రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

డీఆర్డీవో, ఐఎన్ఏఈ సంస్థల నేతృత్వంలో హైదరాబాద్ లో 11వ ఇంజనీర్ల సదస్సు: నూతన సాంకేతికతలు, స్వదేశీకరణ పురోగతిపై చర్చ

Posted On: 26 SEP 2024 4:08PM by PIB Hyderabad

రక్షణ పరిశోధనఅభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత జాతీయ ఇంజనీర్ల అకాడమీ (ఐఎన్ఏఈ)ల ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ లో11వ ఇంజనీర్ల సదస్సు ప్రారంభమయిందిరెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రధానమైన వ్యూహాత్మక అంశాలైన- 3డీర ప్రింటింగ్ విధానంలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీరక్షణ ఉత్పత్తుల్లో టెక్నాలజీలపై లోతైన చర్చలు జరుగుతాయిడీఆర్డీవోకు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్డీఎల్లో నిర్వహిస్తున్న ఈ సదస్సు వేదికగా నూతన సాంకేతికతలుస్వదేశీ ఉత్పత్తుల సాధనలో తాజా పరిణామాల గురించి చర్చించేందుకు ఇంజనీర్లుశాస్త్రవేత్తలుపరిశ్రమ ప్రముఖులువిద్యావేత్తలు సమావేశమవుతున్నారు.

అణుశక్తి కమిషన్ మాజీ ఛైర్మన్ శ్రీ అనిల్ కాకోద్కర్డీఆర్డీవో ఛైర్మన్ప్రభుత్వ రక్షణ పరిశోధనఅభివృద్ధి విభాగం కార్యదర్శి డాక్టర్ వికామత్ సంయుక్తంగా ఈ సదస్సుని ప్రారంభించారుడీఆర్డీఎల్ హైదరాబాద్ డైరెక్టర్ శ్రీ జి.శ్రీనివాసమూర్తిక్షిపణులువ్యూహాత్మక వ్యవస్థల సంస్థ (మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్) డైరెక్టర్ జనరల్ శ్రీ యురాజబాబుఐఎన్ఏఈ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఇంద్రనీల్ మన్నా కార్యక్రమంలో ప్రసంగించారు.



(Release ID: 2059277) Visitor Counter : 39


Read this release in: Tamil , English , Urdu , Hindi