రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

60 శాతం దేశీయ పరిజ్ఞానంతో గోవా షిప్ యార్డ్ నిర్మించిన వేగంగా ప్రయాణించగల రెండు గస్తీ నౌకలను ప్రారంభించిన తీర రక్షక దళం

प्रविष्टि तिथि: 28 OCT 2024 4:41PM by PIB Hyderabad

60 శాతం దేశీయ పరిజ్ఞానంతోగోవా షిప్ యార్డ్ (జీఎస్ఎల్నిర్మించినవేగంగా ప్రయాణించగల రెండు (ఎఫ్పీవీగస్తీ నౌకలు – ‘అదమ్య’, ‘అక్షర్’ లను భారత తీర రక్షక దళం (ఐసీజీనేడు ప్రారంభించిందిరూ. 473 కోట్ల ఖర్చుతో ఎనిమిది ఎఫ్పీవీల నిర్మాణానికి గోవా షిప్ యార్డ్తీరరక్షక దళాల మధ్య ఒప్పందం కుదిరిందితీరరక్షక దళ రక్షణపర్యవేక్షణనిఘా అవసరాల్లో ఉపయోగపడే ఈ నౌకలు.. దేశానికి చెందిన సముద్ర ఆస్తులనూద్వీపాలనూ కాపాడేందుకు సహాయపడతాయి.

 

ఒక్కో ఎఫ్పీవీ రకం నౌక 52 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు, 320 టన్నుల బరువుతోగంటకు 27 మైళ్ళ వేగాన్ని కలిగినౌకాయాన పరిస్థితులకు అనువుగా వేగాన్ని మార్చుకోగలిగే చోదన వ్యవస్థను కలిగి ఉంటాయిఐసీజీ ప్రత్యేక అవసరాల దృష్ట్యా తయారైన ఈ నౌకలు... అమెరికా షిప్పింగ్ బ్యూరోభారత నౌకాయాన రిజిస్టర్ అనే రెండు రకాల అత్యున్నత ప్రమాణాలకు లోబడి వీటిని నిర్మించారు.

 

షిప్ లిఫ్ట్ సిస్టమ్’ అనే అత్యాధునిక సాంకేతికత సాయంతోతొలిసారిగా రెండు నౌకల్నీ ఏకకాలంలో జలప్రవేశం చేయించారుఐసీజీ డైరెక్టర్ జనరల్ పరమేష్ శివమణి సమక్షంలో వేడుకగా జరిగిన ప్రారంభోత్సవంలో ఎఫ్పీవీలకు నామకరణం చేసిన శ్రీమతి ప్రియా పరమేష్ వాటిని లాంఛనంగా ప్రారంభించారువేడుకకు మరింత సంబరాన్ని జోడిస్తూ సీనియర్ నావికాదళ సిబ్బంది అధర్వణ వేదంలోని శ్లోకాలను పఠించారు.

 

నౌకా నిర్మాణానికి అవసరమైన సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేసుకున్నందుకు జీఎస్ఎల్ సంస్థనూఇతర భాగస్వామ్య పరిశ్రమలనూ తీరరక్షక దళ డీజీ అభినందించారుకీలక విజయాన్ని సాధించిన జీఎస్ఎల్ సిబ్బందిని ప్రశంసిస్తూ నిబద్ధతతో ‘ఆత్మ నిర్భరత’ వైపు ప్రయాణాన్ని కొనసాగించాలని సూచించారు.

 

కార్యక్రమంలో గోవా షిప్పింగ్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్మేనేజింగ్ డైరెక్టర్ బ్రజేష్ కుమార్ ఉపాధ్యాయభారత నావికా దళంతీర రక్షక దళంజీఎస్ఎల్ సంస్థల సీనియర్ అధికారులూనాణ్యతా ప్రమాణాలను పరిశీలించే క్లాసిఫికేషన్ సొసైటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2069058) आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil