సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సమగ్ర సాంస్కృతిక సమాచారం కోసం జాతీయ కార్యక్రమం

Posted On: 03 FEB 2025 4:22PM by PIB Hyderabad

సుసంపన్నమైన భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికిప్రోత్సహించడానికి నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్ (ఎన్ఎంసీఎం)ను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందిభారతీయ సాంస్కృతిక వారసత్వాన్నిగ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేయడంలో దాని ప్రభావాన్ని నమోదు చేయడమే లక్ష్యంగా ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (ఐజీఎన్‌సీఏదీన్ని అమలు చేస్తుంది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జూన్ 2023లో మేరా గావ్ మేరీ ధరోహర్ (ఎంజీఎండీ(https://mgmd.gov.in/పోర్టల్‌ను ఎన్ఎంసీఎం ప్రారంభించిందిభారత్‌లోని 6.5 లక్షల గ్రామాల సాంస్కృతిక వారసత్వాన్ని నమోదు చేయడమే ఈ కార్యక్రమ ప్రధానోద్దేశంఇప్పటి వరకు 4.5 లక్షల గ్రామాల సాంస్కృతిక వివరాలు పోర్టల్లో నమోదు చేశారు.

మౌఖిక సంప్రదాయాలునమ్మకాలుఆచారాలుచారిత్రక ప్రాధాన్యంకళారూపాలుసంప్రదాయ ఆహారంప్రముఖ కళాకారులుఉత్సవాలుపండగలుసంప్రదాయ వస్త్రధారణనగలుస్థానికంగా పాముఖ్యం పొందిన ప్రదేశాల వివరాలను ఎంజీఎండీ పోర్టల్లో నమోదు చేస్తారు.

భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు గ్రామీణ సమాజాలు సాధికారత సాధించే దిశగా వేసిన కీలకమైన ముందడుగే ఎన్ఎంసీఎంసాంస్కృతిక అంశాలను నమోదు చేయడంవాటిని ప్రోత్సహించడం ద్వారా సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేసి ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.

విభిన్నమైన సాంస్కృతిక విభాగాలుకళాకారులుసంప్రదాయ కళారూపాలను గుర్తించడంవాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ప్రత్యేక విధానాన్ని ఎంజీఎండీ పోర్టల్ అనుసరిస్తోంది.

దేశంలోని 6.5 లక్షల గ్రామాల సమాచారాన్ని సేకరించిఎంజీఎండీ పోర్టల్లో అప్లోడ్ చేయడమే ఈ కార్యక్రమ ప్రస్తుత లక్ష్యంసాంస్కృతిక మ్యాపింగ్ ద్వారా సంస్కృతి ప్రతిభ ఖోజ్నేషనల్ కల్చరల్ వర్క్ ప్లేస్సమాచార లేఖపత్రికబుక్‌లెట్లుప్రకటనమీడియాప్రచారంకథన రచన తదితరమైనవి ఈ కార్యక్రమంలో ప్రధానాంశాలుగా ఉన్నాయి.

లోక్ సభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సమాచారమిచ్చారు.

 

***


(Release ID: 2099376) Visitor Counter : 12


Read this release in: English , Urdu , Hindi , Punjabi