రక్షణ మంత్రిత్వ శాఖ
రాజ్ కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి జరిగిన నష్టంపై నౌకాదళం ఆందోళన
Posted On:
26 AUG 2024 11:00PM by PIB Hyderabad
సింధుదుర్గ్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి సోమవారం (ఈ నెల 26న) ఉదయం నష్టం వాటిల్లిన సంగతి తెలిసి భారతీయ నౌకాదళం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ విగ్రహాన్ని 2023 డిసెంబరు 4న ‘నౌకాదళ దినం’ సందర్భంగా ఆవిష్కరించడం తో పాటు ఈ విగ్రహాన్ని సింధుదుర్గ్ పౌరులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.
దురదృష్టవశాత్తు జరిగిన ఈ దుర్ఘటనకు దారితీసిన కారణాలను ఆరా తీయడానికే కాకుండా, విగ్రహానికి మరమ్మతు చేసి పునరుద్ధరించి వీలైనంత త్వరగా పునఃస్థాపనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ స్పెషలిస్టులు మరియు సంబంధిత స్పెషలిస్టులతో కూడిన ఒక బృందాన్ని నౌకాదళం నియమించింది.
***
(Release ID: 2049164)