సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రాచీన భారతీయ జ్ఞాన కేంద్రాల పునరుద్ధరణ

Posted On: 10 MAR 2025 3:20PM by PIB Hyderabad

నలందాతక్షశిలవిక్రమశిల వంటి ప్రాచీన విద్యాలయాలను ధ్వంసం చేయడానికి విదేశీ ఆక్రమణదారులు ఎన్నెన్నో సార్లు ప్రయత్నాలు చేశారుఇన్ని దాడులు జరిగినప్పటికీ అనేక ఉపాయాలను అనుసరించడం ద్వారా జ్ఞానం తనను తాను కాపాడుకోగలిగింది.

1. ౌఖికగురు-శిష్య సంప్రదాయం

విద్యాబోధన రంగంలో అనేక పురాతన సంస్థలు జ్ఞాన వ్యాప్తి కోసం మౌఖిక మాధ్యమాన్నే ఎక్కువగా ఆశ్రయించాయిజ్ఞాన కేంద్రాలను ధ్వంసం చేసినా సరేపండితులు జ్ఞానాన్ని గురు-శిష్య పరంపర ద్వారా తరువాతి తరానికి అందించారు.

2. పండితుల వలస

నలందవిక్రమశిల వంటి సంస్థలపై దాడి జరిగిన సమయాల్లోపండితులు భిన్న ప్రాంతాలకు వలసపోయారువారితోపాటే జ్ఞానాన్ని కూడా తీసుకుపోయారుఅనేక మంది దక్షిణ భారతదేశానికిటిబెట్‌కుచైనాకుఆగ్నేయ ఆసియాకు వలసపోయారుఅలా చేసి వారి బోధన సామర్థ్యాలను స్వయంగా సంరక్షించడంతోపాటు వాటిని విస్తరించారు.

3. ధార్మిక సంస్థలుమఠాలు

దేవాలయాలతోపాటు బౌద్ధ సంఘారామాలుహిందూ సన్యాసి మఠాలు ద్వితీయ ప్రాధాన్య జ్ఞాన కేంద్రాల పాత్రను పోషించాయిసాధువులుపండితులు వారి పనిని రహస్యంగానోలేక ఇతరత్రా సురక్షిత స్థలాల్లోనో పూర్తి చేశారు. ఉదాహరణకుభారత్‌లో బౌద్ధం క్షీణతకు లోనైనప్పుడు భారతీయ మూలగ్రంథాలనుసంప్రదాయాలను టిబెట్‌లోని బౌద్ధ సంఘారామాలు జాగ్రతపరిచాయి.

4. విదేశీ అనువాదాలుఅధికార పత్రాలు

దండెత్తి వచ్చిన వారు గ్రంథాలయాలను దెబ్బతీయగాహుయాన్ సాంగ్అల్-బిరూని వంటి విదేశీ యాత్రికులు మన దేశ ప్రాచీన జ్ఞానసారాన్ని గ్రంథస్తం చేశారుభారతీయ మూల గ్రంథాలనేకం చైనాఅరేబియాపర్షియా భాషలలోకి అనువాదమైజ్ఞానం ఇండియా బయటా పరిరక్షణకు నోచుకొంది.

5తాళపత్రాలు- భూగర్భ గ్రంథాలయాలు

కొంతమంది విద్వాంసులు చేతిరాత పుస్తకాలను మారుమూల ప్రదేశాల్లోనో, భూమి లోపల సురక్షిత స్థానాల్లోనో దాచిపెట్టారుఈ కాలంలో సైతంపురాతన మూల గ్రంథాలు దేవాలయాల్లో గానిలేదా ప్రభుత్వేతర సేకరణల్లో గాని వెలుగుచూస్తూనే ఉన్నాయి.

6. విద్యాధ్యయనానికి పునర్జీవనం

విధ్వంసకాండ తరువాత సైతం భారత్‌లో విద్యాప్రాప్తి అనేక సార్లు పునరుద్ధరణకు నోచుకొందివారణాసికాంచీపురం వంటి కొత్త కొత్త జ్ఞానకేంద్రాలు పుట్టుకొచ్చిమేధోపరమైన సంప్రదాయాలను ముందుకు తీసుకుపోయాయి.

