కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఈపీఎఫ్ మినహాయింపులపై పారదర్శక వ్యవస్థ: కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పిలుపు ఈపీఎఫ్వోతో కేంద్ర మంత్రి సమీక్ష

Posted On: 30 AUG 2024 5:14PM by PIB Hyderabad

మరింత పారదర్శకతజవాబుదారీతనానికి భరోసా కల్పించే దిశగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్మినహాయింపులకు సంబంధించి సభ్యులందరికీ పటిష్టపారదర్శకమైన వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర కార్మికఉపాధియువజన వ్యవహారాలుక్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)ను ఆదేశించారుఢిల్లీలో ఈపీఎఫ్ వో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఉద్యోగులకు తమ జీతాల్లో పీఎఫ్ కోతల గురించి క్రమం తప్పకుండా తెలియజేసే డిజిటల్ యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను డాక్టర్ మాండవీయ ఆదేశించారు. కాలపరిమితితో కూడిన ఆ యంత్రాంగాన్ని సమర్థవంతంగా రూపొందించాలని సూచించారు.

ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించాల్సిన ఆవశ్యకతను కూడా కేంద్ర మంత్రి స్పష్టంగా పేర్కొన్నారుఫిర్యాదులకు మూల కారణాలను గుర్తించివ్యవస్థాగతమైనసుస్థిర పరిష్కారాలను నిర్ణీత కాలవ్యవధిలో అందించేలా చూడాలని ఈపీఎఫ్ఓను ఆయన ఆదేశించారు.

యజమానులుఉద్యోగుల మధ్య నమ్మకాన్ని పెంపొందించడానికిపారదర్శకతను పెంచడానికిదేశంలో భవిష్య నిధి వ్యవస్థ మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ చర్యలు కీలకమని డాక్టర్ మాండవీయ స్పష్టం చేశారు.

 

***



(Release ID: 2050509) Visitor Counter : 8


Read this release in: English , Urdu , Hindi , Gujarati