ప్రధాన మంత్రి కార్యాలయం
మహర్షి దయానంద సరస్వతి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధానమంత్రి
Posted On:
12 FEB 2025 2:24PM by PIB Hyderabad
సుప్రసిద్ధ ఆలోచనాపరుడు, సంఘ సంస్కర్త, జాతీయవాదీ అయిన మహర్షి దయానంద సరస్వతి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధాని సందేశమిస్తూ...
“గొప్ప ఆలోచనాపరుడు, సంఘ సంస్కర్త, జాతీయవాది మహర్షి దయానంద సరస్వతి జయంతి సందర్భంగా వారికి కోటి నమస్సులు. సమాజంలోని అజ్ఞానం, అంధవిశ్వాసాలు, ఆడంబరాలకు వ్యతిరేకంగా ప్రజలని జాగరూకులను చేసేందుకు ఆయన తన మొత్తం జీవితాన్ని వెచ్చించారు. విద్య, మహిళా సాధికారత సహా భారతీయ సంస్కృతీ వారసత్వాలను కాపాడేందుకు ఆయన చేసిన కృషి దేశవాసులకు నిరంతరం ప్రేరణను కలిగిస్తూనే ఉంటుంది” అని పేర్కొన్నారు.
***
MJPS/SR/SKS
(Release ID: 2102348)
Visitor Counter : 30
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam