉంటాను.” అని తెలిపారుతాను తీసుకునే నిర్ణయాలకు పూర్తిగా తానే బాధ్యత తీసుకుంటానని, “ఏదైనా తప్పు జరిగితేనేను దానికి పూర్తి బాధ్యత వహిస్తాను తప్ప ఇతరులపై నెట్టివేయను” అని స్పష్టం చేశారుతన ఈ విధానం స్వీయసంకల్పాన్ని పెంచడంతో పాటుతన బృందంలో దృఢమైన నిబద్ధతను కలిగించిందనిప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించిందని ప్రధాని మోదీ తెలిపారు. “నేను తప్పులు చేయవచ్చు... కానీ ఎప్పుడూ దురుద్దేశంతో వ్యవహరించను.” అని ఆయన స్పష్టం చేశారుపరిణామాలు ఎప్పుడూ ఆశించిన విధంగా ఉండకపోయినాతన ఉద్దేశాల్లోని నిజాయితీని సమాజం అంగీకరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు

ఏఐని ప్రోత్సహించడంలో భారత్ పాత్రపై ప్రశ్నించగా.. “కృత్రిమ మేధ (ఏఐఅభివృద్ధి ప్రధానంగా సమష్టి కృషిఏ దేశమూ ఏఐని పూర్తిగా సొంతంగా అభివృద్ధి చేసుకోలేదు” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. “ఏఐతో ప్రపంచం ఏదైనా చేయవచ్చు గాక.. కానీ భారత్ లేకుంటే అది అసంపూర్ణంగానే మిగిలిపోతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారునిర్దిష్ట సందర్భాల్లో వినియోగం కోసం కృత్రిమ మేధ ఆధారిత అనువర్తనాలపై భారత్ క్రియాశీల కృషినిప్రత్యేకమైన మార్కెట్ ఆధారిత నమూనాతో విస్తృత లభ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. “ప్రాథమికంగా కృత్రిమ మేధకు మూలం మానవ మేధఅదే దానిని రూపొందించిమార్గనిర్దేశం చేస్తుందిఆ వాస్తవిక మేధ భారత యువతలో పుష్కలంగా ఉంది” అన్న ప్రధానమంత్రి భారత్ లో పెద్దసంఖ్యలో ఉన్న ప్రతిభావంతులే దేశానికి బలమని పేర్కొన్నారు. 5జీ అమలులో భారత వేగవంతమైన పురోగతిని ఇందుకు ఉదాహరణగా ఆయన పేర్కొన్నారుభారత్ ఇందులో అంతర్జాతీయ అంచనాలను మించి ఎదిగిందన్నారుహాలీవుడ్ లో ఓ బ్లాక్ బస్టర్ సినిమా కన్నా తక్కువ వ్యయంతోనే చంద్రయాన్ వంటి అంతరిక్ష యాత్రలు చేపట్టడం భారత్ సమర్థతకుసృజనాత్మకతకు నిదర్శనమన్నారుఈ విజయాలు భారతీయ ప్రతిభపై ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పెంచుతాయనిదేశ నాగరిక విలువలను ప్రతిబింబిస్తాయని ఆయన వ్యాఖ్యానించారుఅంతర్జాతీయంగా సాంకేతిక రంగంలో భారత మూలాలున్న నాయకుల విజయాన్ని కూడా ప్రస్తావించిన శ్రీ మోదీ.. దేశ సాంస్కృతిక విలువలైన అంకితభావంనైతికతసమష్టితత్వం ఇందుకు కారణమన్నారు. ‘‘భారత్ లో పెరిగిన ప్రజలు.. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో పెరిగిన వ్యక్తులుసామాజిక అనుసంధానం విస్తృతంగా ఉన్నవారు సంక్లిష్టమైన పనులను సులభంగా నిర్వహిస్తూపెద్ద బృందాలను సమర్థవంతంగా ముందుకు నడపగలరు’’ అని ఆయన పేర్కొన్నారుభారతీయ నిపుణుల సమస్యా పరిష్కార సామర్థ్యాలువిశ్లేషణాత్మక ఆలోచనా విధానం వారిని ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నిలుపుతాయని స్పష్టం చేశారుకృత్రిమ మేధ మానవుడి స్థానాన్ని భర్తీ చేస్తుందేమోనన్న ఆందోళనలను ప్రస్తావిస్తూ.. మానవాళి గమనంలో సాంకేతికత ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉందనిమనుషులు దాన్ని అందిపుచ్చుకుంటూ ముందడుగు వేస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “మనిషి ఆలోచనే ఇంధనందాని ఆధారంగానే అనేక అంశాలను ఏఐ సృజించగలదుకానీ మానవుడి మనస్సులోని అపరిమితమైన సృజనాత్మకతనుఊహాశక్తిని ఏ సాంకేతిక పరిజ్ఞానమూ ఎప్పటికీ భర్తీ చేయలేదు” అని ఆయన వ్యాఖ్యానించారుమనిషిగా ఉండేందుకు వాస్తవిక ప్రాతిపదికలేమిటో గుర్తించేలా మానవులను ఏఐ సవాలు చేస్తోందని ప్రధానమంత్రి అన్నారుపరస్పరం బాగోగులు చూసుకోగల సహజమైన మానవ సామర్థ్యాన్ని ఏఐ ప్రదర్శించలేదని స్పష్టం చేశారు.

