జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav g20-india-2023

అధిక ప‌ని భారం కార‌ణంగా మ‌ర‌ణించిన ఛార్డ‌ర్డ్ అకౌంటెంట్ ఘ‌ట‌న‌ను

సుమోటోగా స్వీక‌రించి విచార‌ణ ప్రారంభించిన జాతీయ మాన‌వ‌ హ‌క్కుల క‌మిష‌న్

పుణే ఘ‌ట‌న‌పై తీవ్రమైన ఆందోళనను వ్యక్తం చేసిన ఎన్ హెచ్ఆర్ సీ

వ్యాపార సంస్థ‌లు మానవ హక్కుల సమస్యల పట్ల జవాబుదారీగా ఉండాలని ప్ర‌త్యేకంగా పేర్కొన్న‌ ఎన్ హెచ్ ఆర్ సీ


ప్ర‌పంచ‌ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా వ్యాపార సంస్థ‌లు త‌మ‌ పని సంస్కృతి, ఉపాధి విధానాలను, నిబంధనలను స‌మీక్షించుకోవాల‌ని కోరిన ఎన్ హెచ్ ఆర్ సీ

నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు నోటీసు జారీ చేసిన ఎన్ హెచ్ ఆర్ సీ

ఇటాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా ఏఏ చ‌ర్య‌లు ప్ర‌తిపాదిస్తున్నారో నివేదిక‌లో పొందుప‌ర్చాల‌ని కోరిన ఎన్ హెచ్ ఆర్ సీ

Posted On: 21 SEP 2024 7:18PM by PIB Hyderabad

కేరళకు చెందిన 26 ఏళ్ల మ‌హిళా చార్టర్డ్ అకౌంటెంట్ 2024 జూలై 20న అధిక పనిభారం కారణంగా చనిపోయిందని మీడియాలో వచ్చిన వార్తలను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్ హెచ్ ఆర్ సీసుమోటోగా విచారణకు స్వీకరించిందిమహారాష్ట్రలోని పుణేలోగ‌ల‌ ఎర్నెస్ట్ అండ్ యంగ్‌ సంస్థలో ఆమె ప‌ని చేస్తున్నారునాలుగు నెలల కిందటే ఆమె ఆ సంస్థ‌లో చేరారుఎక్కువ గంటలు పని చేయడం వల్ల తన కుమార్తె శారీరకమానసిక ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ద‌ని ఛార్టెర్డ్ అకౌంటెంట్‌ తల్లి ఎర్నెస్ట్ అండ్ యంగ్‌ కంపెనీ యాజ‌మాన్యానికి లేఖ రాసిందిఅయితే ఆ లేఖ‌ను స‌ద‌రు కంపెనీ తిరస్కరించిందిఈ ఘ‌ట‌న‌పై కేంద్ర కార్మికఉపాధి మంత్రిత్వ శాఖ విచారణ జరుపుతోంది.

 

మీడియా వార్త‌ల్లోని  విషయాలు నిజమైతేతాము ప‌ని చేస్తున్న కంపెనీల్లో యువ‌త నిత్యం ఎదుర్కొంటున్న సవాళ్లుమానసిక ఒత్తిడిఆందోళన,  నిద్రలేమిఅసాధ్యమైన లక్ష్యాల సాధ‌న‌ కోసం ప‌ని చేయ‌డంస‌మ‌యానికి ప‌ని పూర్తి చేయాల‌నే ల‌క్ష్యంతో ప‌ని చేయ‌డం త‌దిత‌రాలు వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్న‌ట్టుగా భావించాల్సి వ‌స్తోంద‌ని కమిషన్ పేర్కొందిఇది వారి మానవ హక్కులకు సంబంధించి తీవ్ర‌ ఉల్లంఘ‌నేన‌ని క‌మిష‌న్ త‌న ప‌రిశీల‌న‌లో వివ‌రించింది

త‌మ‌ ఉద్యోగులకు భ‌ద్ర‌మైన‌, సుర‌క్షిత‌మైన సానుకూల వాతావరణాన్ని అందించడం ప్రతి యజమాని ప్రధాన విధి అని ఎన్ హెచ్ ఆర్ సీ  వివ‌రించింది.. ప్ర‌తి సంస్థ తమతో పని చేసే ప్రతి ఒక్కరినీ గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో చూసుకోవాల‌ని కోరింది. 

 

మానవ హక్కుల సమస్యల విష‌యంలో వ్యాపార సంస్థ‌లు జవాబుదారీగా ఉండాలని, ప్రపంచ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా వారి పనిఉపాధి విధానాలనూనిబంధనలను క్రమం తప్పకుండా ఆధునీక‌రించాల‌ని కమిషన్ స్ప‌ష్టం చేసిందిపుణే కేసులో యువ ఉద్యోగి దుర్మరణం చెందిన నేప‌థ్యంలో దేశంలో ఇలాంటి సంఘటన‌లు పున‌రావృతం కాకుండాఈ విషయంలో సంబంధిత వ్య‌క్తులుసంస్థ‌లు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ సూచించింది.

