గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గనులు, ఖనిజాల రంగం పరిశ్రమ నేతలతో సమావేశం జరిపిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి


గనులు, ఖనిజాల రంగంలో సవాళ్ళు , అవకాశాలపై ఎం జి ఎం ఐ నిర్వహించిన జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ జి. కిషన్ రెడ్డి

భారతదేశం లోని విస్తారమైన సహజ వనరులు వికసిత్ భారత్ - 2047 వైపు దేశం ప్రయాణానికి, ఆత్మనిర్భరతను సాధించడానికి కీలకం కానున్నాయి.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం బొగ్గు, ఖనిజాల రంగంలో సమూల మార్పును తీసుకువచ్చి, దానిని పారదర్శకంగా, పోటీదాయకంగా మార్చింది

మిషన్ కోకింగ్ కోల్ , వాషరీ ల సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టడం వంటి కార్యక్రమాలు భారతదేశ బొగ్గు పర్యావరణ వ్యవస్థలో మార్పుకు నాంది పలుకుతాయి.

Posted On: 08 AUG 2024 4:43PM by PIB Hyderabad

మైనింగ్, జియోలాజికల్, మెటలర్జికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎం జి ఎం ఐ ) ఆధ్వర్యంలో గనులు, ఖనిజాల రంగంలో సవాళ్లు, అవకాశాలపై ఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో లో బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రసంగించారు.  గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వి.ఎల్.కాంతారావుతో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు, ప్రభుత్వ బొగ్గు , గనుల రంగ వాటాదారులు ఈ సదస్సు లో పాల్గొన్నారు.

గనులు, అన్వేషణ పరిశ్రమలకు సంబంధించిన ప్రైవేటు, ప్రభుత్వ రంగ కంపెనీల సి ఇ ఒ లతో శ్రీ కిషన్ రెడ్డి ఈ సందర్భంగా నిర్మాణాత్మక చర్చలు జరిపారు. ఇందులో  పరిశ్రమ ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సవాళ్లను మంత్రి దృష్టికి తెచ్చారు. వాటిని అధిగమించడానికి విలువైన ప్రతిపాదనలు, సలహాలు, సిఫారసులను అందించారు.

 

వారు ప్రస్తావించిన  అన్ని అంశాలు, ప్రతిపాదిత విధాన సూచనలను మంత్రిత్వ శాఖ క్షుణ్ణంగా సమీక్షించి చర్చిస్తుందని, సత్వర చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పాల్గొన్న ప్రతినిధులకు  శ్రీ రెడ్డి కృతజ్ఞతలు చెబుతూ, ఇలాగే ఎప్పటికప్పుడు సమాచారం పంచుకోవాలని కోరారు. సుపరిపాలనకు ఇటువంటి పరస్పర సమావేశాలు కీలకమని , ఇది పరిశ్రమ విశిష్ట స్వభావాన్ని , ప్రభుత్వ ప్రయత్నాలతో బలమైన సమన్వయం ప్రాముఖ్యతను ప్రదర్శిస్తాయని ఆయన  చెప్పారు.

పారిశ్రామికవేత్తల సమావేశంలో శ్రీ కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, భారతదేశ విస్తారమైన సహజ వనరులు వికసిత్ భారత్ - 2047 వైపు దేశం ప్రయాణానికి,  చిత్తశుద్ధితో ఆత్మనిర్భరతను సాధించడానికి కీలకం అవుతాయని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు, ఖనిజ రంగంలో ప్ర భుత్వం సమూల మార్పును తీసుకువచ్చిందని, ఇది పారదర్శకంగా, పోటీ దాయకంగా మారిందని ఆయన అన్నారు. బొగ్గు, ఖనిజ బ్లాకులకు వాణిజ్య వేలం విధానాన్ని ప్రవేశపెట్టడం, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఈ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గత దశాబ్దకాలంగా ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రయత్నాలను ఆయన వివరించారు.

క్లిష్ట ఖనిజాలు (క్రిటికల్ మినరల్స్)  ఆధునిక ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా ఆవిర్భవించాయని, నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ను ప్రారంభించడం ద్వారా దేశం ఈ అంతర్జాతీయ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి పేర్కొన్నారు.

ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ప్రాముఖ్యతను కూడా మంత్రి నొక్కి చెప్పారు భారతదేశ ఈ విస్తరణవంతమైన వృద్ధి కథలో భాగస్వాములు కావాలని పరిశ్రమ నాయకులకు పిలుపునిచ్చారు. సులభ వ్యాపారాన్ని పెంపొందించడానికి, వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి , దానితో ముడిపడి ఉన్న ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు. ఎక్స్ ప్లోరేషన్ లైసెన్స్, కాంపోజిట్ లైసెన్స్ హోల్డర్లకు 50% అన్వేషణ వ్యయాన్ని రీయింబర్స్ చేయడం వంటి కార్యక్రమాలు ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని ఆయన పేర్కొన్నారు.

బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, దేశీయ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి తీసుకుంటున్న చర్యలను శ్రీ కిషన్ రెడ్డి వివరించారు. 2030 నాటికి 140 మిలియన్ టన్నుల కోకింగ్ బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న మిషన్ కోకింగ్ కోల్, జాతీయ ఖనిజ విధానం 2019 ద్వారా సుస్థిర మైనింగ్ పద్ధతులను పెంపొందించే ప్రయత్నాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వంటి కార్యక్రమాలను శ్రీ రెడ్డి ప్రస్తావించారు. దిగుమతి భారాన్ని తగ్గించడానికి, దేశీయ పూర్తి అవసరాలను తీర్చడానికి కోల్ ఇండియా ఇప్పటికే ఉన్న వాషరీలను మెరుగుపరచడం , కొత్త వాటిని ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. మిషన్ కోకింగ్ కోల్ వంటి కార్యక్రమాలు , వాషరీస్ సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టడం వంటి కార్యక్రమాలు భారతదేశ బొగ్గు పర్యావరణ వ్యవస్థలో మార్పుకు నాంది పలుకుతాయని అన్నారు. 

 

ఖనిజాల విషయంలో,  వాటి అన్వేషణకు విస్తృత పెట్టుబడుల అవసరాన్ని శ్రీరెడ్డి అంగీకరించారు . మన సామర్థ్యాలను పెంచడానికి మరింత పరిశోధన, శాస్త్రీయ విచారణ , సహకారాల అవసరాన్ని నొక్కి చెప్పారు.

సుస్థిర మైనింగ్ లక్ష్యానికి అనుగుణంగా, 2029-30 నాటికి 100 మిలియన్ టన్నులను సాధించాలనే లక్ష్యంతో భూగర్భ  గనుల త్రవ్వకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు శ్రీ కిషన్ రెడ్డి చెప్పారు. ఇందుకు అనుగుణంగా బొగ్గు గ్యాసిఫికేషన్, కోల్ బెడ్ మిథేన్ (సిబిఎం) వాయువుల వెలికితీత, బొగ్గు నుంచి హైడ్రోజన్ ప్రక్రియల అన్వేషణ,  కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ (సిసిఎస్) తో సహా స్వచ్ఛమైన ఇంధన సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు.

 

మైనింగ్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలను పెంపొందించడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పారిశ్రామిక ప్రతినిధులకు మంత్రి పిలుపునిచ్చారు.  సుస్థిర మైనింగ్ రంగంలో సవాళ్లు, పరిష్కారాలపై నేటి సదస్సు సమగ్ర చర్చకు దోహదపడుతుందని భావిస్తున్నాను. సమీప భవిష్యత్తులో భారత్ ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ప్రైవేటు రంగ ఆవిష్కరణలు, కష్టనష్టాలను (రిస్క్) లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడం కీలకం కానున్నాయి” అని ఆయన అన్నారు. 

పారిశ్రామిక వృద్ధి , సుస్థిర అభివృద్ధి రెండింటి పట్ల ప్రభుత్వ నిబద్ధతను చాటి చెబుతూ ఈ సదస్సు భారతదేశ మైనింగ్ , ఖనిజాల రంగం భవిష్యత్తుపై బలమైన చర్చలకు , ఆలోచనలను పరస్పరం పంచుకోవడానికి ఒక వేదికను అందించింది, 

 

****

 


(Release ID: 2043410)