సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటులో ప్రశ్న: ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన (పీఎం-అజయ్) పథకం

Posted On: 04 DEC 2024 2:44PM by PIB Hyderabad

ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన (పీఎం-అజయ్) 2021-22 నుంచి అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకంస్థూలంగా ఈ పథకంలో మూడు భాగాలున్నాయి (i) ‘ఆదర్శ గ్రామం, (ii) ‘షెడ్యూల్డ్ కులాల సామాజికఆర్థిక అభ్యున్నతి కోసం జిల్లా/రాష్ట్ర స్థాయి ప్రాజెక్టులకు ఆర్థికసాయం(iii) ‘వసతిగృహం

ఈ పథకం లక్ష్యాలుపాత్ర:

  • ఎస్సీలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో తగిన మౌలిక సదుపాయాలుఅవసరమైన సేవలు అందించడం ద్వారా సామాజిక-ఆర్థిక అభివృద్ధి సూచీలను మెరుగుపరచడం.

  • నైపుణ్యాభివృద్ధిఆదాయ కల్పన పథకాలుఇతర కార్యక్రమాల ద్వారా అదనపు ఉపాధి అవకాశాలను కల్పించి ఎస్సీ వర్గాల్లో పేదరికాన్ని తగ్గించడం.

  • నాణ్యమైన సంస్థాగత ఏర్పాట్ల ద్వారా తగిన నివాస సదుపాయాల కల్పనతోపాటు అవసరమైన చోట్ల.. ప్రత్యేకంగా అభిలషణీయ జిల్లాలు/ఎస్సీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలుఇతర ప్రదేశాల్లో ఆవాస పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా అక్షరాస్యతను పెంచడంపాఠశాలలుఉన్నత విద్యాసంస్థల్లో ఎస్సీల నమోదును పెంచడం.

2021-22 నుంచి 5185 మంది లబ్ధిదారులకు మొత్తం 46 హాస్టళ్లు మంజూరయ్యాయి. పీఎం-అజయ్ లో హాస్టల్ విభాగానికి రూ.126.30 కోట్లు విడుదలయ్యాయి.

కేంద్ర సామాజిక న్యాయంసాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రాందాస్ అథవాలే రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.  

 

***


(Release ID: 2080894) Visitor Counter : 105