ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర ప్రభుత్వ (2024-25) పద్దులపై 2024 మే నెల వరకూ నెలవారీ సమీక్ష
Posted On:
28 JUN 2024 5:17PM by PIB Hyderabad
‘‘కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 2024 మే నెల వరకూ నెలవారీ పద్దుల సమన్వయం, నివేదిక వెల్లడి ప్రక్రియ పూర్తయింది. ముఖ్యాంశాలు కిందివిధంగా ఉన్నాయి:-
కేంద్ర ప్రభుత్వానికి 2024 మే నెల వరకూ రాబడి వసూళ్లు ₹5,72,845 కోట్లుగా (మొత్తం వసూళ్ల పరంగా 2024-25 బడ్జెట్ అంచనాల్లో 18.6 శాతం) నమోదయ్యాయి. ఇందులో ₹3,19,036 కోట్లు (కేంద్ర నికర) పన్ను రాబడి కాగా, పన్నేతర రాబడి ₹2,51,722 కోట్లు, రుణ వసూళ్ల కింద ₹2,087 కోట్లు బకాయేతర మూలధన రాబడి కూడా కలిసి ఉంది. ఈ మొత్తం వసూళ్ల నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రస్తుత కాలావధి వాటా కింద కేంద్ర ప్రభుత్వం ₹1,39,751 కోట్లు బదిలీ చేసింది. మునుపటి సంవత్సర కాలావధి మొత్తంతో పోలిస్తే ఇది ₹21,471 కోట్లు అధికం.
ఇదే కాలావధికిగాను కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయం ₹6,23,460 కోట్లుగా (2024-25 బడ్జెట్ అంచనాల్లో 13.1 శాతం) నమోదైంది. ఇందులో ₹4,79,835 కోట్లు రాబడి వ్యయం కాగా, ₹1,43,625 కోట్లు మూలధన వ్యయం. మొత్తం రాబడి వ్యయంలో, ₹1,23,810 కోట్ల మేర వడ్డీ చెల్లింపుల ఖాతా సంబంధితం కాగా, ₹54,688 కోట్లు ప్రధాన సబ్సిడీల ఖాతా కింద చెల్లించింది.
***
(Release ID: 2029479)
Visitor Counter : 219