విద్యపరీక్షలువిద్యార్థుల విజయానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ.. సమాజపు ఆలోచనా విధానం విద్యార్థులపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతోందనీ.. పాఠశాలల్లోకుటుంబాల్లో చాలావరకూ ర్యాంకులతోనే విజయాన్ని అంచనా వేస్తున్నారని శ్రీ మోదీ చెప్పారుఈ రకమైన ఆలోచనల వల్లే.. మొత్తం తమ జీవితాలకు పదిపన్నెండో తరగతుల పరీక్షలే మూలమని పిల్లలు భావిస్తున్నారని అన్నారుఈ సమస్యల పరిష్కారం కోసమే భారత నూతన విద్యావిధానంలో విశేషమైన మార్పులను ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారుపరీక్షా పే చర్చా వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల భారాన్ని తగ్గించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ‘‘చాలా మంది చదువుల్లో ఎక్కువ మార్కులు పొందలేకపోయినాక్రికెట్ లో సెంచరీ కొట్టగలరుఎందుకంటే వారి బలం అందులోనే ఉంది’’ అన్న ప్రధానమంత్రి.. పరీక్షలొక్కటే ఓ వ్యక్తి సామర్థ్యానికి ఏకైక కొలమానం కాకూడదని స్పష్టం చేశారుతాను బడిలో చదువుకున్నప్పటి విశేషాలను ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారుసృజనాత్మకమైన బోధన పద్ధతులు అభ్యసనాన్ని ఆహ్లాదకరంగాప్రభావవంతంగా మార్చాయని తెలిపారుకొత్త విద్యావిధానంలో ఇలాంటి మెళకువలను పొందుపరిచినట్లు ఆయన పేర్కొన్నారువిద్యార్థులు ప్రతి పనినీ అంకితభావంతోచిత్తశుద్ధితో చేయాలన్న శ్రీ మోదీ.. నైపుణ్యాలుసామర్థ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా విజయానికి మార్గం సుగమమవుతుందన్నారుయువత నిరుత్సాహపడొద్దని ఆయన సూచించారు. “మీకోసమే నిర్దేశించినకచ్చితంగా మీరే చేయాల్సిన పనేదో ఒకటి ఉందిమీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపై దృష్టిపెట్టండిఅవకాశాలు వస్తాయి” అని పేర్కొన్నారుఓ లక్ష్యం కోసం జీవితాన్ని అంకితం చేయడం గొప్ప విషయమన్నారుఅది స్ఫూర్తిని నింపడంతోపాటు జీవితాన్ని అర్థవంతం చేస్తుందన్నారుఒత్తిడిఇబ్బందుల సమస్యలను ప్రస్తావిస్తూ.. పిల్లలను తమ ప్రతిష్ఠకు చిహ్నంగా భావించొద్దని తల్లిదండ్రులను కోరారుజీవితమంటే కేవలం పరీక్షలే కాదని అర్థం చేసుకోవాలని హితవు పలికారుతగిన విధంగా సన్నద్ధులు కావాలనితమ సామర్థ్యాలపై నమ్మకముంచాలనిఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థులకు ప్రధానమంత్రి సూచించారుపరీక్షల సమయంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే క్రమబద్ధమైన సమయపాలనక్రమం తప్పకుండా సాధన చేయడం అత్యావశ్యకమన్నారుప్రతీ వ్యక్తికీ ప్రత్యేకమైన సామర్థ్యాలుంటాయన్న తన నమ్మకాన్ని ఆయన పునరుద్ఘాటించారుతమపైనతమ సామర్థ్యాలపైన నమ్మకం ఉంచివిజయం సాధించాలని విద్యార్థులను కోరారు.

