రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారతీయ తీర రక్షకదళానికి శౌర్య పతకాలు, విశిష్ట సేవ పతకాలు, ప్రతిభాన్విత సేవా పతకాలు రక్షణ మంత్రి చేతుల మీదుగా మొత్తం 32 పతకాల ప్రదానం


బలవత్తరమైన, విశ్వసనీయమైన, ప్రపంచంలో అత్యంత సమర్థ సముద్ర దళాల్లో ఒకటిగా ఐసీజీ ఎదిగింది: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

* సాధారణ, అసాధారణ ముప్పు విషయంలో సముద్ర బలగాలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ మంత్రి ఉద్బోధ

प्रविष्टि तिथि: 25 FEB 2025 1:25PM by PIB Hyderabad

భారతీయ తీర రక్షక దళం (ఇండియన్ కోస్ట్ గార్డ్.. ‘ఐసీజీ’) 18వ న్వెస్టిచర్ వేడుకని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించగాకేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుఆయన ఐసీజీ సిబ్బందికి శౌర్య పతకాలనువిశిష్ట సేవ పతకాలనుప్రతిభాన్విత సేవ పతకాలను ప్రదానం చేశారుమొత్తం 32 పతకాలు.. వాటిలో రాష్ట్రపతి తట్‌రక్షక్ మెడల్స్ (విశిష్ట సేవ), 11 తట్‌రక్షక్ మెడల్స్ (శౌర్యానికి)తోపాటు 15 తట్‌రక్షక్ మెడల్స్ (ప్రతిభావంతమైన సేవకుకలిసి ఉన్నాయి. 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఆదర్శనీయ సేవపరాక్రమభరిత కార్యాలువిధినిర్వహణలో అంకితభావాన్ని.. అదీనూ సవాళ్లతో కూడినతీవ్ర స్థితిగతుల్లో చాటిన సిబ్బందికి అందజేశారు.

List of Awardees of PTM & TM

(పీటీఎమ్టీఎమ్ పురస్కారాలు గెలుచుకొన్నవారి జాబితా)

సిబ్బందికి అభినందనలను తెలియజేస్తూ…ఈ పతకాలు కేవలం మెమెంటోలు కాదనీఅవి మన త్రివర్ణ పతాకం గౌరవాన్ని కాపాడడానికి ప్రదర్శించే శౌర్యానికీదృఢత్వానికీఅచంచల సంకల్పానికీ ప్రతీకలనీ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. తీరప్రాంతాల్లో భద్రతకు హామీపడడంసంస్థాగత దక్షతమాదక ద్రవ్యాల జప్తుసహాయక కార్యకలాపాలుఅంతర్జాతీయ విన్యాసాల్లో పాలుపంచుకొంటున్న సిబ్బంది కృషిని ఆయన ప్రశంసించారు.  

ఐసీజీ బలమైనవిశ్వసనీయమైనప్రపంచంలోకెల్లా అత్యంత సమర్థ సముద్ర బలగాల్లో ఒకటిగాను వర్ధిల్లుతోందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రధానంగా చెప్పారుఆయన తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ, ‘‘భౌగోళికంగా భారతదేశానికి మూడు పక్కలా సముద్రం ఉందితీరప్రాంతం సైతం సువిశాలంగా ఉందిమన దేశానికి వ్యూహాత్మక భద్రతకు రెండు విధాలైన ముప్పులు పొంచి ఉన్నాయిమొదటి ముప్పు యుద్ధందీనిని సాయుధ దళాలు ఎదుర్కోవలసి వస్తోందిరెండో ముప్పు సముద్రంలో జరిగే దోపిడీలుఉగ్రవాదంచొరబాట్లుదొంగరవాణాచట్టవిరుద్ధంగా జరిగే చేపల వేటవీటితో సముద్ర బలగాలువిశేషించి భారతీయ తీర రక్షకదళం (ఐసీజీసదా అప్రమత్తంగా ఉంటూ తలపడుతుంటాయిఐసీజీ ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి క్రియాత్మకంగా పనిచేస్తోందివ్యూహాత్మక భద్రతకు అవసరమైన జాగ్రత్తచర్యలను తీసుకోవడంలో ఐసీజీ కీలక పాత్రను పోషిస్తోంది’’ అన్నారు.   

గత సంవత్సర కాలంలోసముద్ర సంబం సురక్షభద్రతలతోపాటు మానవతదృక్పథంతో చేపట్టే పనులు.. వీటిలో ఐసీజీ చెప్పుకోదగ్గ విజయాలను సాధించిందిఈ దళం 14 పడవలతోపాటు 115 సముద్ర దొంగలను పట్టుకొందిదీనికి అదనంగా దాదాపు రూ.37,000 కోట్ల విలువ చేసే మాదకపదార్థాలను స్వాధీనం చేసుకొందిఐసీజీ వివిధ సహాయక కార్యకలాపాల్లో పాల్గొని 169 మంది ప్రాణాలను కాపాడిందిఅంతేకాక తీవ్రంగా గాయపడ్డ 29 మందికి వైద్యసహాయాన్ని అందించింది.

