రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రేపు తెలంగాణకు రానున్న రాష్ట్రపతి

Posted On: 27 SEP 2024 6:44PM by PIB Hyderabad


భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రేపు (సెప్టెంబరు 28న) తెలంగాణలో పర్యటించనున్నారు.

ఒక రోజు పర్యటనలో భాగంగా, రాష్ట్రపతి హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం 2024ను ఆమె ప్రారంభిస్తారు. ఎనిమిది రోజుల పాటు సాగే ఈ కళా మహోత్సవంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల కళలు, సంస్కృతి, హస్తకళలు, వైవిధ్యమైన వంటకాలను ప్రదర్శిస్తారు.  


 

*****


(Release ID: 2059719)