ఈ క్షణాన్ని ఆస్వాదించడం ముఖ్యమని స్పష్టం చేసిన ప్రధానమంత్రి.. అభ్యసన విధానాన్ని కూడా వివరించారు. “నేనెవరినైనా కలిస్తేఆ క్షణంలో పూర్తిగా లీనమవుతానుఇలా పూర్తిగా దృష్టి సారించడం వల్ల కొత్త ఆలోచనలను వెంటనే గ్రహించడానికి నాకు అవకాశముంటుంది” అని ఆయన అన్నారుఅందరూ దీనిని అలవరచుకోవాలని కోరారుఇది మెదడుకు పదును పెట్టి అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. ‘‘గొప్ప డ్రైవర్ల జీవిత గాథలు చదివినంత మాత్రాన డ్రైవింగులో మీరు నిపుణులు కాలేరుమీరు డ్రైవింగ్ సీటులో కూర్చుని రోడ్డు పైకి వెళ్లాల్సిందే’’ అంటూ సాధన చేయడం ఎంత ముఖ్యమైన అంశమో వివరించారుమరణం ఎన్నటికైనా తప్పదనిజీవితాన్ని ఆస్వాదించడం ముఖ్యమనిఓ లక్ష్యంతో జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలని శ్రీ మోదీ చెప్పారుఅనివార్యమైన మరణం గురించి భయాన్ని వీడాలన్నారు. ‘‘మీ జీవితాన్ని సుసంపన్నమూ సువ్యవస్థితమూ చేసుకోండిజీవితాన్ని ఉన్నతీకరించుకోండిదాంతోమృత్యువు తలుపు తట్టకమునుపే ఓ లక్ష్యంతో జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

నిరాశావాదంప్రతికూలతలు తన మనస్తత్వం కాదన్న ప్రధానమంత్రి.. భవిష్యత్తుపై ఆశాభావాన్ని వ్యక్తం చేశారుచరిత్ర నిండా సంక్షోభాలను అధిగమించిమార్పులను అందిపుచ్చుకుని మానవాళి నిలిచిన తీరును ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. “ప్రతీ యుగంలో నిరంతర స్రవంతిగా సాగే మార్పును అందిపుచ్చుకోవడం మానవ స్వభావం” అని ఆయన వ్యాఖ్యానించారుకాలం చెల్లిన ఆలోచన విధానాల నుంచి ప్రజలు బయటపడి మార్పును స్వీకరించగలిగితే అసాధారణ పురోగతి సాధ్యపడుతుందని స్పష్టం చేశారు

ఆధ్యాత్మికతధ్యానంసర్వ జనుల సంక్షేమంపై మాట్లాడుతూ.. గాయత్రీ మంత్ర ప్రాశస్త్యాన్ని శ్రీ మోదీ వివరించారుసూర్యుడి ప్రకాశవంతమైన తేజోశక్తికి సంకేతమైన గాయత్రీ మంత్రం ఆధ్యాత్మిక జాగరణకు శక్తిమంతమైన సాధనమని అభివర్ణించారుఅనేక హిందూ మంత్రాలు శాస్త్రయుతంగాప్రకృతితో విశేషంగా ముడిపడి ఉన్నాయనిప్రతిరోజూ వాటిని జపించడం వల్ల దీర్ఘకాలికశాశ్వత ప్రయోజనాలను పొందవచ్చని ఆయన వ్యాఖ్యానించారుధ్యానం ద్వారా మనో వ్యాకులతలను అధిగమించిఈ క్షణాన్ని ఆస్వాదించేలా చేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారుహిమాలయాల్లో గడిపిన నాటి ఓ అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారుఅక్కడ ఒక రుషి ఓ గిన్నె మీద పడే నీటి బిందువుల లయబద్ధమైన ధ్వనిపై దృష్టి పెట్టడం నేర్పించారుఈ అభ్యాసాన్ని ‘దైవిక ప్రతిధ్వని’గా ఆయన అభివర్ణించారుఏకాగ్రతను పెంపొందించడానికిదానిని ధ్యానంగా మలచుకోవడానికి ఇది ఆయనకు సహాయపడిందిహిందూ తత్వశాస్త్రాన్ని వివరిస్తూ.. జీవితంతో ముడిపడి ఉన్నసర్వ జనుల సంక్షేమాన్ని ఉద్దేశించే మంత్రాలను శ్రీ మోదీ ఉటంకించారుకేవలం తమ శ్రేయస్సుపై మాత్రమే హిందువులు ఎప్పుడూ దృష్టి పెట్టరు. అందరి శ్రేయస్సుసంక్షేమాలను మనం ఆకాంక్షిస్తాం” అన్నారుప్రతి హిందూ మంత్రం శాంతి ప్రార్ధనతో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారుజీవిత సారాన్నిరుషుల ఆధ్యాత్మిక అభ్యాసాన్ని అది సూచిస్తుందన్నారుతన భావాలను పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారుతనలో చాలాకాలంగా దాచుకున్న ఆలోచనలను పంచుకోవడానికిఅందరితో వ్యక్తీకరించడానికి ఈ సంభాషణ ద్వారా అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు

 

***


(Release ID: 2112104) Visitor Counter : 12