ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఐటీ నిబంధనలు- 2021 కింద 1,065 కేసులు నమోదు


937 కేసులకు గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీల పరిష్కారం

సురక్షిత, విశ్వసనీయమైన ఇంటర్నెట్ కోసం మధ్యవర్తుల జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తున్న ఐటి రూల్స్- 2021

Posted On: 02 AUG 2024 7:08PM by PIB Hyderabad

ప్రభుత్వం ఇంటర్నెట్ సంబంధిత వర్గాలతో  విస్తృత సంప్రదింపులు జరిపిన తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు, 2021 (ఐటి రూల్స్- 2021) ను 2021,  ఫిబ్రవరి 25 న నోటిఫై చేసింది. 2022, అక్టోబర్ 28, 2023 ఏప్రిల్ 6  తేదీల్లో వీటికి సవరణలు జరిగాయి.

సురక్షిత, విశ్వసనీయ అంతర్జాల సేవల పట్ల జవాబుదారీతనాన్ని పెంచేందుకు కొన్ని ప్రత్యేక సామాజిక మాధ్యమాల తో పాటు వివిధ సామాజిక మాధ్యమ సంస్థల మధ్యవర్తులపై నిర్దిష్ట చట్టపరమైన బాధ్యతలను ఉంచిన ఐటి రూల్స్- 2021 తెలియజేస్తున్నాయి.

 

గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీలు 2023, మార్చి 1 నుంచి 2024 జూన్ 30 వరకు  దాఖలు చేసిన, పరిష్కరించిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:

      • దాఖలైన కేసులు: 1,065

       • పరిష్కారమైన కేసులు: 937

ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద నేడు రాజ్యసభలో ఒక  ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు.

***



(Release ID: 2041193) Visitor Counter : 53