7. ఇతర సంస్కృతులతో సమైక్యం కావడం

భారతీయ గణితశాస్త్రవిజ్ఞానశాస్త్రతాత్విక జ్ఞానాన్ని ఇస్లామ్ఐరోపా పండితులు ఆకళింపు చేసుకొన్నారు. ‘సున్న’ పద్ధతిఆయుర్వేదం ప్రపంచ నాగరికతలలోకి చొచ్చుకుపోయాయిదీంతోసంస్థాగత నాశం చోటుచేసుకొన్నప్పటికీ కూడా ఇవి మాత్రం వాటి అస్తిత్వాన్నీఉనికినీ కోల్పోలేదు

ఈ తరహాలోప్రాచీన జ్ఞాన కేంద్రాలు భౌతిక దాడులకు గురికాగావాటి మేధో వారసత్వమూసాంస్కృతిక వారసత్వమూ ఈ ఆటుపోటులను తట్టుకొని అనుకూల స్థితులను వెతుక్కొనిరూపాల్ని మార్చుకొనివిస్తృత వ్యాప్తి మాధ్యమంతో నిలదొక్కుకున్నాయి.

భారత ప్రాచీన జ్ఞాన వ్యవస్థలనుకేంద్రాలను పూర్వ స్థితికి తీసుకురాగల అనేక కార్యక్రమాలను ఇందిరా గాంధీ ఆర్ట్స్ నేషనల్ సెంటర్ (ఐజీఎన్‌సీఏచేపట్టిందివాటిలో కొన్ని ఈ కింది విధంగా ఉన్నాయి:

1. వైదిక వారసత్వ పోర్టల్

వైదిక వారసత్వ పోర్టల్‌ను 2023 మార్చి 27న ప్రారంభించారుఇది ఐజీఎన్‌సీఏ ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకటివేదాల సంపన్న వారసత్వాన్ని పరిరక్షించడంతోపాటు వాటి సారాంశాన్ని వ్యాప్తి చేస్తుండడం దీని ఉద్దేశంఈ పోర్టల్ 18,000కు పైగా వైదిక మంత్రాలతో సహా 550 గంటలకు పైగా దృశ్యశ్రవణ సామగ్రిని అందిస్తుందిదీనిలో వేదాలుఉపనిషత్తులువేదాంగాలుఉపవేదాల వంటి ప్రాచీన గ్రంథాల నకళ్లుదృశ్యశ్రవణ.. రెండు రూపాల్లోనూ వైదిక అనుష్ఠానాల వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చారుఈ కార్యక్రమం సాంప్రదాయక వైదికజ్ఞానాన్ని పండితులుఅభ్యాసకులుసాధారణ ప్రజల కోసం సులభతరంగా తీర్చిదిద్ది అందించిఈ విధానంలో ఈ  జ్ఞానాన్ని పరిరక్షించడంతోపాటు ప్రచారం చేయడంలో సహాయపడుతుంది.

2. భారతీయ జ్ఞాన వ్యవస్థల (ఐకేఎస్కార్యక్రమం

జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగావిద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో భారతీయ జ్ఞాన వ్యవస్థల (ఐకేఎస్కార్యక్రమానికి ఐజీఎన్‌సీఏ అండదండలను అందిస్తోంది. 2020 అక్టోబరులో ఏర్పాటు చేసిన ఐకేఎస్ విభాగం భారతీయ సాంప్రదాయక జ్ఞానాన్ని ఇప్పటి విద్య వ్యవస్థలో ఓ భాగంగా చేయడంపై దృష్టిని కేంద్రీకరిస్తోంది. దీనిలో భాగంగా వైదిక గణితంఆయుర్వేదంయోగాప్రాచీన భారతీయ జ్ఞానం వంటి విషయాలను విశ్వవిద్యాలయాల పాఠ్యక్రమంలో చేరుస్తారుఐఐటీల వంటి సంస్థలతో సహకారాన్ని ఏర్పరుచుకోవడంతో  పాఠ్యక్రమాలను (కోర్సులు), పరిశోధన కార్యక్రమాలను రూపొందించగలిగారుఈ పాఠ్యక్రమాలుపరిశోధన కార్యక్రమాలు భారతీయ సంగీతానికీఇతర స్వదేశీ జ్ఞాన వ్యవస్థలకూ ఉన్న  చికిత్సలో సహకరించగల విలువలను అర్థం చేసుకోనిస్తున్నాయి.

