వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లోని వియంటియానే లో ఈ నెల 20, 21 తేదీలలో పర్యటించనున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్


ఏషియాన్ - ఇండియా ఆర్థిక మంత్రుల ఇరవై ఒకటో సమావేశంలోను, ఈస్ట్ ఏషియా సమిట్ ఆర్థిక మంత్రుల పన్నెండో సమావేశంలోను శ్రీ పీయూష్ గోయల్ పాల్గొంటారు

నాడు పోస్టు చేయడమైనది: 20 SEP 2024 10:39AM by PIB Hyderabad

వాణిజ్యంపరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ నెల 20, 21వ తేదీల్లో లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ (లావోస్)లో వియంటియాని సందర్శించనున్నారుఆయన ఏషియాన్-ఇండియా ఎకనామిక్ మినిస్టర్స్ (ఎఇఎమ్-ఇండియాఇరవై ఒకటో సమావేశంతో పాటుఈస్ట్ ఏషియా సమిట్ ఎకనామిక్ మినిస్టర్స్ మీటింగ్ (ఇఎఎస్  ఇఎమ్ఎమ్పన్నెండో శిఖరాగ్ర సమావేశంలో కూడా పాలుపంచుకోనున్నారు. ఏషియాన్ తన సభ్యదేశాలతో ఏటా నిర్వహించే ఈ సమావేశాలకు లావో పీడీఆర్ ఆతిధ్య దేశంగా వ్యవహరిస్తోందిఈ సంవత్సరంలో ఏషియాన్ కు అధ్యక్ష పదవి బాధ్యతలను నిర్వహిస్తున్న లావో పిడిఆర్ ఆ హోదాలోనే ఈ సమావేశాలకు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

ఈస్ట్ ఏషియా సదస్సుఎకనామిక్ మినిస్టర్స్ మీటింగ్ (ఇఎఎస్  ఇఎమ్ఎమ్లో ఏషియాన్ లోని పది దేశాల ఆర్థిక మంత్రులుఇఎఎస్ లోని ఇతర భాగస్వామ్య దేశాల (అంటే భారతదేశంఅమెరికారష్యాచైనాజపాన్కొరియాఆస్ట్రేలియాన్యూజీలాండ్ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు.

ఏషియాన్-ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ (ఎఐటిఐజిఎకు సంబంధించిన సమీక్షా పరమైన సంప్రదింపులలో పురోగతి ఎంత చోటుచేసుకొందీ మంత్రులు ఎఇఎమ్-ఇండియా సమావేశం సందర్భంగా పరిశీలించనున్నారు. ఎఐటిఐజిఎ ని వినియోగదారులకు మరింత అనుకూలమైన విధంగా తీర్చిదిద్దాలనేది ఈ సమావేశాలలో ప్రాథమ్యంగా ఉండబోతోంది. ప్రాంతీయఅంతర్జాతీయ ఆర్థిక పరిణామాలపైన మంత్రులు ఈస్ట్ ఏషియా సదస్సు ఆర్థిక మంత్రుల (ఇఎఎస్ ఇఎమ్ఎమ్సమావేశంలో భాగంగా చర్చోపచర్చలను జరపనున్నారు. భారతదేశం ఈస్ట్ ఏషియా సమిట్ ఫోరానికి వ్యవస్థాపక సభ్యత్వ దేశంగా ఉంది. ఈ ఫోరమ్ వచ్చే సంవత్సరంలో రెండు దశాబ్దాల కాలాన్ని పూర్తి చేసుకోనున్నది.

ఈ రెండు సంస్థాగత సమావేశాలకు కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ హాజరైఈ సమావేశాలలో పాలుపంచుకొనే దేశాల మంత్రులతో అనేక ద్వైపాక్షిక సమావేశాల్లో భేటీ కానున్నారు. ఆతిథ్య దేశమైన లావో పిడిఆర్ తో పాటు కొరియామలేషియాస్విట్జర్లాండ్ఇంకా మయన్మార్ల మంత్రులతో సమావేశాలను ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీ పీయూష్ గోయల్ఏషియా సెక్రటరీ జనరల్ తోనుఇఆర్ఐఎ అధ్యక్షుడితోను సమావేశం కానున్నారు. లావో పిడిఆర్ లో ప్రవా భారతీయులతో కూడా మంత్రి సమావేశం కానున్నారు. ఆయన భారతదేశం నుంచి లావోస్ కు విచ్చేసే పరిశ్రమ ప్రతినిధి వర్గంతోఏషియాన్ తో సైతం భేటీ కానున్నారు.

భారతదేశం 1992 లో ఏషియాన్ లో చేరి2022లో ఈ కూటమి లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య దేశం హోదా ను పొందింది. గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2014 లో ప్రకటించగాఅప్పటి నుంచి భారతదేశం అనుసరిస్తూ వస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ లో ఏషియాన్ ది కీలక భూమిక. మన దేశానికి అతి ప్రధాన వ్యాపార భాగస్వాములలో ఒకటిగా ఉన్న ఏషియాన్ గత రెండు సంవత్సరాలలో మన దేశానికి రెండో అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా రూపొందింది.

 

****


(రిలీజ్ ఐడి: 2057305) సందర్శకుల సూచీ సంఖ్య : : 79
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Tamil