మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశువుల వ్యాక్సిన్ ఆవిష్కరణపై హైదరాబాద్ లో శాస్త్రీయ సదస్సు

Posted On: 11 JAN 2025 1:54PM by PIB Hyderabad

మత్స్యపశుసంవర్ధకపాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీసహకారంతో 2025 జనవరి 10న హైదరాబాద్ లో అంటువ్యాధుల సన్నద్ధతవ్యాక్సిన్ ఆవిష్కరణపై సదస్సు నిర్వహించారు.

నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్)  ప్రొఫెసర్ డాక్టర్ వినోద్ కె పాల్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  భవిష్యత్తులో వచ్చే వైరస్ మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పశువైద్య మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారుఇందులో భాగంగా కొత్తగా వ్యాపిస్తున్న వ్యాధులను ముందుగానే గుర్తించి వేగంగా ప్రతిస్పందించేలా రోగనిర్ధారణ సౌకర్యాలను పెంచాలని అన్నారుతదుపరి తరం జంతు వ్యాక్సిన్ల అభివృద్ధిఉత్పత్తి కోసం అధునాతన వేదికలను ఏర్పాటు చేయాల్సిన ప్రాముఖ్యతను ఆయన వివరించారుఇవి జంతు సాంక్రామిక వ్యాధుల వ్యాప్తిని నివారించడానికిజంతుమానవ ఆరోగ్యాన్ని రక్షించడానికి కీలకమైనవిఈ క్లిష్టమైన అంశాలను బలోపేతం చేయడం అనేది వన్ హెల్త్ విధానం కింద సుస్థిర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించే విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని ఆయన అన్నారు.

పశుసంవర్ధకపాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి శ్రీమతి అల్కా ఉపాధ్యాయ మాట్లాడుతూమెరుగైన ఉత్పాదకత కోసం ప్రభుత్వం జంతువుల ఆరోగ్యంపై ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉందనిఅంతేవాసుల వరకు సమర్థవంతంగా వ్యాక్సిన్ సరఫరా చేయడానికి సరఫరా,  కోల్డ్ చైన్ వ్యవస్థలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

పశుసంవర్ధక శాఖ కమిషనర్ డాక్టర్ అభిజిత్ మిత్రా తన ప్రసంగంలో,  టీకా భద్రతజంతు టీకాలకు ముందస్తు అర్హతలను నిర్ధారించాల్సిన అవసరాన్ని వివరించారు

వ్యాక్సినేషన్ కార్యక్రమాలను మెరుగుపరచడంపశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంమహమ్మారి సిద్ధత కోసం ధృడమైన సరఫరా వ్యవస్థలను నిర్మించడంమహమ్మారి స్పందనలను బలోపేతం చేయడంవ్యాధి పర్యవేక్షణను పటిష్టం చేయడంవ్యాక్సిన్ పరీక్షలను సులభతరం చేయడంఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు అభివృద్ధికణజన్యు చికిత్స వ్యాక్సిన్లుఅలాగే ఆమోదానికి సంబంధించిన నియంత్రణ మార్గాల పై దృష్టితో ఈ సదస్సు “వన్ హెల్త్” కు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్రమైన అవగాహన పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.  

ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకపాడిపరిశ్రమ శాఖ సంయుక్త కార్యదర్శి (పశు ఆరోగ్యంరామ శంకర్ సిన్హాఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.ఆనంద్ కుమార్కేంద్ర పర్యావరణఅటవీవాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ జూ అథారిటీ మెంబర్ సెక్రటరీ డాక్టర్ సంజయ్ శుక్లాడాక్టర్ బీఆర్ గులాటీడైరెక్టర్ ఎన్ఐవీడీఇంకా ఆరోగ్య రంగ నిపుణులువ్యాక్సిన్ పరిశ్రమసీడీఎస్సీఓ తదితర రంగాలకు చెందిన భాగస్వాములు ఈ సదస్సులో పాల్గొన్నారు.

భారతదేశం గ్లోబల్ వ్యాక్సిన్ హబ్

60 శాతానికి పైగా వ్యాక్సిన్లు భారత్ లో తయారవుతుండగా, 50 శాతానికి పైగా వ్యాక్సిన్ తయారీదారులు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి మద్దతుతో పశుసంవర్థకపాడిపరిశ్రమ శాఖ పశువులలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందిఫుట్ అండ్ మౌత్ వ్యాధి నిరోధానికి టీకాలు వేయడానికి (102 కోట్ల టీకాలు పూర్తయ్యాయి) (డబ్ల్యుఓఎహెచ్ ఆమోదం పొందిందిబ్రూసెల్లోసిస్ (4.23 కోట్ల టీకాలు పూర్తయ్యాయి), పెస్టే డెస్ పెటిట్స్ రుమినాంట్స్ (పిపిఆర్) (17.3 కోట్ల టీకాలు పూర్తయ్యాయి), క్లాసికల్ స్వైన్ ఫీవర్ (0.59 కోట్ల టీకాలు పూర్తయ్యాయి). దీని కింద ప్రతి ప్రతి పశువుకూ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యుఐడిఇచ్చి భారత పశుధన్ అంటే నేషనల్ డిజిటల్ లైవ్‌స్టాక్ మిషన్‌లో నమోదు చేస్తారుఇది టీకా షెడ్యూల్ ను ట్రాక్ చేస్తుందిఅమలును నిర్ధారిస్తుందిఇటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాలు దేశంలో ప్రధాన పశు సంబంధ వ్యాధుల వ్యాప్తి గణనీయంగా తగ్గడానికి దారి తీసింది .

 

***


(Release ID: 2092250) Visitor Counter : 56
Read this release in: English , Urdu , Hindi , Tamil