ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ గురు నానక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
15 NOV 2024 8:44AM by PIB Hyderabad
ఈ రోజు శ్రీ గురు నానక్ జయంతి. ఈ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణ, దయ, వినయం.. ఈ భావనలను పెంపొందింప చేసుకోవడానికి మనకు శ్రీ గురు నానక్ దేవ్ జీ బోధనలు ప్రేరణను అందిస్తూనే ఉంటాయని ప్రధాని అన్నారు.
సామాజిక ప్రసార మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘కరుణ, దయ, వినయం.. ఈ భావనలను పెంపొందింప చేసుకోవడానికి మనకు శ్రీ గురు నానక్ దేవ్ జీ బోధనలు స్ఫూర్తిదాయకంగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా సమాజానికి మనం సేవ చేయడానికి, ఈ భూమిని మరింత ఉత్తమమైందిగా తీర్చిదిద్దడానికి కూడా శ్రీ గురు నానక్ దేవ్ జీ బోధనలు మనకు ప్రేరణను అందించాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’
“ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੀਆਂ ਲੱਖ-ਲੱਖ ਵਧਾਈਆਂ। ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੀਆਂ ਸਿੱਖਿਆਵਾਂ ਸਾਨੂੰ ਦਇਆ, ਦਿਆਲਤਾ ਅਤੇ ਨਿਮਰਤਾ ਦੀ ਭਾਵਨਾ ਨੂੰ ਅੱਗੇ ਵਧਾਉਣ ਲਈ ਪ੍ਰੇਰਿਤ ਕਰਨ। ਇਹ ਸਾਨੂੰ ਸਮਾਜ ਦੀ ਸੇਵਾ ਕਰਨ ਅਤੇ ਸਾਡੀ ਧਰਤੀ ਨੂੰ ਬਿਹਤਰ ਬਣਾਉਣ ਲਈ ਵੀ ਪ੍ਰੇਰਿਤ ਕਰਨ।“
***
MJPS/SR
(రిలీజ్ ఐడి: 2073776)
సందర్శకుల సూచీ సంఖ్య : : 77
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam