సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఏసీఎస్‌ల కోసం ఒకే విధమైన సాఫ్ట్‌వేర్

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2025 3:21PM by PIB Hyderabad

 కేంద్ర ప్రభుత్వం రూ.2,516 కోట్ల వ్యయంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్కంప్యూటరీకరణ ప్రాజెక్టును చేపట్టిందిఅన్ని పీఏసీఎస్‌లను ఈఆర్‌పీ (ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ఆధారితంగా పని చేసే ఉమ్మడి నేషనల్ సాఫ్ట్‌వేర్‌ ద్వారా అనుసంధానం చేస్తున్నారురాష్ట్ర సహకార బ్యాంకులు (ఎస్‌టీసీబీలు), జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీలుద్వారా నాబార్డుతో కలుపుతున్నారుఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయి ఉమ్మడి సాఫ్ట్‌వేర్‌ను నాబార్డ్‌ రూపొందించిందిఈ ఏడాది జనవరి 27 నాటికి 50,455  పీఏసీఎస్‌లను ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్‌తో కలిపారు.

పీఏసీఎస్‌ల మోడల్ బై-లాస్‌లో పేర్కొన్న 25 కన్నా ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలకు ఒక సమగ్ర ఈఆర్‌పీ పరిష్కారాన్ని అందించాలన్నదే పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించడంలోని ముఖ్య ఉద్దేశం.  ఈ కార్యకలాపాల్లో స్వల్పకాల రుణాలకుమధ్యకాలిక రుణాలకుదీర్ఘకాలిక రుణాలకు సంబంధించిన ఆర్థిక సేవలుకొనుగోలు కార్యకలాపాలుప్రజా పంపిణీ దుకాణాల (పీడీఎస్కార్యకలాపాలువ్యాపార ప్రణాళికగోదాములకు సంబంధించిన కార్యకలాపాలుమర్చంటైజింగ్అప్పులు తీసుకోవడంఆస్తుల నిర్వహణమానవ వనరుల నిర్వహణ వంటి విభిన్న మాడ్యూళ్లున్నాయి.

ఇంతవరకు 30 రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల్లో 67,930 పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ ప్రతిపాదనలకు అనుమతినిచ్చారుదీనికోసం ఆయా రాష్ట్రాలకుకేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ741.34 కోట్లను ఇచ్చారుఈ ప్రాజెక్టులో భాగం పంచుకొనే రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలు వాటి వాటి అవసరాలకు అనుగుణంగా ఈఆర్‌పీ సాఫ్ట్ వేర్‌లో మార్పుచేర్పులు చేయించుకొనేందుకు వీలుంటుంది.

ఉమ్మడి అకౌంటింగ్ వ్యవస్థ (సీఏఎస్)మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్)ల మాధ్యమాలను ఈఆర్‌పీ ఆధారిత ఉమ్మడి నేషనల్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించుకొంటూ పీఏసీఎస్‌ల పనితీరులో సమర్ధతను పెంచుతుందిదీనికి తోడుపీఏసీఎస్‌లలో పాలనపారదర్శకతలు కూడా మెరుగుపడతాయిరుణాలను త్వరత్వరగా ఇవ్వడానికీలావాదేవీలకయ్యే ఖర్చును తగ్గించడంతోపాటు చెల్లింపుల్లో అసమానతల్ని  తగ్గించడానికీ ఇది తోడ్పడుతుందిరాష్ట్ర సహకార బ్యాంకులతోజిల్లా కేంద్ర సహకార బ్యాంకులతో అకౌంటింగ్ (ఖాతాల తనిఖీ)లో ఇబ్బందులు తొలగుతాయిఇది పీఏసీఎస్‌ల పనితీరుపై రైతుల్లో విశ్వసనీయతను పెంచగలుగుతుందిఇలా ‘‘సహకార్ సే సమృద్ధి’’ దృష్టికోణాన్ని సాకారం చేయడంలో తోడ్పాటు లభిస్తుంది.

లోక్‌సభలో ఒక ప్రశ్నకు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ ఈ విషయాల్ని తెలియజేశారు. 


(రిలీజ్ ఐడి: 2102774) సందర్శకుల సూచీ సంఖ్య : : 51
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil