రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav g20-india-2023

దేవి అహల్యా విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి

Posted On: 19 SEP 2024 8:01PM by PIB Hyderabad

రాష్ట్రపతిశ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు (సెప్టెంబర్ 19, 2024) మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దేవి అహల్య విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.


 

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ స్నాతకోత్సవమనేది సంబరం మాత్రమే కాదనిభవిష్యత్తు కోసం దృఢ నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం కూడానని విద్యార్థులతో అన్నారుఏదైనా వృత్తిలోకి ప్రవేశించాలా లేక ఉన్నత విద్యకు వెళ్లాలా అన్న విషయంలో కొందరు ఒక నిర్ణయం ఇప్పటికే తీసుకుని ఉంటారుకానీ వారిలో చాలామంది ఇప్పటికీ ఉద్యోగం చేయాలాలేదా మరింత చదువుకోవాలావ్యాపారవేత్తగా మారాలాలేదా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలా అనే విషయంలో అయోమయంలోనే ఉంటారువారి భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని  ఆమె వారికి సూచించారుఈ నిర్ణయం వారి జీవిత దిశను నిర్దేశిస్తుందన్నారు.

ప్రతి విద్యార్థికి భిన్నమైన సామర్థ్యాలు ఉంటాయని రాష్ట్రపతి అన్నారుభవిష్యత్తులో వారు ఏ ఫీల్డ్ లేదా పొజిషన్‌లో పని చేస్తారనే నిర్ణయం వారి సామర్థ్యంఆసక్తిపై ఆధారపడి ఉండాలని తెలిపారుజ్ఞాన సముపార్జన ప్రక్రియను ఎప్పుడూ ఆపవద్దని ఆమె వారికి సూచించారుపరిజ్ఞానంఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించాలని చెప్పారుస్థిరమైన అభివృద్ధి పట్ల స్పృహ కలిగి ఉండాలని ఆమె సూచించారుప్రతి ఒక్కరి అభివృద్ధిలోనే తమ అభివృద్ధి దాగి ఉందన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు.


 

ఇండోర్‌కు చెందిన మహారాణి లోకమాతా దేవి అహల్యాబాయి హోల్కర్ జీవితం మహిళా సాధికారతకు గొప్ప ఉదాహరణ అనిఅందుకే ఈ విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెట్టారని రాష్ట్రపతి అన్నారుఆమె జీవితంలోపాలనలోమహిళలు సాధికారతస్వావలంబన కోసం ఆమె అనేక వినూత్నమైనవిజయవంతమైన ప్రయత్నాలు చేసిందని తెలిపారుగిరిజన సమాజానికి జీవనోపాధి కల్పించేందుకు ఆమె నిర్ణయాలు తీసుకుని వారి అభివృద్ధికి ఎన్నో పనులు చేశారురాజకీయంగాసామాజికంగాఆర్థికంగాఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లోనూ మహిళలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలరనడానికి ఆమె జీవితమే ఉదాహరణ అని రాష్ట్రపతి అన్నారుమహారాణి దేవి అహల్యాబాయి ఆశయాలకు అనుగుణంగా ఈ స్నాతకోత్సవంలో పతకాలు సాధించిన వాళ్లలో బాలుర కంటే బాలికల సంఖ్య ఎక్కువగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

బాలికలు ఉన్నత విద్యను అభ్యసించేలాస్వావలంబన పొందేలా ప్రోత్సహించాలని విద్యా సంస్థలుఉపాధ్యాయులను రాష్ట్రపతి కోరారువారి సహకారంమార్గదర్శకత్వంతో మన ఆడబిడ్డలు పెద్ద కలలు కంటూ ఆ కలలను సాకారం చేస్తేనే విద్యాసంస్థలుఉపాధ్యాయులు దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతారని అన్నారు.

***



(Release ID: 2056969) Visitor Counter : 21