3. ప్రాజెక్ట్ ‘మౌసమ్’

ఐజీఎన్‌సీఏ ప్రాజెక్టులలో ఒకటైన ‘మౌసమ్’ బహుళవిషయక కార్యక్రమంహిందూ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాల మధ్య ప్రాచీన చారిత్రకసముద్ర సాంస్కృతికఆర్థిక సంబంధాలను పునర్జీవింపచేయడంతోపాటు ఆ సంబంధాలను సుదృఢపరచడం ప్రాజెక్ట్ మౌసమ్ ఉద్దేశంఈ మార్గాలలో విస్తరించిన ఉమ్మడి జ్ఞాన వ్యవస్థలకుఆలోచనలకు గ్రంథస్తం చేయడంతోపాటు వాటిని ఉపయోగంలోకి తీసుకురావడం ద్వారాచాలా కాలం నుంచీ విడిపోయిన బంధాలను మళ్లీ జోడిండంతోపాటు సహకారంలోనూఇచ్చిపుచ్చుకోవడాల్లోనూ కొత్త అవకాశాలను పెంపొందించాలనేది కూడా ఈ ప్రాజెక్టు ఉద్దేశాల్లో ఒకటి.  

4. విద్యావిషయక కార్యక్రమాలుపరిశోధన

ఐజీఎన్‌సీఏ వేర్వేరు విద్యావిషయక పాఠ్యక్రమాలను అందిస్తోందివీటిలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు భాగంగా ఉన్నయిఇవి మన దేశ కళలుసంస్కృతిసాంప్రదాయక జ్ఞాన వ్యవస్థలపై విస్తృత అధ్యయనం చేసేందుకు అవకాశాలను అందిస్తుందిపరిశోధనప్రచురణలుశిక్షణల మాధ్యమాల ద్వారా ఈ కేంద్రం ప్రాచీన అలవాట్లుతత్వాలను తెలుసుకొనేందుకూవాటిని పునరుద్ధరించేందుకూ అనేక రకాలైన దృష్టికోణాలతో ముందుకు సాగాలని స్పష్టంచేస్తుంది.

ఈ కార్యక్రమాల ద్వారాఐజీఎన్‌సీఏ భారత ప్రాచీన జ్ఞాన కేంద్రాలువ్యవస్థల పునర్నిర్మాణంపునరుద్ధరణపునస్థాపనలో కీలక పాత్రను పోషిస్తోందిదీంతోపాటువర్తమానంలో వాటి ఉపయుక్తతనిరంతరత్వం కూడా కొనసాగేటట్లు చూస్తోంది.

భారత్‌లో ప్రాచీన జ్ఞాన వ్యవస్థలపై పరిశోధనకు దన్నుగా నిలవడానికి ఐజీఎన్‌సీఏ అనేక కార్యక్రమాలను చేపట్టిందివాటిలో కొన్ని:

1. విభాగం వారీ పరిశోధన కార్యక్రమాలు

ఐజీఎన్‌సీఏ వ్యవస్థాగత స్వరూపంలో భారత సాంస్కృతిక వారసత్వంలోని వివిధ అంశాలపై దృష్టిని సారించే ప్రత్యేక విభాగాలు భాగంగా ఉన్నాయి:

కళానిధిఇది మానవ విజ్ఞానశాస్త్రాలతోపాటు కళలపై పరిశోధనరిఫరెన్స్ సామగ్రిల భాండాగారంలా పనిచేస్తుందిపరిశోధక విద్యార్థులకు పాఠ్యదృశ్యశ్రవణ సంబంధ సమాచారాన్ని అందిస్తుంది.

కళాకోశఇది పరిశోధనప్రచురణలలో నిమగ్నమైందిఅనేక విభాగాల్లో మేధో సంప్రదాయాలను అన్వేషిస్తుందిదీనిద్వారా ప్రాచీన జ్ఞాన వ్యవస్థలను చక్కగా అర్థం చేసుకొనే సామర్థ్యం సిద్ధిస్తుంది.