ఈ విజయాలు ఒక్క గణాంక సమాచారం మాత్రమే కాదు. ఇవి ఐసీజీ మన దేశ ప్రజల భద్రత విషయంలో చూపుతున్న ధైర్య సాహసాలకుఅంకితభావానికి సంబంధించిన గాధ అని రక్షణ మంత్రి కొనియాడారునౌకావాణిజ్యం సాగే సరిహద్దులలో అప్రమత్తంగా ఉంటూచట్టవిరుద్ధ చొరబాట్లను అడ్డుకోవడం ఒక్కటే కాకుండా దేశ సార్వభౌమత్వంపైనాఆంతరంగిక భద్రత పైనా సానుకూల ప్రభావం కలిగించడంలో కూడా ఐసీజీ తోడ్పడుతోందని ఆయన అన్నారుఅత్యాధునిక సాంకేతిక పురోరగతి కారణంగా సంప్రదాయేతర ముప్పులు తలెత్తుతున్నాయని మంత్రి చెబుతూఒక పక్క నుంచి సంప్రదాయక ముప్పులకు తోడు సైబర్ దాడులుసమాచార చౌర్యంసిగ్నళ్లను పనిచేయనివ్వకపోవడంరాడార్ సేవలను అడ్డగించడంజీపీఎస్ స్పూఫింగ్ వంటి సవాళ్ల పట్ల సైతం సముద్ర బలగాలు ప్రత్యేకించి ఐసీజీ జాగరూకతతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.

దేశ భద్రత వ్యవస్థ దృఢంగానురక్షణ బలగాలు బలంగాను ఉన్నప్పుడే  ‘సురక్షితసమృద్ధ భారత్’ దార్శనికతను సాకారం చేసుకోగలుగుతామని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారుభారతీయ తీర రక్షక దళం సామర్థ్యాన్ని పెంపొందింపచేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ తీర రక్షకదళానికి రూ. 9,676.70 కోట్లు కేటాయించారుఇది అంతకు ముందటి సంవత్సరం బడ్జెటు కన్నా 26.50 శాతం ఎక్కువఐసీజీని ఆధునీకరించడంలో ఇది ఒక కీలక నిర్ణయందీనికి అదనంగావిధులను అతి వేగంతో నిర్వహించే కాపలా నౌకలు 14, ఎయిర్ కుషన్ వెహికల్స్ 6, ఇంటర్‌సెప్టర్ బోట్లు 22, తీరానికి దూరంగా కావలి కాసే నవ తరం నౌకలు 6, ఇలాంటివే విధులను అతి వేగంతో నిర్వహించే కాపలా నౌకలు 18... వీటినన్నింటినీ కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించారనిదీని ఉద్దేశం ఐసీజీని సుదృఢం చేయడమే’’ అనీ ఆయన వివరించారు.

డిజిటల్ కోస్ట్ గార్డ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన ఘట్టాన్ని పూర్తి చేయడాన్ని రక్షణ మంత్రి అభినందించారుసాంకేతికంగా పురోగమన పథంలో పయనించడంపై ఐసీజీ తీసుకొంటున్న శ్రద్ధను కూడా ఆయన మెచ్చుకొన్నారుఈ ప్రయత్నాలన్నీ సాధారణఅసాధారణ ముప్పులకు దీటుగా నిలవడంలో ఐసీజీని పటిష్టపరుస్తాయని ఆయన అంటూఈ లక్ష్యాన్ని సాధించడంలో ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీనిచ్చారు.  

కార్యక్రమం మొదలవడానికన్నా ముందురక్షణ మంత్రి గౌరవ వందనాన్ని స్వీకరించారుఇది ఈ సందర్భానికున్న గంభీరత్వానికీప్రాముఖ్యానికీ అద్దం పట్టిందిపురస్కార విజేతలువారి కుటుంబ సభ్యులు శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారుఇది ఈ కార్యక్రమానికి చక్కని ముగింపును సూచించిందిఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేఠ్రక్షణ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ఐసీజీ డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణిలతోపాటు ఐసీజీరక్షణ మంత్రిత్వ శాఖలతోని ఇతర ఉన్నతాధికారులువిజేతల కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు.  

 

***


(रिलीज़ आईडी: 2106135) आगंतुक पटल : 81
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil