మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
యువ సంగమ్ (అయిదో దశ) లో పాల్గొనడానికి ఆన్లైన్ నమోదులు మొదలు రిజిస్ట్రేషన్లను 2024 అక్టోబరు 21 వరకు స్వీకరిస్తారు
యువ సంగమ్ వివిధ దశల్లోని 114 యాత్రల్లో దేశం నలుమూలల నుంచి
4790 మందికి పైగా యువత పాలుపంచుకొన్నారు
Posted On:
10 OCT 2024 4:25PM by PIB Hyderabad
‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ (ఈబీఎస్బీ)లో భాగంగా నిర్వహిస్తున్న ‘యువ సంగమ్’ అయిదో దశలో పాలుపంచుకోవడానికి పేర్లు నమోదు చేసుకునేందుకు ఓ పోర్టల్ ను విద్యాశాఖ ఈ రోజు ప్రారంభించింది. దేశంలో వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల యువతీ యువకుల మధ్య బంధాన్ని బలపరచాలన్న ధ్యేయంతో భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే యువ సంగమ్. 2023 లో ప్రారంభించిన ఈ విశిష్ట కార్యక్రమంలో రాబోయే దశలో 18-30 ఏళ్ళ మధ్య ఉన్న యువతీ యువకులు, ప్రధానంగా విద్యార్థినీ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్, ఎన్వైకేఎస్ స్వయంసేవ కార్యకర్తలు, ఉద్యోగులు, స్వయం ఉపాధిని పొందుతున్నవారు, తదితరులు పాల్గొనేందుకు వారి పేర్లను యువ సంగమ్ పోర్టల్ మాధ్యమం ద్వారా నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్లను 2024 అక్టోబరు 21 వరకు స్వీకరిస్తారు. మరింత సమాచారం కోసం https://ebsb.aicte-india.org/ అన్న వెబ్ చిరునామాను సంప్రదించవచ్చు.
సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతిని స్మరించుకోవడానికి 2015 అక్టోబరు 31న ‘రాష్ట్రీయ ఏకతా దివస్’ ను నిర్వహించిన సందర్భంగా విభిన్న ప్రాంతాల ప్రజల మధ్య దీర్ఘకాలిక, వ్యవస్థాగత సాంస్కృతిక బంధాన్ని ఏర్పరచాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భావిస్తున్నారు. ఈ ఆలోచనకు కార్యరూపాన్ని ఇచ్చేందుకు ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ (ఈబీఎస్ బీ)ని 2016, అక్టోబరు 31న ప్రారంభించారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ ఏ విధంగా ఆరంభం అయిందీ, ఏ రూపాలలో పురోగమిస్తున్నదీ ఈ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ప్రత్యేక ప్రచారోద్యమాల తీరుతెన్నులను గురించిన సమాచారం ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఉంచిన పుస్తకం (https://ekbharat.gov.in/JourneySoFarCampaign/index.html)లో అందుబాటులో ఉంది.
ఈబీఎస్ బీలో భాగంగా మొదలు పెట్టిన యువ సంగమ్ పాంచ్ ప్రాణ్ లలోని రెండు తత్వాలను ప్రజల లోకి తీసుకు పోతుంది. ఏకత్వంలో ఉన్న శక్తి, వారసత్వాన్ని చూసుకొని గర్వించడం అన్నదే ఆ రెండు తత్వాలు. 2020 లో ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)లో కీలక ఇతివృత్తాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. భారతదేశపు సుసంపన్న భరిత వైవిధ్యానికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రత్యక్ష అనుభవంలోకి తెచ్చుకోవడంపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతున్నది. ఇది ఒక నిరంతర విద్య, సాంస్కృతిక అనుభూతుల సమాహారం. దీనిలో పాల్గొనేవారు జీవనం తాలూకు వివిధ పార్శ్వాలను క్షుణ్ణంగా గ్రహించడం, ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ నైసర్గిక ఆకృతులు, అభివృద్ధి చెందిన స్థలాలు, ఇంజినీరింగుకు, వాస్తు కళకు సంబంధించిన అద్భుతాలు, ఇటీవలి కార్యసాధనలు, ఆతిథ్యాన్ని ఇచ్చే రాష్ట్రంలో, కేంద్ర పాలిత ప్రాంతంలో అక్కడి స్థానిక యువతీ యువకులతో మాటామంతీ నెరపి, గాఢానుబంధాన్ని ఏర్పరచుకొనే అవకాశాన్ని అందుకొంటారు.
యువ సంగమ్ లో అయిదో దశ కోసం భారతదేశమంతటి నుంచి 20 ప్రముఖ సంస్థలను గుర్తించారు. ఆయా రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పాల్గొనే వారు వారి రాష్ట్రం తాలూకు, కేంద్ర పాలిత ప్రాంతం తాలూకు నోడల్ ఉన్నత విద్య సంస్థ (హెచ్ ఈఐ)ల నాయకత్వంలో వారికి జతగా ఎంపిక చేసిన రాష్ట్రాన్ని గాని, కేంద్రపాలిత ప్రాంతాన్ని గాని సందర్శిస్తారు.
జతలుగా గుర్తించిన రాష్ట్రాలు:
1. మహారాష్ట్ర - ఒడిశా
2. హర్యనా - మధ్య ప్రదేశ్
3. జార్ఖండ్ - ఉత్తరాఖండ్
4. జమ్మూకాశ్మీర్ - తమిళ నాడు
5. ఆంధ్ర ప్రదేశ్ - ఉత్తర్ ప్రదేశ్
6. బీహార్ - కర్నాటక
7. గుజరాత్ - కేరళ
8. తెలంగాణ - హిమాచల్ ప్రదేశ్
9. అస్సామ్ - ఛత్తీస్గఢ్
10. రాజస్థాన్ - పశ్చిమ బెంగాల్
యువ సంగమ్ యాత్రలు కొనసాగే కాలంలో, అయిదు విస్తృత రంగాలకు (హిందీ లో 5 పీ లు) కు చెందిన (వీటిలో పర్యటన, పరంపర, ప్రగతి, పరస్పర సంపర్కం (పీపుల్- టు- పీపుల్ కనెక్ట్), ఇంకా ప్రౌద్యోగికీ అంటే సాంకేతిక విజ్ఞానం రంగాలు ఉన్నాయి) బహుళ పార్శ్వాలను గురించి అయిదు నుండి ఏడు రోజులలో (యాత్ర సాగే రోజులు మినహాయించి) సందర్శక బృందం సభ్యులకు వివరిస్తారు. యువ సంగమ్ లో ఇంతవరకు ముగిసిన దశలలో ఉత్సాహం వెల్లువెత్తింది. ఆఖరి దశలో రిజిస్ట్రేషన్లు 44,000కు మించాయి. ఇంతవరకు, దేశం నలుమూలల నుంచి 4,795 మంది యువతీ యువకులు యువ సంగమ్ వివిధ దశలలో భాగంగా (2022వ సంవత్సరంలో చేపట్టిన ప్రయోగాత్మక దశ కూడా కలుపుకొని) 114 యాత్రలలో పాల్గొన్నారు.
‘సంపూర్ణ ప్రభుత్వం’ దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తున్న యువ సంగమ్ ఉద్యమాన్ని దీనిలో భాగస్వామ్యం వహిస్తున్న మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహిస్తూ వస్తున్నారు. వీటిలో హోం శాఖ, సాంస్కృతిక శాఖ, పర్యటన శాఖ, యువజన వ్యవహారాలు - క్రీడల శాఖ, సమాచార - ప్రసార శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి విభాగం (డీఓఎన్ఈఆర్)తో పాటు రైల్వేలు కలిసి ఉన్నాయి. ప్రతి ఆసక్తిదారుకూ వారివైన భూమికలు, బాధ్యతలంటూ ఉన్నాయి. ప్రతినిధుల ఎంపిక, యువ సంగమ్ యాత్రలను చివరికంటా నిర్వహించే బాధ్యత ఉన్నత విద్య సంస్థలదే (జాబితా అనుబంధం లో ఉంది.); ఇవి ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోతుంటాయి.
అనుబంధం
యువ సంగమ్ అయిదో దశ కోసం జతలుగా గుర్తించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఉన్నత విద్య సంస్థలు.
క్ర.సం.
|
ఒకటో రాష్ట్రం
|
ఉన్నత విద్య సంస్థ పేరు
|
రెండో రాష్ట్రం
|
ఉన్నత విద్య సంస్థ పేరు
|
1
|
మహారాష్ట్ర
|
ఐఐఎమ్ ముంబయి
|
ఒడిశా
|
ఐఐటీ భువనేశ్వర్
|
2
|
హర్యానా
|
సీయూ హరియాణా
|
మధ్య ప్రదేశ్
|
ఐజీఎన్టీయూ అమర్కంటక్
|
3
|
జార్ఖండ్
|
ఐఐటీ ధన్ బాద్
|
ఉత్తరాఖండ్
|
ఐఐటీ రూడ్ కీ
|
4
|
జమ్మూకాశ్మీర్
|
ఐఐఎమ్ జమ్ము
|
తమిళనాడు
|
ఎన్ఐటీటీటీఆర్ చెన్నై
|
5
|
ఆంధ్ర ప్రదేశ్
|
ఎస్ పీఏ, విజయవాడ
|
ఉత్తర్ ప్రదేశ్
|
ఐఐటీ అలహాబాద్
|
6
|
బీహార్
|
సీయూ ఆఫ్ బిహార్, గయ
|
కర్ణాటక
|
ఐఐటీ ధారవాడ
|
7
|
గుజరాత్
|
ఐఐటీ గాంధీనగర్
|
కేరళ
|
ఐఐటీ కొట్టాయం
|
8
|
తెలంగాణ
|
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ,
హైదరాబాద్
|
హిమాచల్ ప్రదేశ్
|
ఎన్ఐటీ, హమీర్ పుర్
|
9
|
అస్సాం
|
అసోమ్ యూనివర్సిటీ, సిల్ చర్
|
ఛత్తీస్ గఢ్
|
ఐఐఎమ్ రాయ్ పుర్
|
10
|
రాజస్థాన్
|
ఐఐటీ జోధ్ పుర్
|
పశ్చిమ బెంగాల్
|
ఐఐఈఎస్ టీ, శిబ్ పుర్
|
***
(Release ID: 2064088)
Visitor Counter : 156