ఈ ఘ‌ట‌న‌పై వివరణాత్మక నివేదికను కోరుతూ కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖకు ఎన్ హెచ్ ఆర్ సీ నోటీసు జారీ చేసిందియువ ఉద్యోగి మరణానికి సంబంధించిన కేసు దర్యాప్తు ఫలితాలను తెలియ‌జేయాల‌ని కోరిందిఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకుంటున్న చ‌ర్య‌లతోపాటుతీసుకోవాల్సిన ప్ర‌తిపాదిత‌ చర్యలను కూడా తెలియ‌జేయాల‌ని కమిషన్ కోరిందినాలుగు వారాల్లో కేంద్ర కార్మిక శాఖ‌నుంచి జ‌వాబు వ‌చ్చే అవకాశం ఉంది.

దుర్మ‌ర‌ణంపాలైన అమ్మాయి తల్లి తన కుమార్తె మరణంపై చేసిన ఆరోప‌ణ‌లు సెప్టెంబర్ 18, 2024న మీడియాలో వ‌చ్చాయిత‌న కూతురు ప‌ని చేస్తున్న‌ సంస్థ‌లో నెల‌కొన్న‌ భారీ ప‌ని సంస్కృతి ఆమె మరణానికి కార‌ణ‌మ‌నిక‌ష్ట‌ప‌డి ప‌ని చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తూఅదే స‌బ‌బ‌నేలాగా ఒత్తిడి చేయ‌డంవ‌ల్ల ఆ అమ్మాయి ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ద‌ని త‌ల్లి పేర్కొన్నారు. 

విలువలు ,మానవ హక్కుల గురించి మాట్లాడే సంస్థ తన స్వంత ఉద్యోగి అంత్యక్రియలకు కూడా హాజ‌రు కాలేద‌ని ఆ త‌ల్లి ఆవేద‌న చెందిన‌ట్టు మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. 

హర్యానాతమిళనాడు రాష్ట్రాల్లోని రెండు బహుళ జాతి కంపెనీలు త‌మ కార్యాలయాల్లో అమ‌లు చేస్తున్న అన్యాయమైన పద్ధతులకు సంబంధించి ఇటీవ‌ల‌ వ‌చ్చిన‌ మీడియా వార్త‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ కమిషన్ ఆ ఘ‌ట‌న‌ల్ని సుమోటోగా తీసుకున్న‌ విష‌యం తెలిసిందేప్ర‌స్తుతం ఆ రెండు ఘ‌ట‌న‌లు కమిషన్ పరిశీలనలో ఉన్నాయివ్యాపార సంస్థ‌లు త‌మ సంస్థాగ‌త సంస్కృతిలో మాన‌వ‌హ‌క్కుల సంర‌క్ష‌ణ‌నుభ‌ద్ర‌త‌ను భాగం చేయాల‌ని వివిధ వేదిక‌ల‌ ద్వారా క‌మిష‌న్ సూచిస్తోందిముఖ్యంగా మ‌హిళా ఉద్యోగుల విష‌యంలో ఈ  ప‌ని చేయాల‌ని చెబుతోందితాము సుస్థిరంగా అమ‌లు చేస్తున్న విధానాలనేవి ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ని వాతావ‌ర‌ణానికీ,  ఉద్యోగుల సంక్షేమానికీ దోహ‌దం చేయాల‌ని క‌మిష‌న్ కోరుతోంది.

 

మానవ హక్కులపై వివిధ సంస్థ‌ల‌కు ముఖ్యంగా వ్యాపార, పరిశ్రమలకు చెందిన సంస్థ‌ల‌కు అవగాహన కల్పించడానికి 'మానవ హక్కులు,  వ్యాపార సంస్థ‌ల్లో త‌లెత్తే సమస్యలను సమన్వయం చేయడం'పై ఒక సమావేశాన్ని గత సంవత్సరం క‌మిష‌న్ నిర్వహించిందివ్యాపార సంస్థ‌ల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు దారి తీసే వివిధ పద్ధతులనుపని వాతావరణాన్ని పరిశీలించడానికి ప్రత్యేక మానిటర్ ని క‌మిష‌న్ నియమించింది. 

వ్యాపార సంస్థ‌ల ప‌రిస్థితులు,  మానవ హక్కులకు సంబంధించి ఇప్పటికే ఉన్న చట్టాలనునిబంధనలను సమీక్షించివాటి మెరుగుదల కోసం చర్యలను సూచించడానికి ప్రత్యేకంగా 'వ్యాపార సంస్థ‌లుమానవ హక్కులపై కోర్ గ్రూప్స్ ని క‌మిష‌న్ ఏర్పాటు చేసిందికోర్ గ్రూప్ ఇచ్చే నివేదిక‌ ఆధారంగాకమిషన్ తన సిఫార్సులను ప‌టిష్టం చేస్తుందిఆ త‌ర్వాత వాటిని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వాటిలో భాగ‌మైన సంస్థ‌ల‌కు పంపుతుందిత‌ద్వారా ఆయా వ్యాపార‌సంస్థ‌ల్లోప‌రిశ్ర‌మ‌ల్లో మాన‌వ హ‌క్కులుఆరోగ్య‌క‌ర‌మైన ప‌ని వాతావ‌ర‌ణం నెల‌కొనేలా చూస్తుంది. 

 

***



(Release ID: 2057714) Visitor Counter : 18


Read this release in: English , Urdu , Hindi , Marathi