జానపద సంపదదీనిని జీవనశైలి అధ్యయనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారుఈ విభాగం గిరిజన కళలుజానపద కళలపై ఒక పద్ధతి ప్రకారం పరిశోధనను నిర్వహిస్తుందిప్రత్యక్ష ప్రదర్శనలకు వీలు కల్పిస్తుంది.. దీంతోస్వదేశీ జ్ఞానాన్ని గ్రహించే సామర్థ్యాన్ని ఇది పెంచుతుందన్నమాట

కళాదర్శనపరిశోధనల్లో కనుగొనే విషయాలను ప్రదర్శనలను ఏర్పాటు చేయడం ద్వారా దృశ్య ప్రధాన నమూనాలలోకి మార్చడంప్రాచీన జ్ఞానాన్ని ప్రజల వినియోగం కోసం సులభతరంగా మలచడంమరింత విద్వత్తుతో కూడి ఉండే అన్వేషణను ప్రోత్సహించడం ఈ విభాగం ముఖ్య ఉద్దేశాలు.

కల్చరల్ ఇన్ఫర్మేటిక్స్ ల్యాబొరేటరిఈ విభాగం అరుదైన పాత దస్తావేజుల సేకరణలు ప్రధానంగా ఏర్పాటు చేసిన ఒక డిజిటల్ భాండాగారం అన్నమాటదీనిలో  సాంస్కృతిక పరిరక్షణ కోసంప్రచారం కోసం ఉద్దేశించిన సాంకేతిక ఉపకరణాలను వినియోగిస్తుంటారు. ‘కళాసంపద’ను విస్తరింపచేయాలన్నది కూడా దీని ముఖ్య ఉద్దేశాలలో ఒకటి.

2. ప్రాంతీయ కేంద్రాలు

పరిశోధనను వికేంద్రీకరించడానికీప్రాంతీయ సాంస్కృతిక అధ్యయనాలను ప్రోత్సహించడానికీ ఐజీఎన్‌సీఏ దేశవ్యాప్తంగా అనేక కేంద్రాలను ఏర్పాటు చేసిందివాటిలో వారణాసిగౌహతిబెంగళూరురాంచీపుదుచ్చేరిత్రిసూర్గోవావడోదరశ్రీనగర్ కూడా ఉన్నాయిఈ కేంద్రాలు స్థానిక కళారూపాలుసంప్రదాయాలుజ్ఞాన వ్యవస్థలపై దృష్టిని కేంద్రీకరిస్తూ ప్రాంతాల వారీ నిర్దిష్ట పరిశోధనపరిరక్షణ ప్రయత్నాలను ప్రోత్సహిస్తాయి.

3. సహకారపూర్వక పరిశోధన ప్రాజెక్టులు

వివిధ విభాగాల వారీ పరిశోధన ప్రధాన ప్రాజెక్టుల నిర్వహణకు వివిధ జాతీయసంస్థలతోనూఅంతర్జాతీయ సంస్థలతోనూ ఐజీఎన్‌సీఏ సహకారాన్ని అందిస్తోంది.

4. ప్రచురణలూప్రసారం

ఈ కేంద్రం ప్రాచీన జ్ఞాన వ్యవస్థలతో సంబంధం కలిగి ఉన్న పరిశోధన నివేదికలనూపదకోశాలనూనిఘంటువులనూవిజ్ఞాన సర్వస్వాలనూ ప్రచురిస్తోందిఈ ప్రచురణలు ప్రపంచమంతటా పరిశోధక విద్యార్థులకూపండితులకూ విలువైన సాయాన్ని సమకూరుస్తున్నాయిఅంతేకాక ఇవి భారతదేశ సంపన్న మేధో సంప్రదాయాలపై ప్రపంచ తార్కిక దృక్పథానికి తమ వంతు తోడ్పాటును అందిస్తున్నాయి.

ఈ తరహా సమగ్ర కార్యక్రమాలను చేపట్టి ఐజీఎన్‌సీఏ ప్రాచీన జ్ఞాన వ్యవస్థలకు సంబంధించిన పరిశోధనలను ప్రోత్సహించడంలో ఒక ప్రధాన పాత్రను పోషిస్తూవాటిని పదిలపరచడంతోపాటు వాటి మనుగడ కొనసాగేటట్లు చూస్తోంది.

ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ రోజు లోక్ సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(Release ID: 2110232) Visitor Counter : 12


Read this release in: Tamil , English , Urdu , Hindi