వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

హైదరాబాద్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ లో జరిగిన ‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న సహాయ మంత్రి శ్రీ భగీరథ్ చౌధరి


స్వచ్ఛతా హీ సేవా - 2024: అధిక శాతం వ్యవసాయ, రైతుల సంక్షేమ విభాగం
కార్యాలయాల్లో ‘స్వచ్ఛత ప్రతిజ్ఞ’ స్వీకరణ-మొక్కలను పెంచే కార్యక్రమం

వివిధ సెక్షన్‌లలో కార్యదర్శి డాక్టర్ దేవేష్ చతుర్వేది స్వచ్ఛత పర్యవేక్షణ

Posted On: 18 SEP 2024 2:08PM by PIB Hyderabad

‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’ (‘‘తల్లి  పేరిట ఒక మొక్కను నాటడం’’) కార్యక్రమాన్ని నిన్నటి రోజున హైదరాబాద్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ లో నిర్వహించగా, కేంద్ర వ్యవసాయ - రైతుల సంక్షేమ శాఖ  సహాయ మంత్రి శ్రీ భగీరథ్ చౌదరి వీడియో కాన్ఫరెన్స్  ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వ్యవసాయ, రైతుల సంక్షేమ విభాగం కార్యదర్శి డాక్టర్ దేవేష్ చతుర్వేది కృషి భవన్ లో వివిధ సెక్షన్ లలో కలియదిరుగుతూ స్వచ్ఛత సంబంధి కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయనే అంశంపై దృష్టి సారించారు.  బీరువాల పైన పెట్టిన/బీరువాలకు బయట వదలి వేసిన కాగితాలు/ ఫైళ్ళు/ పుస్తకాలు వంటివి పరిశీలించి, అలాంటివాటిపై తగిన చర్యలను తీసుకోవాలంటూ ఆయా సెక్షన్ ల అధికారులను ఆయన ఆదేశించారు.  ఉపయోగంలో లేని కార్యాలయ సామగ్రిని/వాడకుండా ఉన్న వస్తువులను వెనువెంటనే వదలించుకోవలసిందిగా కూడా ఆయన సూచించారు.

విభాగంలోని అధికారులు ఈ రోజున స్వచ్ఛత ప్రతిజ్ఞ పాఠాన్ని స్వీకరించేటట్లు కూడా వ్యవసాయం, రైతుల సంక్షేమం విభాగ కార్యదర్శి శ్రద్ధ తీసుకొన్నారు.

‘స్వచ్ఛతా హీ సేవా-2024’ (ఎస్‌హెచ్ఎస్-2024) ప్రచార ఉద్యమానికి తాగునీరు,  పారిశుధ్యం విభాగంతో పాటు గృహ నిర్మాణం -పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల 17 అక్టోబరు 1  మధ్యకాలం లో నాయకత్వం వహించనున్నాయి. ‘స్వభావ్ స్వచ్ఛతా - సంస్కార్ స్వచ్ఛతా’  అంశాలు ఈ ఉద్యమానికి ఇతివృత్తంగా ఉన్నాయి. అక్టోబరు 2 న  ‘స్వచ్ఛ్ భారత్ దివస్’గా పాటించనున్నారు.
ఈ ప్రచార ఉద్యమంలో వ్యవసాయం, రైతుల సంక్షేమ విభాగం చురుకుగా పాల్గొంటోంది.  ‘స్వచ్ఛతా హీ సేవా-2024’ ప్రచార ఉద్యమ కాలంలో దేశవ్యాప్తంగా ఈ విభాగానికి చెందిన అన్ని సబార్డినేట్ కార్యాలయాలు/అనుబంధ కార్యాలయాలు/స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు/ ప్రభుత్వ రంగ సంస్థలు/క్షేత్ర కార్యాలయాలు కలసికట్టుగా సుమారు 600  స్వచ్ఛత సంబంధిత కార్యకలాపాలను చేపట్టనున్నాయి.

ఈ ప్రచార ఉద్యమం ప్రారంభ దినాన వ్యవసాయ, రైతుల సంక్షేమ విభాగం వివిధ కార్యక్రమాలను నిర్వహించింది.  స్వచ్ఛత ప్రతిజ్ఞ ను పూనిన కార్యాలయాలలో స్మాల్  ఫార్మర్స్ ఎగ్రి బిజినెస్ కన్సార్షియమ్, డైరెక్టరేట్ ఆఫ్ కేశూనట్ ఎండ్ కొకొవా డెవలప్‌మెంట్;   నేషనల్ హార్టికల్చర్ బోర్డు; కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డ్; నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్;    డైరెక్టరేట్ ఆఫ్ షుగ‌ర్‌కేన్ డెవలప్‌మెంట్; డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్;  డైరెక్టరేట్ ఆఫ్ రైస్ డెవలప్‌మెంట్; ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్  ఆథారిటి; చౌధరి చరణ్ సింగ్ వ్యవసాయ మార్కెటింగ్ విషయాల జాతీయ సంస్థ; డైరెక్టరేట్ ఆఫ్ జూట్ డెవలప్‌మెంట్;  నార్తర్న్ రీజియన్  ఫార్మ్ మిషనరీ ట్రయినింగ్ అండ్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్;   డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారన్ టీన్ అండ్ స్టోరేజ్ లతో పాటు నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఎగ్రీకల్చరల్  ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ లు ఉన్నాయి.
ఈ కార్యక్రమాలకు తోడు ‘ఏక్ పేడ్ మా కే నామ్/ మొక్కల పెంపకం సంబంధిత కార్యకలాపాల’ను అమలుపరచిన కార్యాలయాలలో డైరెక్టరేట్ ఆఫ్ ఎరీకనట్ అండ్  స్పైసెస్ డెవలప్‌మెంట్ (కాలికట్); డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్‌పెక్షన్ (ఫరీదాబాద్); మహలనోబిస్ నేషనల్ క్రాప్ ఫోర్‌కాస్ట్ సెంటర్;  నేషనల్ సీడ్ రిసర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (వారాణసీ); డైరెక్టరేట్ ఆఫ్  కేశూనట్ అండ్ కొకొవా డెవలప్‌మెంట్; నేషనల్ హార్టీకల్చర్ బోర్డ్;  కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డ్;  డైరెక్టరేట్ ఆఫ్  షుగర్‌కేన్ డెవలప్‌మెంట్; డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్; డైరెక్టరేట్ ఆఫ్ రైస్ డెవలప్‌మెంట్; చౌధరి చరణ్ సింగ్ వ్యవసాయ మార్కెటింగ్ విషయాల జాతీయ సంస్థ; సెంట్రల్ అగ్‌మార్క్ లేబరేటరీ; డైరెక్టరేట్ ఆఫ్ కాటన్ డెవలప్‌మెంట్; నార్తర్న్ రీజియన్  ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్ టిట్యూట్; డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారన్ టీన్ అండ్ స్టోరేజ్;  ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్ ఆథారిటి; నేషనల్ ఇన్స్  టిట్యూట్ ఆఫ్ ఎగ్రీకల్చరల్  ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ లతో పాటు స్మాల్ ఫార్మర్స్ అగ్రో కన్సార్షియమ్ లు ఉన్నాయి.

 

***



(Release ID: 2056244) Visitor Counter : 28


Read this release in: English , Urdu , Hindi , Tamil