సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహాకుంభ్ 2025: ప్రయాగరాజ్ త్రివేణీ సంగమం వద్ద ఇప్పటి వరకూ 40 కోట్లకు పైగా భక్తుల పవిత్ర స్నానాలు

Posted On: 07 FEB 2025 4:20PM by PIB Hyderabad

మహాకుంభ్ 2025 లో భాగంగాఈ రోజు ఉదయం10 గంటల సమయానికి ప్రయాగరాజ్ వద్ద పవిత్ర స్నానం ఆచరించిన భక్తుల సంఖ్య 42 కోట్లను దాటిందికుంభమేళా ముగిసేనదుకు మరో 19 రోజులు మిగిలి ఉండటంతో ఈ సంఖ్య 50 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నారు.

విభిన్న సంస్కృతుల సమాహారం - మహాకుంభ్

మకర సంక్రాంతిమౌని అమావాస్యవసంత పంచమి పర్వదినాల సందర్భంగా చేసిన మూడు అమృత స్నానాల తరువాత కూడా భక్తుల్లో పవిత్ర నదీ స్నానం పట్ల ఆసక్తి ఎంత మాత్రం తగ్గుముఖం పట్టలేదుదేశంప్రపంచం నలుమూలాల నుంచీ ప్రయాగరాజ్ కు చేరుకుంటున్న భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు తరలివస్తున్నారువీరిలో కోటి మందికి పైగా కల్పవాసీలుభక్తులుసాధువులు కూడా ఉన్నారు.  

భక్తజన సందోహం

మౌని అమావాస్య నాడు అత్యధిక సంఖ్యలో కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానం ఆచరించగామకర సంక్రాంతి నాడు 3.5 కోట్ల మంది త్రివేణీ సంగమం వద్ద మునక వేశారుఇక జనవరి 30, ఫిబ్రవరి 1న కోట్ల మందిపౌష్య పౌర్ణమి నాడు 1.7 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారువసంత పంచమి పర్వదినం నాడు 2.5 కోట్ల మంది త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలను ఆచరించారు.  

ఇప్పటివరకూ పవిత్రస్నానం ఆచరించిన ప్రముఖులు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీహోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షారక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ (తన మంత్రివర్గ సహచరులతో సహా), ఇతర ప్రముఖ నేతలూ ఇప్పటి వరకూ సంగమంలో పవిత్ర స్నానం చేసిన వారిలో ఉన్నారుఫిబ్రవరి 10 వ తేదీన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానం ఆచారిస్తారని భావిస్తున్నారు.

పవిత్ర స్నానమాచరించిన ఇతర ప్రముఖులుఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్రాజస్థాన్ గవర్నర్ శ్రీ భజన్ లాల్ శర్మహర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయాబ్ సింగ్ సైనీమణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ బీరేన్ సింగ్గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ఇక కేంద్ర మంత్రులు శ్రీ గజేంద్ర సింగ్ షఖావత్శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్శ్రీ శ్రీపాద నాయక్ కుంభమేళాలో పవిత్ర స్నానాలను పూర్తి చేసుకున్నారుపార్లమెంట్ సభ్యులు డాక్టర్ సుధాంశు త్రివేదిశ్రీమతి సుధా మూర్తిశ్రీ రవి కిషన్ లు కూడా పుణ్య స్నానాలు చేశారు.    

సీనియర్ బీజేపీ నేతలు శ్రీ రవిశంకర్ ప్రసాద్సమాజవాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ అఖిలేష్ యాదవ్ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ప్రముఖ కవి కుమార్ విశ్వాస్క్రికెటర్ సురేష్ రైనాఅంతర్జాతీయ కుస్తీ యోధుడు ఖాలీనృత్య దర్శకుడు రెమో డిసూజా తదితరులు ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభ్ లో ప్రవిత్ర స్నానాలు ఆచరించారు.  

 

***


(Release ID: 2100879) Visitor Counter : 41